Union Cabinet: ఢిల్లీ పేలుడు ఘటనపై కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Union Cabinet: ఢిల్లీ పేలుడు ఘటనపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.. ఢిల్లీ పేలుళ్లను ఉగ్రవాద సంఘటనగా గుర్తించి, కేబినెట్ సమావేశంలో బాధితులకు నివాళులర్పించింది. తాజాగా ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గం.. ఎర్రకోట సమీపంలో జరిగిన కారు పేలుడు ఘటనలో ప్రాణనష్టంపై తీవ్ర విచారం వ్యక్తం చేసింది. మృతుల ఆత్మలకు శాంతి చేకూరాలని మంత్రి వర్గం రెండు నిమిషాలు మౌనం పాటించింది.
READ MORE: SSMB29: రాజమౌళి లీక్ స్ట్రాటజీ మాములుగా లేదుగా.. ‘సంచారి’ సాంగ్ వెనక మైండ్ గేమ్..?
Also Read
- Nitin Nabin: విదేశాల నుంచి భారత యువతను ఆడించలేరు.. సీజేపీపై బీజేపీ పరోక్ష విమర్శలు..
- Shashi Tharoor: రాహుల్గాంధీపై అనుచిత వ్యాఖ్యలు.. ‘ఒబామా.. మోడీ సంగతి ఏంటి?’.. రామచంద్ర గుహకు శశిథరూర్ కౌంటర్
- Vaibhav's Father: ‘సూర్యవంశీ వారి కాలి దుమ్ముకు కూడా సరిపోడు’.. సంచలన వ్యాఖ్యలు చేసిన వైభవ్ తండ్రి..
- Vignesh Shivan : నయనతార భర్త విఘ్నేశ్ శివన్ నా ఆఫీసులో మూడేళ్లు పనిచేశాడు.. ఆ రూమర్లపై నటి సోనా షాకింగ్ కామెంట్స్!
ఈ కేబినెట్ భేటీ అనంతరం.. కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ మాట్లాడారు. 2025 నవంబర్ 10 సాయంత్రం ఎర్రకోట సమీపంలో జరిగిన కారు పేలుడు ఘటన దేశ వ్యతిరేక శక్తులు చేసిన దారుణమైన ఉగ్రవాద సంఘటనను దేశం చూసింది. ఈ పేలుడు ఫలితంగా ప్రాణ, ఆర్థిక నష్టం జరిగిందని తెలిపారు. బాధితులకు మంత్రివర్గం హృదయపూర్వక నివాళులు అర్పించిందని చెప్పారు. “మంత్రి వర్గం మృతుల కుటుంబాలకు సంతాపాన్ని తెలియజేస్తోంది. గాయపడిన వారందరూ త్వరగా కోలుకోవాలని ప్రార్థించింది. బాధితుల సహాయం చేస్తున్న వైద్య సిబ్బంది, తదితర సిబ్బందిని అభినందించింది. అమాయకుల ప్రాణనష్టానికి దారితీసిన ఈ దుర్మార్గపు, పిరికి చర్యను మంత్రివర్గం నిస్సందేహంగా ఖండిస్తుంది. ఈ ప్రతికూల పరిస్థితులలో ధైర్యం, కరుణతో సేవలు చేసిన అధికారులు, భద్రతా సంస్థలు, పౌరులను మంత్రివర్గం ప్రశంసించింది. ఈ సంఘటనపై వీలైనంత త్వరగా దర్యాప్తు చేయాలని మంత్రివర్గం ఆదేశించింది. నేరస్థులు, వారికి సహకరించిన వ్యక్తులు, స్పాన్సర్లను త్వరగా గుర్తించాలని ఆదేశిస్తోంది. ప్రభుత్వ అత్యున్నత స్థాయిలో పరిస్థితిని నిశితంగా పర్యవేక్షిస్తూనే ఉంటుంది. జాతీయ భద్రత, ప్రతి పౌరుడి భద్రతకు ప్రభుత్వం కట్టుబడి ఉంది.” అని ఆయన పేర్కొన్నారు.
READ MORE: Educated Terrorists: 24 ఏళ్లలో 36 సంఘటనలు.. ‘వైట్ కాలర్ టెర్రర్ మాడ్యూల్’ ఎప్పుడు ప్రారంభమైంది!
తాజావార్తలు
-
HYDRAA : హైడ్రా ప్రజావాణికి మరో బ్రేక్.. జూన్ 22 నుంచే మళ్లీ ప్రారంభం..!
-
Off The Record : కేటీఆర్కు సమాంతరంగా మరో వర్కింగ్ ప్రెసిడెంట్ పై కేసీఆర్ కసరత్తు
-
Nitin Nabin: విదేశాల నుంచి భారత యువతను ఆడించలేరు.. సీజేపీపై బీజేపీ పరోక్ష విమర్శలు..
-
Shashi Tharoor: రాహుల్గాంధీపై అనుచిత వ్యాఖ్యలు.. ‘ఒబామా.. మోడీ సంగతి ఏంటి?’.. రామచంద్ర గుహకు శశిథరూర్ కౌంటర్
-
Vaibhav’s Father: ‘సూర్యవంశీ వారి కాలి దుమ్ముకు కూడా సరిపోడు’.. సంచలన వ్యాఖ్యలు చేసిన వైభవ్ తండ్రి..
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!