Dengue Alert : ఓ పక్క కరోనా.. మరోపక్క డెంగీ.. రాజధాని ఉక్కిరిబిక్కిరి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Dengue Alert : దేశ రాజధాని ఢిల్లీకి డెంగీ బెంగపట్టుకుంది. కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతుండంతో జనాలు భయపడుతుంటే.. ఇప్పుడు డెంగీ డేంజర్ బెల్స్ మోగిస్తోంది. కేసుల సంఖ్య బీభత్సంగా పెరుగుతోంది. తాజా నివేదికల ప్రకారం ఢిల్లీలో డెంగ్యూ కేసులు 4,300 మార్కును దాటాయి. డెంగీ కారణంగా మరో రెండు మరణాలు సంభవించినట్లు ప్రభుత్వ అధికారులు ధృవీకరించారు. ఇప్పటివరకు డెంగీ కారణంగా మరణించిన వారి 7కు చేరింది. డిసెంబరు 19న, మునిసిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీ (ఎంసీడీ) సమీక్షా ప్యానెల్ ద్వారా ఐదు మరణాలను నిర్దారించింది. ఈ మరణాలు సెప్టెంబర్-నవంబర్ మధ్యలో జరిగాయి.
Read Also: Pakistan Boat: భారీగా ఆయుధాలతో పాక్ ఫిషింగ్ బోటు.. అడ్డుకున్న అధికారులు
Also Read
- Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
- Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
- Ex-Girlfriend Murder: నీకు కాబోయే భార్యను చంపేశా.. వరుడికి మాజీ ప్రియుడి షాకింగ్ కాల్..
- Pakistan: పాకిస్తాన్ మరోసారి.. భారత విమానాలపై గగనతల ఆంక్షలు పొడగింపు..
తాజాగా వెలువరించిన నివేదికలో డిసెంబర్ 1నుంచి 23 వరకు మొత్తం 4,361 డెంగ్యూ కేసులు నమోదయ్యాయని ఎంసీడీ తెలిపింది. మొత్తం కేసుల్లో నవంబర్లో 1,420, అక్టోబర్లో 1,238, సెప్టెంబర్లో 693 కేసులు నమోదయ్యాయి. 2021లో నగరంలో డెంగ్యూ బారిన పడి 23 మంది ప్రాణాలు కోల్పోయారని నివేదిక పేర్కొంది. 2015లో రాజధాని నగరంలో డెంగ్యూ విపరీతంగా వ్యాప్తి చెందింది. దీంతో అక్టోబర్లో కేసుల సంఖ్య 10,600 దాటింది.
Read Also:Gold Seized : కి‘లేడీ’ బంగారం అక్కడ పెట్టింది.. చెకింగ్ ను తప్పించుకుంది.. కానీ
డెంగ్యూ, మలేరియా వంటి దోమల ద్వారా సంక్రమించే వ్యాధులు. ఇవి ఎక్కువగా జూలై , నవంబర్ మధ్య వ్యాప్తిచెందుతాయి. కొన్నిసార్లు డిసెంబర్ మధ్య వరకు వాటి వ్యాప్తి ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈ వ్యాధుల లక్షణాలలో అధిక జ్వరం, తలనొప్పి, దద్దుర్లు, కండరాలు, కీళ్ల నొప్పులు ఉంటాయి, ఇవి కోవిడ్ -19 మాదిరిగానే ఉంటాయి. డెంగ్యూ కారణంగా 2016, 2017లో పది మంది చొప్పున, 2018లో నాలుగు, 2019లో ఇద్దరు మరణించారు. దోమల నివారణకు ఎంసీడీ తగు చర్యలు చేపట్టినట్లు అధికారులు ప్రకటించారు.
తాజావార్తలు
-
OTR : వైసీపీ నేతలతో టచ్.. టీడీపీ ఎమ్మెల్యేతో మ్యాచ్? కాకినాడలో హాట్ టాపిక్
-
Story Board : ఇరాన్ యుద్ధం గల్ఫ్ కు చేసిన నష్టమేంటి..? దుబాయ్ గతానికి, ప్రస్తుతానికి తేడా ఏంటి..?
-
Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
-
Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
-
Ex-Girlfriend Murder: నీకు కాబోయే భార్యను చంపేశా.. వరుడికి మాజీ ప్రియుడి షాకింగ్ కాల్..
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!