Arvind kejriwal : కేజ్రీవాల్ కు షాక్… మార్చి 16న ఈడీ ఎదుట హాజరు కావాల్సిందే అన్న కోర్టు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Arvind kejriwal : మద్యం కుంభకోణం కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు చిక్కులు పెరిగే అవకాశం ఉంది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఫిర్యాదు మేరకు ఢిల్లీలోని రూస్ అవెన్యూ కోర్టు గురువారం అరవింద్ కేజ్రీవాల్ను మార్చి 16న హాజరు కావాలని ఆదేశించింది. ఈడీ ఎనిమిది సార్లు సమన్లు పంపిన తర్వాత కూడా ఢిల్లీ సీఎం విచారణ కోసం దర్యాప్తు సంస్థ ముందు హాజరు కాలేదు. దీంతో ఈడీ మళ్లీ కోర్టును ఆశ్రయించింది. అయితే కేజ్రీవాల్పై ఈడీ ఇప్పటికే కోర్టులో ఫిర్యాదు చేసింది. ఐదవ సమన్ల తర్వాత ED ఒక ఫిర్యాదును దాఖలు చేసింది. దీనిపై ఫిబ్రవరి 7 న విచారణ జరిగింది. కోర్టు అరవింద్ కేజ్రీవాల్కు సమన్లు జారీ చేసింది. ఫిబ్రవరి 17 న కోర్టుకు హాజరు కావాలని ఆదేశించింది. అయితే బడ్జెట్ సెషన్ కారణంగా మరుసటి తేదీన హాజరవుతారని అరవింద్ కేజ్రీవాల్ తరపు న్యాయవాది వాదిస్తూ వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు కోరారు.
Read Also:Demolitions: చెరువు కబ్జాలపై రంగారెడ్డి కలెక్టర్ సీరియస్.. అక్రమ నిర్మాణాల కూల్చివేత
Also Read
- CM Chandrababu: గుంటూరులో మహిళపై దాడి ఘటనలో సీఎం సీరియస్.. చర్యలకు ఆదేశాలు..
- The Paradise: నాని కెరియర్ లోనే రికార్డు ధరకు అమ్ముడైన 'ది ప్యారడైజ్' నైజాం రైట్స్.!
- RBI Polymer Notes: ప్లాస్టిక్ కరెన్సీకి శ్రీకారం.. గ్లోబల్ టెండర్ జారీ చేసిన ఆర్బీఐ.. కఠిన షరతులు..!
- Rohit Sharma Retirement: చరిత్ర పునరావృతం.. ధోనీ నిర్ణయం వల్లే రోహిత్పై వేటు!
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ED ఎనిమిదో సమన్లకు సమాధానమిస్తూ అవిచట్టవిరుద్ధమని, అయినప్పటికీ నేను సమాధానం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నానని అన్నారు. మార్చి 12 తర్వాత తేదీ కావాలని ఆయన కోరారు. దీనితో పాటు వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా ఏజెన్సీ ప్రశ్నలకు సమాధానం ఇస్తానని చెప్పారు. ఈ విషయంలో కోర్టు ఉత్తర్వులు ఇస్తే మాత్రమే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ముందు హాజరవుతానని కూడా చెప్పారు. గత ఏడాది నవంబర్ 2, 21 డిసెంబర్, 3 జనవరి, 17 జనవరి, 2 ఫిబ్రవరి, 19 ఫిబ్రవరి, 22 ఫిబ్రవరి, 27 ఫిబ్రవరిలో ఈడీ కేజ్రీవాల్కు సమన్లు పంపింది. కానీ ఒక్కసారి కూడా దర్యాప్తు సంస్థ ముందు హాజరుకాలేదు. ఈ క్రమంలో ఆయనపై ఈడీ రెండుసార్లు కోర్టులో ఫిర్యాదు చేసింది.
Read Also:Ambajipeta Marriage Band OTT: ఓటీటీలో దుమ్ముదులిపేస్తున్న సుహాస్ మూవీ…
తాజావార్తలు
-
CM Chandrababu: గుంటూరులో మహిళపై దాడి ఘటనలో సీఎం సీరియస్.. చర్యలకు ఆదేశాలు..
-
The RajaSaab: థియేటర్లలో నిరాశ.. ఓటీటీలో దుమ్మురేపిన ‘ది రాజాసాబ్’.. ప్రభాస్కు మరో అరుదైన రికార్డు!
-
Mahesh Babu-Varanasi: రెడీ అయిపోండమ్మా.. బాబు బర్త్డేకు భారీ సర్ప్రైజ్?
-
The Paradise: నాని కెరియర్ లోనే రికార్డు ధరకు అమ్ముడైన ‘ది ప్యారడైజ్’ నైజాం రైట్స్.!
-
Oppo K15: ఒప్పో K15 త్వరలో లాంచ్.. Dimensity 7360 ప్రాసెసర్, 8,000mAh బ్యాటరీ
ట్రెండింగ్
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!
-
185Hz OLED డిస్ప్లే, లిక్విడ్ కూలింగ్తో పవర్ఫుల్ గేమింగ్ ట్యాబ్లెట్ REDMAGIC Astra 2 లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 12.2 అంగుళాల 2.8K 144Hz OLED డిస్ప్లేతో రాబోతున్న ASUS ప్యాడ్ (T3201).!
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?