NTR Ghat: ఆయన కొడుకుగా పుట్టడం అదృష్టం.. ఎన్టీఆర్ ఘాట్ లో బాలకృష్ణ, జూ.ఎన్టీఆర్ నివాళి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
NTR Ghat: టీడీపీ పార్టీ వ్యవస్థాపకుడు, దివంగత మాజీ సీఎం నందమూరి తారక రామారావు శత జయంతి సందర్భంగా ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఆయన కుటుంబ సభ్యులు నివాళులర్పించారు. ఎన్టీఆర్ తనయుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, మనవడు జూనియర్ ఎన్టీఆర్ నివాళులర్పించారు. ఈ సందర్భంగా బాలకృష్ణ మీడియాతో మాట్లాడారు. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఎన్టీఆర్ శత జయంతి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయన్నారు. సినిమాల్లోనే కాకుండా రాజకీయాల్లో కూడా తెలుగు ప్రజల రుణం తీర్చేందుకు ఎన్టీఆర్ టీడీపీని స్థాపించి పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారని అన్నారు.
ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని తెలిపారు. ఎన్టీఆర్ ప్రవేశపెట్టిన రూ.2 కేజీల బియ్యం పథకం నేడు ఆహార భద్రతగా మారిందని అన్నారు. మహిళలకు ఆస్తి హక్కు వంటి చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకున్నారని తెలిపారు. జాతీయ రాజకీయాల్లో ఎన్టీఆర్ కీలక పాత్ర పోషించారని అన్నారు. తన కొడుకుగా పుట్టడం అదృష్టంగా భావిస్తున్నానని బాలకృష్ణ అన్నారు. నటుడిగా, రాజకీయ నాయకుడిగా ఎన్టీఆర్ అన్ని రంగాల్లో తనదైన ముద్ర వేశారని అన్నారు. ఎన్టీఆర్ అందరికీ నచ్చే అరుదైన వ్యక్తి అని తెలిపారు. వారి శతాబ్ది ఉత్సవాలు ప్రపంచ వ్యాప్తంగా ఘనంగా జరిగాయన్నారు. తెలుగు వారికి ఎన్టీఆర్ చేసిన సేవలు చిరస్మరణీయం.
Also Read
- CM Revanth Reddy : నీట్-యూజీ 2026 రద్దు... మోడీ సర్కార్ ఫెయిల్
- Hyderabad: మరోసారి నేపాలీ గ్యాంగ్ హల్చల్.. సీసీ కెమెరాలు ధ్వంసం చేసి, పక్కా ప్లాన్తో దోపిడీ!
- KCR : బీఆర్ఎస్ సభ్యత్వ నమోదులో డిజిటల్ విప్లవం.. ఎర్రవెల్లిలో కేసీఆర్ సుదీర్ఘ మంతనాలు.!
- K Kavitha : కవితకు సమన్లు.. రేపు కోర్టుకు హాజరు కావాలని ఆదేశం..
ఎన్టీఆర్ ఘాట్ వద్ద జూనియర్ ఎన్టీఆర్ నివాళులర్పించారు. ఈ నేపథ్యంలో జూనియర్ ఎన్టీఆర్ కు కష్టాలు ఎదురయ్యాయి. ఘాట్ వద్ద అభిమానులు తమ ఉత్సాహాన్ని ప్రదర్శించారు. ఎన్టీఆర్తో సెల్ఫీ దిగేందుకు అభిమానులు పోటీ పడ్డారు. దీంతో నివాళులర్పించేందుకు జూనియర్లు ఇబ్బందులు పడ్డారు. దీంతో జూనియర్ ఎన్టీఆర్ అసహనం వ్యక్తం చేశారు.
ఎన్టీఆర్ జయంతి సందర్భంగా కుమారుడు నందమూరి రామకృష్ణ ఘాట్ వద్ద నివాళులర్పించారు. ఎన్టీఆర్ యుగపురుషుడు అని అన్నారు. ఎన్టీఆర్ శత జయంతి వేడుకలు ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్నాయని తెలిపారు. ఎన్టీఆర్ సేవలు చిరస్మరణీయమని అన్నారు. తెలుగు జాతి ఆత్మగౌరవం కోసం ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించారని గుర్తు చేశారు. సంక్షేమ పథకాలకు ఎన్టీఆర్ ఆజ్యం పోశారని పేర్కొన్నారు. ఎన్టీఆర్ అందించిన సంక్షేమ పథకాలే నేడు దేశవ్యాప్తంగా అమలవుతున్నాయన్నారు. ఎన్టీఆర్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తామన్నారు.
Wrestlers March: ఓ వైపు ప్రారంభోత్సవం.. మరోవైపు రెజ్లర్ల మార్చ్.. ఢిల్లీలో హై సెక్యూరిటీ..
తాజావార్తలు
-
CM Revanth Reddy : నీట్-యూజీ 2026 రద్దు… మోడీ సర్కార్ ఫెయిల్
-
Gaurnaidu: ‘పెద్ది’ నుంచి ఊహించని ఊరమాస్ టీజర్.. ‘గౌర్నాయుడు’గా శివరాజ్కుమార్ విశ్వరూపం!
-
Siddaramaiah: “హిజాబ్”కు అనుమతి, “కాషాయ కండువాల”కు నో పర్మిషన్..
-
Keralam: గవర్నర్ను కలిసిన సతీశన్.. 18న సీఎంగా ప్రమాణస్వీకారం
-
TG Intermediate: తెలంగాణ ఇంటర్మీడియట్ విద్యలో కీలక మార్పులు.. ఇక ఫస్ట్ ఇయర్లో ప్రాక్టికల్స్..
ట్రెండింగ్
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!
-
WhatsAppలో ‘Incognito AI Chat’.. యూజర్లకు మెటా బిగ్ అప్డేట్.!
-
8000mAh భారీ బ్యాటరీ, 200MP కెమెరా, Snapdragon 8 Elite Gen 5తో తో Xiaomi 17 Max పవర్ఫుల్ ఎంట్రీ.!
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!