Union Cabinet: ఢిల్లీ పేలుడు ఘటనపై కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Union Cabinet: ఢిల్లీ పేలుడు ఘటనపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.. ఢిల్లీ పేలుళ్లను ఉగ్రవాద సంఘటనగా గుర్తించి, కేబినెట్ సమావేశంలో బాధితులకు నివాళులర్పించింది. తాజాగా ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గం.. ఎర్రకోట సమీపంలో జరిగిన కారు పేలుడు ఘటనలో ప్రాణనష్టంపై తీవ్ర విచారం వ్యక్తం చేసింది. మృతుల ఆత్మలకు శాంతి చేకూరాలని మంత్రి వర్గం రెండు నిమిషాలు మౌనం పాటించింది.
READ MORE: SSMB29: రాజమౌళి లీక్ స్ట్రాటజీ మాములుగా లేదుగా.. ‘సంచారి’ సాంగ్ వెనక మైండ్ గేమ్..?
Also Read
- AP Govt: రైతులకు మరో శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. కేవలం రూ.1.50కే.. జీవో జారీ..
- BC Reservations: అసెంబ్లీ ముందుకు బీసీ రిజర్వేషన్ బిల్లు.. స్థానిక సంస్థల్లో 34 శాతం రిజర్వేషన్స్..
- Tamil Nadu: "విజయ్ ప్రియమైన త్రిషకు డిప్యూటీ సీఎం పదవి ఎప్పుడు.?" అన్నాడీఎంకే నేత సంచలన వ్యాఖ్యలు..
- SIR In Telangana: తెలంగాణలో 73.39 లక్షల ఓట్లు తొలగింపు.. హైదరాబాద్లోనే అత్యధికం..!
ఈ కేబినెట్ భేటీ అనంతరం.. కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ మాట్లాడారు. 2025 నవంబర్ 10 సాయంత్రం ఎర్రకోట సమీపంలో జరిగిన కారు పేలుడు ఘటన దేశ వ్యతిరేక శక్తులు చేసిన దారుణమైన ఉగ్రవాద సంఘటనను దేశం చూసింది. ఈ పేలుడు ఫలితంగా ప్రాణ, ఆర్థిక నష్టం జరిగిందని తెలిపారు. బాధితులకు మంత్రివర్గం హృదయపూర్వక నివాళులు అర్పించిందని చెప్పారు. “మంత్రి వర్గం మృతుల కుటుంబాలకు సంతాపాన్ని తెలియజేస్తోంది. గాయపడిన వారందరూ త్వరగా కోలుకోవాలని ప్రార్థించింది. బాధితుల సహాయం చేస్తున్న వైద్య సిబ్బంది, తదితర సిబ్బందిని అభినందించింది. అమాయకుల ప్రాణనష్టానికి దారితీసిన ఈ దుర్మార్గపు, పిరికి చర్యను మంత్రివర్గం నిస్సందేహంగా ఖండిస్తుంది. ఈ ప్రతికూల పరిస్థితులలో ధైర్యం, కరుణతో సేవలు చేసిన అధికారులు, భద్రతా సంస్థలు, పౌరులను మంత్రివర్గం ప్రశంసించింది. ఈ సంఘటనపై వీలైనంత త్వరగా దర్యాప్తు చేయాలని మంత్రివర్గం ఆదేశించింది. నేరస్థులు, వారికి సహకరించిన వ్యక్తులు, స్పాన్సర్లను త్వరగా గుర్తించాలని ఆదేశిస్తోంది. ప్రభుత్వ అత్యున్నత స్థాయిలో పరిస్థితిని నిశితంగా పర్యవేక్షిస్తూనే ఉంటుంది. జాతీయ భద్రత, ప్రతి పౌరుడి భద్రతకు ప్రభుత్వం కట్టుబడి ఉంది.” అని ఆయన పేర్కొన్నారు.
READ MORE: Educated Terrorists: 24 ఏళ్లలో 36 సంఘటనలు.. ‘వైట్ కాలర్ టెర్రర్ మాడ్యూల్’ ఎప్పుడు ప్రారంభమైంది!
తాజావార్తలు
-
Censor: సినిమా రీ-ఎడిటింగ్కు సెన్సార్ బోర్డు చెక్: నిబంధనల్లో కీలక మార్పులు?
-
AP Govt: రైతులకు మరో శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. కేవలం రూ.1.50కే.. జీవో జారీ..
-
Tollywood: సీక్వెల్ కావాలంటున్న స్టార్ హీరో.. ‘నో’ అంటున్న డైరెక్టర్!
-
BC Reservations: అసెంబ్లీ ముందుకు బీసీ రిజర్వేషన్ బిల్లు.. స్థానిక సంస్థల్లో 34 శాతం రిజర్వేషన్స్..
-
RC17: రామ్ చరణ్ ఊరమాస్ మేకోవర్.. సుకుమార్ పక్కా స్కెచ్!
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..