Gold Seized : కి‘లేడీ’ బంగారం అక్కడ పెట్టింది.. చెకింగ్ ను తప్పించుకుంది.. కానీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gold Seized : భారత్, దుబాయ్ మధ్య బంగారం ధరల్లో భారీగా వ్యత్యాసం ఉంది. దీంతో అక్కడనుంచి బంగారాన్ని తీసుకుని ఇక్కడ అమ్మేందుకు స్మగ్లర్లు చేయని ప్రయత్నాలు లేవు. ఈ క్రమంలో చాలా మంది స్మగ్లర్లు పట్టుబడుతున్నారు. ఎలాగోలా మస్కా కొట్టి కొందరు తప్పించుకోగలిగారు. అలాంటి ఒక సందర్భంలో, కరిపూర్ విమానాశ్రయం వెలుపల కేరళ యువతి లోదుస్తుల్లో దాచి బంగారాన్ని స్మగ్లింగ్ చేస్తూ కస్టమ్స్ అధికారులకు దొరికిపోయింది. ఆ మహిళ ఆదివారం దుబాయ్ నుంచి కరిపూర్ విమానాశ్రయానికి వచ్చింది.
ఆ మహిళను కాసర్గోడ్లో నివాసం ఉండే షహ్లా (19)గా గుర్తించారు. అధికారులకు అందిన సమాచారం ఆధారంగా ఎయిర్పోర్టు వెలుపల ఆమెను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఆమె లోదుస్తుల్లో దాచిన 1.884 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. మూడు ప్యాకెట్లలో బంగారం లభ్యమైంది. షహలా ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానంలో రాత్రి 10:30 గంటలకు విమానాశ్రయానికి చేరుకున్నారు. కస్టమ్స్ క్లియరెన్స్ తర్వాత విమానాశ్రయం నుంచి బయలుదేరిన ఆమెను నగర పోలీసులు అరెస్టు చేశారు.
Also Read
- Hockey World Cup 2026 విజేతగా జర్మనీ.. స్పెయిన్పై 1-0తో విజయం.!
- Vem Narender Reddy: మార్చి 2027 వరకు లక్ష ఉద్యోగాల భర్తీ.. వారానికి ఒక నోటిఫికేషన్.!
- Romanchakam: ఆయన పిలిస్తే రాకపోతే బతికి వేస్ట్.. విజయ్ దేవరకొండ ఎమోషనల్ స్పీచ్..!
- Veligonda Project: నేడే సీఎం చంద్రబాబు చేతులమీదుగా వెలిగొండ ప్రాజెక్టు ఫేజ్-1 ప్రారంభం.!
Read Also: CBI Case On Officials : అర్హత లేని వారికి సాయం చేస్తే అంతే ఉంటది.. ఇప్పుడయ్యిందిగా
ఆ మహిళ మొదట బంగారం స్మగ్లింగ్ను ఖండించింది. పోలీసులు తొలుత ఆమె సామాను నుంచి ఏమీ కనుగొనలేకపోయారు. అయితే ఆమె లోదుస్తులకు కుట్టిన మూడు ప్యాకెట్లలో బంగారం లభ్యమైంది. మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి పోలీసులు ఆమెను విచారిస్తున్నారు. స్వాధీనం చేసుకున్న బంగారాన్ని, తదుపరి విచారణ నిమిత్తం కస్టమ్స్ అధికారులు నివేదికతో పాటు కోర్టుకు సమర్పించనున్నారు. కరిపూర్ విమానాశ్రయంలో పోలీసులు పట్టుకున్న బంగారం స్మగ్లింగ్లో ఇది 87వ కేసు.
Read Also: Mother Dairy Hikes Milk Price : పాల ధరను భారీగా పెంచిన మదర్ డైరీ.. ఏడాదిలో ఇది ఐదోసారి
బంగారం స్మగ్లింగ్ స్మగ్లర్లకు పెద్ద ఆదాయ వనరులను కలిగి ఉంది. దీని వెనుక పెద్ద రాకెట్ ఉన్నట్లు తెలుస్తోంది. సోమవారం, ముంబై ఎయిర్పోర్ట్లో దేశీయ ప్రయాణీకుడి నుంచి సుమారు 6.452 కిలోల (సుమారు రూ. 3.20 కోట్ల విలువైన) బంగారాన్ని పేస్ట్ రూపంలో అక్రమంగా తరలించేందుకు ప్రయత్నిస్తుండగా అధికారులు పట్టుకున్నారు. ఆదివారం, ముంబై విమానాశ్రయంలో బోర్డింగ్ గేట్ల వద్ద మరో ప్రయాణికుడి వద్ద సుమారు 1.2 కిలోల బరువున్న బంగారం డస్ట్ ను CISF పట్టుకుంది.
తాజావార్తలు
-
CTET 2026: సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్.. దరఖాస్తుకు రేపే చివరి ఛాన్స్..
-
YASH : టాక్సిక్ డిజాస్టర్ తర్వాత రాకింగ్ స్టార్ యశ్ నెక్ట్స్ ప్రాజెక్ట్ ఏంటి?
-
Gold Price Today: భారీగా తగ్గిన బంగారం ధరలు.. హైదరాబాద్లో 10 గ్రాముల గోల్డ్ రేట్ ఎంతంటే?
-
Manisha Koirala: భారత్, చైనా అండగా ఉండాలి.. నేపాల్ వరదలపై కన్నీళ్లు పెట్టుకున్న మనీషా కొయిరాలా..
-
GLOF Risk in India: నేపాల్ వరదల తర్వాత భారత్కు భారీ ముప్పు.. హిమాలయాల్లో 200 ‘జల బాంబులు’?
ట్రెండింగ్
-
క్రిస్టల్స్తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!