G20 Summit: జీ20 సదస్సుకు ఏ దేశాధ్యక్షులు వస్తున్నారు.. వారికి ఎవరు స్వాగతం పలుకుతారంటే ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
G20 Summit: జీ20 సదస్సుకు దేశ రాజధాని ఢిల్లీ ముస్తాబైంది. ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన దేశాల అధినేతలకు ఆతిథ్యం ఇచ్చేందుకు ఢిల్లీ సిద్ధమైంది. అతిథుల రాక ప్రక్రియ కొనసాగుతోంది. ఢిల్లీ గడ్డపై ఒక్కొక్కరుగా అడుగులు వేస్తున్నారు. అమెరికా అధ్యక్షుడు జో బిడెన్, ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్, చైనా ప్రధాని, రష్యా విదేశాంగ మంత్రి సహా 20 దేశాల నేతలు ఈ సదస్సులో పాల్గొంటారు. ఈ నాయకులు ఎప్పుడు భారతదేశానికి చేరుకుంటారు. వారిని ఎవరు స్వాగతిస్తారు. పూర్తి వివరాలు తెలుసుకుందాం.
ఎవరు ఎవరిని స్వాగతిస్తారంటే..
– జో బిడెన్ శుక్రవారం రాత్రి 7 గంటలకు ఢిల్లీ చేరుకుంటారు. రోడ్డు రవాణా, రహదారుల శాఖ సహాయ మంత్రి , పౌర విమానయాన శాఖ జనరల్ (రిటైర్డ్) వీకే సింగ్ అమెరికా అధ్యక్షుడికి స్వాగతం పలుకుతారు.
– జపాన్ ప్రధాని ఫుమియో కిషిడా మధ్యాహ్నం 2:15 గంటలకు భారత్ చేరుకుంటారు. వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజాపంపిణీ మరియు పర్యావరణం, అటవీ, వాతావరణ మార్పుల శాఖ సహాయ మంత్రి అశ్విని కుమార్ చౌబే ఆయనకు స్వాగతం పలుకుతారు.
– సాయంత్రం 6:15 గంటలకు ఆస్ట్రేలియన్ ప్రధాన మంత్రి ఆంథోనీ అల్బనీస్కు స్కిల్ డెవలప్మెంట్, ఎంటర్ప్రెన్యూర్షిప్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ స్వాగతం పలుకుతారు.
– రాత్రి 8గంటలు, 8:45 గంటలకు UAE అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్, బ్రెజిల్ అధ్యక్షుడు లూయిజ్ ఇనాసియో లులా డా సిల్వాకు హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ స్వాగతం పలుకుతారు.
Also Read
- Vaibhav Sooryavanshi: ‘రోజుకు ఎన్ని లీటర్ల పాలు తాగుతావు వైభవ్’.. ఎవరూ ఊహించని రెస్పాన్స్ ఇచ్చిన సూర్యవంశీ..
- CM Chandrababu: వైసీపీకి సీఎం చంద్రబాబు సీరియస్ వార్నింగ్.. ఎవరూ ఆపలేరు..!
- Sajjala Ramakrishna Reddy: హామీలు గాలికొదిలేశారు.. సర్కార్పై సజ్జల తీవ్ర విమర్శలు..
- RCB Fans: కప్ గెలిచిన ఆనందం కొన్ని క్షణాలు కూడా లేకపాయే.. ఆర్సీబీ ఫ్యాన్స్కు బ్యాడ్ న్యూస్..
Read Also:Kishan Reddy: హోంగార్డు రవీందర్ మృతిపై కిషన్ రెడ్డి విచారం.. తొందరపడొద్దని సూచన..
– అశ్విని కుమార్ చౌబే యునైటెడ్ కింగ్డమ్ (యుకె) ప్రధాన మంత్రి రిషి సునక్కు మధ్యాహ్నం 1:40 గంటలకు స్వాగతం పలుకుతారు.
– సాయంత్రం 7:45 గంటలకు చైనా ప్రధాని లీ కియాంగ్కు వీకే సింగ్ స్వాగతం పలుకుతారు. సింగ్ రాత్రి 8:15 గంటలకు నెదర్లాండ్స్ ప్రధాని మార్క్ రూట్ను కూడా స్వీకరిస్తారు.
– జౌళి, రైల్వే శాఖ సహాయ మంత్రి దర్శన్ విక్రమ్ జర్దోష్ మధ్యాహ్నం 12:30 గంటలకు బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనాకు స్వాగతం పలుకుతారు.
– సాయంత్రం 5:10 గంటలకు దక్షిణ కొరియా అధ్యక్షుడు సుక్ యోల్ యూన్, సాయంత్రం 5:45 గంటలకు ఈజిప్టు అధ్యక్షుడు అబ్దెల్ ఫతా అల్-సిసి, రాత్రి 7 గంటలకు కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడోకు రాజీవ్ చంద్రశేఖర్ స్వాగతం పలుకుతారు.
– ఉక్కు, గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి ఫగ్గన్సింగ్ కులస్తే అర్జెంటీనా అధ్యక్షుడు అల్బెర్టో ఫెర్నాండెజ్కు ఉదయం 6:20 గంటలకు స్వాగతం పలుకుతారు. వ్యవసాయం, రైతుల సంక్షేమ శాఖ సహాయ మంత్రి – శోభా కరంద్లాజే ఉదయం 8:50 గంటలకు ఇటలీ ప్రధాని జార్జియో మెలోనికి స్వాగతం పలుకుతారు.
– రైల్వేలు, బొగ్గు, గనుల శాఖ సహాయ మంత్రి రావుసాహెబ్ దాన్వే ఉదయం 10:25 గంటలకు యూనియన్ ఆఫ్ కొమొరోస్ ప్రెసిడెంట్, ఆఫ్రికన్ యూనియన్ చైర్పర్సన్ అజలీ అసోమాని, 11:45 గంటలకు దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రామఫోసాకు స్వాగతం పలుకుతారు. .
– ఓడరేవులు, షిప్పింగ్, జలమార్గాల శాఖ సహాయ మంత్రి శంతను ఠాకూర్ ఇండోనేషియా అధ్యక్షుడు జోకో విడోడోకు రాత్రి 9:15 గంటలకు స్వాగతం పలుకుతారు.
– ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్కు సెప్టెంబర్ 9 (శనివారం) మధ్యాహ్నం 12:35 గంటలకు వాణిజ్య, పరిశ్రమల శాఖ సహాయ మంత్రి అనుప్రియా పటేల్ స్వాగతం పలుకుతారు.
Read Also:Gautam Gambhir: గంభీర్ రూటే సపరేట్.. ఆప్షన్స్ను కాదని మరో ఆటగాడిని ఎంచుకున్నాడు! ఊహించని సమాధానం
G20లో పాల్గొనే దేశాలు
అమెరికా, చైనా, రష్యా, జర్మనీ, ఫ్రాన్స్, కెనడా, ఇటలీ, జపాన్, అర్జెంటీనా, దక్షిణాఫ్రికా, యూకే, సౌదీ అరేబియా, యూరోపియన్ యూనియన్, మెక్సికో, టర్కీ, బ్రెజిల్, ఇండియా, కొరియా, ఆస్ట్రేలియా.
ఆహ్వానం అందిన దేశాలు
నెదర్లాండ్స్, సింగపూర్, స్పెయిన్, యునైటెడ్ అరబ్, ఒమన్, బంగ్లాదేశ్, ఈజిప్ట్, మారిషస్, నైజీరియాలను G20 శిఖరాగ్ర సమావేశానికి అతిథులుగా ఆహ్వానించారు.
Read Also:Traffic ACP: హ్యాట్సాఫ్ మేడం.. డ్రైనేజీ చెత్తను చేతితో తీసిన మహిళా పోలీస్
కాన్ఫరెన్స్ గెస్ట్లు, ద్వైపాక్షిక చర్చలు
సెప్టెంబర్ 8న ప్రధాని నరేంద్ర మోడీ, అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ ద్వైపాక్షిక చర్చలు జరుపనున్నారు. సాయంత్రం 5 గంటలకు బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనాతో ద్వైపాక్షిక సమావేశం జరగనుంది. ఢిల్లీ అతిపెద్ద ఈవెంట్కు సర్వం సిద్ధమైంది. ఇప్పుడు G-20 సమ్మిట్ సెప్టెంబర్ 9-10 తేదీల్లో జరుగనుంది. భారత్ మండపం నుంచి కుతుబ్ మినార్ వరకు రాజధాని ఢిల్లీ లేజర్ లైట్లతో మెరిసిపోతోంది. ఢిల్లీ మొత్తం పెళ్లికూతురులా ముస్తాబవుతోంది. ఢిల్లీలోని ప్రతి మూలా పూల పరిమళాలతో, లైట్ల వెలుగుతో తడిసి ముద్దవుతోంది. లుటియన్స్ జోన్ ప్రాంతంలోని అన్ని ప్రత్యేక భవనాలు, స్మారక చిహ్నాలను వివిధ రంగుల పువ్వులు, లైట్లతో అలంకరించారు.
తాజావార్తలు
-
Lokesh Kanagaraj : ఇదేందయ్యా లోకేషూ.. ఇంకెప్పుడు?
-
Vaibhav Sooryavanshi: ‘రోజుకు ఎన్ని లీటర్ల పాలు తాగుతావు వైభవ్’.. ఎవరూ ఊహించని రెస్పాన్స్ ఇచ్చిన సూర్యవంశీ..
-
CM Chandrababu: వైసీపీకి సీఎం చంద్రబాబు సీరియస్ వార్నింగ్.. ఎవరూ ఆపలేరు..!
-
Jagapathi Babu: ఎడిటింగ్లో బలయ్యా.. ‘పుష్ప 2’పై జగపతి బాబు సంచలన వ్యాఖ్యలు?
-
Bengaluru Traffic: కడుపుతో ఉన్న భార్య కోసం ఖాకీలతోని కొట్లాట.. నడిరోడ్డుపై కూర్చున్న సామాన్యుడు! వీడియో వైరల్..
ట్రెండింగ్
-
BSNL నుండి అదిరిపోయే ప్లాన్.. రోజుకు 3GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.!
-
Kitchen Hacks : ఇంట్లో తోడుపెట్టిన పెరుగుపై నీరు చేరుతోందా.? ఈ చిట్కాలతో గడ్డలా చిక్కటి పెరుగు రెడీ.!
-
Home Safety Tips : మీ ఇంటి దగ్గర పాము కనిపిస్తే భయపడకండి, ఈ 5 సులభమైన చిట్కాలను పాటించండి!
-
Balcony Tips : బాల్కనీలో పావురాల లొల్లి ఎక్కువైందా.? ఈ సింపుల్ ట్రిక్స్తో గుడ్బై చెప్పేయండి.!
-
Wash Basin Blocked : వాష్ బేసిన్ బ్లాక్ అయిందా.? ప్లంబర్ అవసరం లేకుండా ఈ చిట్కాలతో నిమిషాల్లో క్లియర్ చేయండి.!