Rishabh Pant Fine: రిషబ్ పంత్కు ‘డబుల్’ జరిమానా.. నిషేధం తప్పదా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Delhi Capitals Captain Rishabh Pant Nearing One Match Ban in IPL 2024: ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషబ్ పంత్కు రెండోసారి జరిమానా పడింది. బుధవారం విశాఖలో కోల్కతా నైట్ రైడర్స్ (కేకేఆర్)తో జరిగిన మ్యాచ్లో ఢిల్లీ నిర్ణీత సమయంలో తమ ఓవర్ల కోటా పూర్తి చేయనందున ఐపీఎల్ నిర్వాహకులు జరిమానా విధించారు. ఐపీఎల్ 2024లో స్లో ఓవర్ రేట్ నమోదు చేయడం ఇది రెండోసారి కాబట్టి పంత్కు రూ. 24 లక్షలు జరిమానా పడింది. అలానే జట్టులోని ఒక్కొక్కరికి రూ. 6 లక్షలు లేదా వారి మ్యాచ్ ఫీజుల్లో 25 శాతం జరిమానా పడింది.
ఐపీఎల్ 2024లో ఢిల్లీ క్యాపిటల్స్ రెండోసారి స్లో ఓవర్ రేట్ నమోదు చేసింది. ఢిల్లీ కెప్టెన్ రిషబ్ పంత్కు రూ. 24 లక్షలు జరిమానా విధించాం. పంత్తో పాటు జట్టులోని మిగిలిన సభ్యులకూ ఫైన్ విధించాం. మ్యాచ్లో ఆడిన ఇంపాక్ట్ ప్లేయర్కూ ఇది వర్తిస్తుంది. జట్టులోని ఒక్కొక్కరికి రూ. 6 లక్షలు లేదా వారి మ్యాచ్ ఫీజుల్లో 25 శాతం (ఈ రెండింట్లో ఏది తక్కువైతే) జరిమానాగా విధించాం’ అని ఐపీఎల్ నిర్వాహకులు ఓ ప్రకటన విడుదల చేశారు. చెన్నై సూపర్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లోనూ ఢిల్లీ స్లో ఓవర్ రేట్ నమోదు చేసింది. ఐపీఎల్ 2024లో ఈ తప్పిదం మరోసారి రిపీట్ అయితే మాత్రం.. పంత్ జరిమానాతో పాటుగా ఓ మ్యాచ్ నిషేధం ఎదుర్కోవాల్సి ఉంటుంది.
Also Read
- T20 Cricket: కేవలం 7 పరుగులకే ఆలౌట్, 10 రన్స్కే కుప్పకూలిన జట్లు, టీ20 చరిత్రలోనే అత్యంత దారుణ స్కోర్లు ఇవే!
- Union Budget: అక్టోబర్ 12 నుంచి కేంద్ర బడ్జెట్ కసరత్తు.. కీలక అంశాలపై ఫోకస్
- Central Employees: కేంద్ర ఉద్యోగుల జీతాల్లో ఊహించని మార్పు.. 3 శాతం ఉన్న ఇంక్రిమెంట్ 6 శాతానికి..?
- PM Modi: ఉజ్బెకిస్థాన్కు చేరుకున్న మోడీ.. అధ్యక్షుడు మిర్జియోయెవ్ ఘన స్వాగతం
Also Read: Motorola Edge 50 Pro Price: భారత్లో ‘మోటో ఎడ్జ్ 50 ప్రో’ లాంచ్.. సూపర్ లుక్, అద్భుత ఫీచర్స్!
ఐపీఎల్ ప్రవర్తనా నియమావళి ప్రకారం.. ఓ సీజన్లో మొదటిసారి స్లో ఓవర్ రేటు నమోదు చేస్తే కెప్టెన్కు రూ. 12 లక్షల జరిమానా పడుతుంది. రెండోసారి రిపీట్ అయితే కెప్టెన్కు రూ. 24 లక్షలు ఫైన్, జట్టులోని ఆటగాళ్ల మ్యాచ్ ఫీజులో ఆరు లక్షలు లేదా మ్యాచ్ ఫీజులో 25 శాతం కోత విధిస్తారు. ఇక మూడోసారి అదే తప్పు పునరావృతమైతే కెప్టెన్కు 30 లక్షల జరిమానా, ఒక మ్యాచ్ నిషేధం విధించబడుతుంది. అంతేకాకుండా ఆటగాళ్లకు రూ.12 లక్షలు లేదా వారి మ్యాచ్ ఫీజులో 50 శాతం (ఏది తక్కువైతే అది) జరిమానా పడుతుంది.
తాజావార్తలు
-
Emraan Hashmi: సినిమా సక్సెస్ జోష్లో ఇమ్రాన్ హష్మీకి బిగ్ షాక్.. స్వైన్ ఫ్లూ పాజిటివ్!
-
T20 Cricket: కేవలం 7 పరుగులకే ఆలౌట్, 10 రన్స్కే కుప్పకూలిన జట్లు, టీ20 చరిత్రలోనే అత్యంత దారుణ స్కోర్లు ఇవే!
-
Kittu Pawan: ఫోక్ స్టార్ కిట్టు పవన్ హీరోగా సినిమా ప్రారంభం!
-
Union Budget: అక్టోబర్ 12 నుంచి కేంద్ర బడ్జెట్ కసరత్తు.. కీలక అంశాలపై ఫోకస్
-
Central Employees: కేంద్ర ఉద్యోగుల జీతాల్లో ఊహించని మార్పు.. 3 శాతం ఉన్న ఇంక్రిమెంట్ 6 శాతానికి..?
ట్రెండింగ్
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!