Delhi Bomb Blast: ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో జరిగిన కారు బాంబు పేలుడు ఘటన దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. దేశ రాజధానిలో జరిగిన ఈ భయంకరమైన పేలుడులో కనీసం 12 మంది మరణించగా, 20 మందికి పైగా గాయపడ్డారు. ఈ ఘటనపై అస్సాంలో మాత్రం కొంత మంది మూర్ఖులు అనుచితంగా పోస్టులు పెడుతున్నారు. ఈ అంశంపై అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ ఫైర్ అయ్యారు. ఈ అవమానకర పోస్టులు చేసిన రాష్ట్రవ్యాప్తంగా 15 మందిని…
Delhi Blast Case: ఢిల్లీ పేలుళ్ల కేసులో మరో సంచలన అంశం బయటపడింది. ఉగ్రవాది డాక్టర్ షాహీన్ సిద్ధిఖీ రెండు నెలల క్రితం లక్నోకు వెళ్లి అనేక మంది అనుమానాస్పద వ్యక్తులను కలిసిందని దర్యాప్తులో తేలింది. ఆమె పరిచయస్తులలో కొందరు అయోధ్య రామాలయాన్ని సైతం సందర్శించారని వర్గాలు చెబుతున్నాయి. లక్నోలో షాహీన్ ఎవర్ని కలిసింది? ఆమె ఎక్కడ బస చేసింది? అయోధ్యలో ఏదైనా కుట్ర జరిపారా..? అనే కోణంలో దర్యాప్తు జరుపుతున్నారు. ఆమె లక్నోకు వచ్చినట్లు జమ్మూకశ్మీర్…
Delhi Bomb Blast: ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో నవంబర్ 10న జరిగిన విధ్వంసకర బాంబు దాడి కేసు దర్యాప్తులో సంచలన విషయం బయటపడింది. పేలుడు పదార్థాలతో నిండిన హ్యుందాయ్ ఐ20 కారులో ఉన్న వ్యక్తి మరెవరో కాదు ఉగ్రవాది డాక్టర్ ఉమర్ నబీ (ఉమర్ మొహమ్మద్) అని పోలీసులు, ఫోరెన్సిక్ బృందాలు బుధవారం రాత్రి ఆలస్యంగా నిర్ధారించాయి. కారు శిథిలాల నుంచి వెలికితీసిన కాలిపోయిన మృతదేహానికి DNA పరీక్ష నిర్వహించగా.. ఉమర్ కుటుంబ సభ్యుల నమూనాలతో 100%…
Union Cabinet: ఢిల్లీ పేలుడు ఘటనపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.. ఢిల్లీ పేలుళ్లను ఉగ్రవాద సంఘటనగా గుర్తించి, కేబినెట్ సమావేశంలో బాధితులకు నివాళులర్పించింది. తాజాగా ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గం.. ఎర్రకోట సమీపంలో జరిగిన కారు పేలుడు ఘటనలో ప్రాణనష్టంపై తీవ్ర విచారం వ్యక్తం చేసింది. మృతుల ఆత్మలకు శాంతి చేకూరాలని మంత్రి వర్గం రెండు నిమిషాలు మౌనం పాటించింది.
Delhi Blast 2025: ఢిల్లీలోని ఎర్రకోట మెట్రో స్టేషన్ సమీపంలో సోమవారం సాయంత్రం జరిగిన కారు బాంబు పేలుడు ఘటనపై దర్యాప్తులో వివరాలు ఒక్కొక్కటిగా వెల్లడవుతున్నాయి. తాజాగా ఢిల్లీ కారు పేలుడులో PAF పేరు బయటపడింది. ఇప్పటికే ఈ బాంబు పేలుడు కేసు NIAకి అప్పగించారు. ఇప్పటి వరకు జరిగిన దర్యాప్తులో ఈ కారు పేలుడులో ఫరీదాబాద్ టెర్రర్ మాడ్యూల్ ప్రమేయం ఉన్నట్లు తేలింది. ఈ పేలుడు వెనుక ప్రధాన సూత్రధారి డాక్టర్ ఉమర్ అని చెబుతున్నారు.…
Delhi Car Blast : దేశ రాజధాని ఢిల్లీలో సోమవారం సాయంత్రం అత్యంత రద్దీగా ఉండే ప్రాంతంలో జరిగిన తీవ్ర స్థాయి పేలుడు ఢిల్లీవాసులను భయాందోళనలకు గురిచేసింది. ఎర్రకోట మెట్రో స్టేషన్ సమీపంలో ట్రాఫిక్ సిగ్నల్ వద్ద కారులో సంభవించిన ఈ పేలుడులో 12 మంది మరణించగా, 20 మందికి పైగా గాయపడ్డారు. సోమవారం సాయంత్రం సుమారు 6:52 గంటల సమయంలో, సాధారణంగా కార్యాలయాలు ముగిసి ప్రజలు ఇళ్లకు చేరే సమయంలో ఈ దారుణం జరిగింది. ఎర్రకోట…
Delhi Car Blast: ఢిల్లీ ఎర్రకొట వద్ద కారు బ్లాస్ట్ దేశాన్ని భయాందోళనకు గురి చేసింది. సోమవారం సాయంత్రం, కారులో అమోనియం నైట్రేట్ నింపుకుని దాడికి పాల్పడ్డాడు. ఈ దాడికి పాల్పడిన వ్యక్తిని డాక్టర్ ఉమర్ మొహమ్మద్గా గుర్తించారు. ఈ దాడిలో ఇప్పటి వరకు 12 మంది మరణించారు.
సోమవారం సాయంత్రం ఢిల్లీలోని చాందినీ చౌక్ వద్ద భారీ పేలుడు సంభవించింది. ఎర్రకోటకు ఎదురుగా జరిగిన కారు పేలుడు యావత్ దేశాన్ని ఒక్కసారిగా కుదిపేసింది. ఎర్రకోట పేలుడు ఆత్మాహుతి దాడి అని భద్రతా సంస్థలు అంటున్నాయి. కారు బ్లాస్ట్కు ఫరీదాబాద్ టెర్రర్ మాడ్యూల్తో సంబంధం ఉందని అధికారులు అనుమానిస్తున్నారు. పేలుడు ఘటనకు డాక్టర్ ఉమర్ మహ్మద్ సూత్రధారి అని దర్యాప్తు సంస్థలు పేర్కొన్నాయి. ఉమర్ తన సహచరులతో కలిసి మాస్టర్ ప్లాన్ చేసినట్లు తెలిపాయి. దాడికి కారణమైన…
ఢిల్లీలోని ఎర్రకోట కారు పేలుడు ఘటనపై కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ స్పందించారు. పేలుడు ఘటనపై భద్రతా, దర్యాప్తు సంస్థలు సమగ్ర విచారణ చేస్తున్నాయని, నిందితులను కఠినంగా శిక్షిస్తాం అని చెప్పారు. బాధితులకు ప్రభుత్వం న్యాయం చేస్తుందని రాజ్నాథ్ సింగ్ హామీ ఇచ్చారు. ఈ చర్యను శాంతికి భంగం కలిగించే పిరికి ప్రయత్నంగా పేర్కొన్నారు. ఢిల్లీలో ఈరోజు జరిగిన మీడియా సమావేశంలో రక్షణ శాఖ మంత్రి మాట్లాడారు. ‘ఎర్రకోట కారు పేలుడు ఘటనపై దేశంలోని…
దేశ రాజధాని ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో సోమవారం జరిగిన కారు పేలుడు ఘటనకు డాక్టర్ ఉమర్ మహ్మదే ప్రధాన సూత్రధారి అని దర్యాప్తు సంస్థలు పేర్కొన్నాయి. ఉమర్ తన ఇద్దరు సహచరులతో కలిసి ప్లాన్ చేసినట్లు తెలిపాయి. పేలుడుకు అమ్మోనియం నైట్రేట్ ఫ్యూయల్ ఆయిల్ను ఉమర్ వాడాడు. పేలుడు ఘటనలో డిటోనేటర్లను వినియోగించినట్లు అధికారులు చెప్పారు. ఢిల్లీలో పేలుడు ఘటనపై అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. పేలుడుకు కారణమైన ఐ20 కారు కదలికలపై దర్యాప్తు సంస్థలు కీలక…