Delhi Bomb Blast: ఢిల్లీ దాడిలో జైషే హస్తం..? ఇదిగో ప్రూఫ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Delhi Bomb Blast: దేశ రాజధానిలో సోమవారం సాయంత్రం జరిగిన బాంబు దాడి తర్వాత దర్యాప్తు సంస్థలు కీలక ఆధారాలను కనుగొన్నాయి. 14 ఏళ్ల తరువాత రాజధానిలో జరిగిన అతిపెద్ద పేలుడుగా చెబుతున్నారు. అలాగే గత పార్లమెంటు దాడిలో నిందితుడు ఈ ప్రమాదంలో మరణించినట్లు కనుగొన్నారు. గతంలో నిరక్షరాస్యులపై వారు మాత్రమే ఉగ్రవాదం వైపు మొగ్గు చూపేవారని నమ్మేవాళ్లం. ప్రస్తుతం వైద్యులు, తదితర విద్యావంతులు ఉండటం గమనార్హం.
READ MORE: Hyderabad: టీమిండియాలో హైదరాబాద్ కుర్రాడికి చోటు.. ఎవరో తెలుసా..?
Also Read
- AP Local Body Elections: ఏపీలో ఎన్నికల సందడి.. పంచాయతీరాజ్ శాఖ క్లారిటీ
- Medical Student Priyanka Case: ప్రియాంక కేసులో కీలక మలుపు.. హత్యాయత్నం నుంచి హత్య కేసుగా మార్పు
- Tadipatri Tension: తాడిపత్రిలో పొలిటికల్ హీట్.. వైసీపీ–టీడీపీ పోటాపోటీ కార్యక్రమాలు.. పోలీసుల నో పర్మిషన్..
- Iran and US Tensions: ఇరాన్పై మారిన ట్రంప్ వ్యూహం..? ఇక సైనిక దాడులు ఉండవు..! కానీ..
అయితే.. తాజాగా మరో షాకింగ్ సమాచారం వెలువడింది. పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత ఉగ్రవాద సంస్థ జైష్-ఎ-మహ్మద్ ఈ దాడికి పాల్పడిందా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఎందుకంటే.. జైష్-ఎ-మహ్మద్ను ప్రమోట్ చేసే మదీనా అనే పత్రిక మే 2025లో ఓ సంచిక విడుదల చేసింది. ఢిల్లీలోని మొఘల్ కాలం నాటి భవనం సఫ్దర్జంగ్ సమాధి నుంచి ఒక మినార్ ఫొటోను పోస్టర్లో ప్రదర్శించింది. అంతే కాదు.. ఆ పత్రికలో ఓ కథనాన్ని ప్రచురిస్తూ.. ప్రత్యేకంగా “ఘజ్వా-ఎ-హింద్”, “జిహాద్కు సిద్ధం” అని ప్రస్తావించింది. దీంతో ఢిల్లీ బాంబు దాడుల వెనుక జైషే-ఎ-మొహమ్మద్ హస్తం ఉందని తెలుస్తోంది! ఆపరేషన్ సిందూర్ జైషే రహస్య స్థావరాన్ని నాశనం చేయడమే కాకుండా మసూద్ అజార్ కుటుంబాన్ని కూడా చంపింది. అప్పటి నుంచి మసూద్ అజార్ ప్రతీకార జ్వాలతో రగిలిపోతున్నాడు. ఈ దాడి ఆ ముర్ఖుడే చేసి ఉంటాడనే అనుమానాలు పెరుగుతున్నాయి. కానీ.. అటు ఉగ్రసంస్థ, ఇటు ప్రభుత్వం నుంచి అధికారిక ప్రకటన రాలేదు.
READ MORE: Delhi Blast 2025: ఢిల్లీ పేలుళ్లలో తెరపైకి PAFF పేరు.. ! PAFF ఏ ఉగ్ర సంస్థ అనుబంధమో తెలుసా?
ఈ దాడి మాత్రమే కాదు.. భారత్లోని మహిళలను ట్రాప్ చేసేందుకు ప్లాన్ చేశారు. ఫరీదాబాద్లో అరెస్టయిన డాక్టర్ షాహీన్కు భారత్లోని మహిళలను జైషేతో అనుసంధానించే పని అప్పగించారు. దేశంలో మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది మసూద్ అజార్ అక్క ఆపరేషన్ సిందూర్లో హతమైంది. దీంతో మసూద్ అజార్ తన చెల్లెలికి జైష్-ఎ-మొహమ్మద్లోకి మహిళలను చేర్చుకునే బాధ్యతను అప్పగించాడు. అక్టోబర్లో, మసూద్ అజార్ జైష్లోకి మహిళలను చేర్చుకుంటున్నట్లు ప్రకటించాడు.
తాజావార్తలు
-
Lenovo Lecoo P900A: లెనోవో నుంచి కొత్త బడ్జెట్ టాబ్లెట్.. 8GB RAM, 5000mAh బ్యాటరీ, 4G సపోర్ట్
-
Mohsen Rezaee: ఇరాన్ టాప్ సెక్యూరిటీ బాడీకి మాజీ IRGC చీఫ్.. మొహ్సెన్ రెజాయీ నియామకం ఎందుకంత కీలకం?
-
Main Wapas Aaunga OTT: ఓటీటీలో నంబర్ వన్గా దూసుకెళ్తున్న పాకిస్తానీ లవ్ స్టోరీ.. ఐయండిబిలో 8.2 రేటింగ్
-
AP Local Body Elections: ఏపీలో ఎన్నికల సందడి.. పంచాయతీరాజ్ శాఖ క్లారిటీ
-
SpiderMan Brand New Day : అవతార్-2 రికార్డు బద్దలు.. ఇండియా నం:1 గ్రాసర్గా ‘బ్రాండ్ న్యూ డే’
ట్రెండింగ్
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!