Gold Seized : కి‘లేడీ’ బంగారం అక్కడ పెట్టింది.. చెకింగ్ ను తప్పించుకుంది.. కానీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gold Seized : భారత్, దుబాయ్ మధ్య బంగారం ధరల్లో భారీగా వ్యత్యాసం ఉంది. దీంతో అక్కడనుంచి బంగారాన్ని తీసుకుని ఇక్కడ అమ్మేందుకు స్మగ్లర్లు చేయని ప్రయత్నాలు లేవు. ఈ క్రమంలో చాలా మంది స్మగ్లర్లు పట్టుబడుతున్నారు. ఎలాగోలా మస్కా కొట్టి కొందరు తప్పించుకోగలిగారు. అలాంటి ఒక సందర్భంలో, కరిపూర్ విమానాశ్రయం వెలుపల కేరళ యువతి లోదుస్తుల్లో దాచి బంగారాన్ని స్మగ్లింగ్ చేస్తూ కస్టమ్స్ అధికారులకు దొరికిపోయింది. ఆ మహిళ ఆదివారం దుబాయ్ నుంచి కరిపూర్ విమానాశ్రయానికి వచ్చింది.
ఆ మహిళను కాసర్గోడ్లో నివాసం ఉండే షహ్లా (19)గా గుర్తించారు. అధికారులకు అందిన సమాచారం ఆధారంగా ఎయిర్పోర్టు వెలుపల ఆమెను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఆమె లోదుస్తుల్లో దాచిన 1.884 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. మూడు ప్యాకెట్లలో బంగారం లభ్యమైంది. షహలా ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానంలో రాత్రి 10:30 గంటలకు విమానాశ్రయానికి చేరుకున్నారు. కస్టమ్స్ క్లియరెన్స్ తర్వాత విమానాశ్రయం నుంచి బయలుదేరిన ఆమెను నగర పోలీసులు అరెస్టు చేశారు.
Also Read
- Jitan Ram Manjhi: కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీపై రాళ్ల దాడి.. ఇద్దరు అరెస్ట్
- RCB Vs SRH: దయాదాక్షిణ్యాలు చూపించలేదు.. ఆర్సీబీ బౌలర్లను ఆడుకున్న కాటేరమ్మ కొడుకులు..
- Twisha Sharma: ట్విషా శర్మ మృతి కేసులో భర్త సమర్థ్ సింగ్కు షాక్.. న్యాయ వృత్తి నుంచి సస్పెండ్
- Abhishek Sharma: మళ్లీ రికార్డుల వేట.. కాటేరమ్మ కొడుకు అరుదైన రికార్డు..
Read Also: CBI Case On Officials : అర్హత లేని వారికి సాయం చేస్తే అంతే ఉంటది.. ఇప్పుడయ్యిందిగా
ఆ మహిళ మొదట బంగారం స్మగ్లింగ్ను ఖండించింది. పోలీసులు తొలుత ఆమె సామాను నుంచి ఏమీ కనుగొనలేకపోయారు. అయితే ఆమె లోదుస్తులకు కుట్టిన మూడు ప్యాకెట్లలో బంగారం లభ్యమైంది. మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి పోలీసులు ఆమెను విచారిస్తున్నారు. స్వాధీనం చేసుకున్న బంగారాన్ని, తదుపరి విచారణ నిమిత్తం కస్టమ్స్ అధికారులు నివేదికతో పాటు కోర్టుకు సమర్పించనున్నారు. కరిపూర్ విమానాశ్రయంలో పోలీసులు పట్టుకున్న బంగారం స్మగ్లింగ్లో ఇది 87వ కేసు.
Read Also: Mother Dairy Hikes Milk Price : పాల ధరను భారీగా పెంచిన మదర్ డైరీ.. ఏడాదిలో ఇది ఐదోసారి
బంగారం స్మగ్లింగ్ స్మగ్లర్లకు పెద్ద ఆదాయ వనరులను కలిగి ఉంది. దీని వెనుక పెద్ద రాకెట్ ఉన్నట్లు తెలుస్తోంది. సోమవారం, ముంబై ఎయిర్పోర్ట్లో దేశీయ ప్రయాణీకుడి నుంచి సుమారు 6.452 కిలోల (సుమారు రూ. 3.20 కోట్ల విలువైన) బంగారాన్ని పేస్ట్ రూపంలో అక్రమంగా తరలించేందుకు ప్రయత్నిస్తుండగా అధికారులు పట్టుకున్నారు. ఆదివారం, ముంబై విమానాశ్రయంలో బోర్డింగ్ గేట్ల వద్ద మరో ప్రయాణికుడి వద్ద సుమారు 1.2 కిలోల బరువున్న బంగారం డస్ట్ ను CISF పట్టుకుంది.
తాజావార్తలు
-
Patriot: 18 ఏళ్ల తర్వాత మమ్ముట్టి – మోహన్ లాల్ కలయిక.. ‘పేట్రియాట్’ OTT రిలీజ్ డేట్ ఫిక్స్!
-
Petrol, Diesel Prices Hiked: మరోసారి పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు.. పదిరోజుల్లో మూడోసారి
-
Kohli vs Travis Head: ఉప్పల్ హై-డ్రామా.. మ్యాచ్ మధ్యలో ట్రావిస్ హెడ్ను రెచ్చగొట్టిన కోహ్లీ.. నో షేక్ హ్యాండ్!
-
Off The Record : గుంటూరు జిల్లాలో ఆ ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు అందినకాడికి దోచేస్తున్నారా..?
-
Jitan Ram Manjhi: కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీపై రాళ్ల దాడి.. ఇద్దరు అరెస్ట్
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!