Delhi : ఆగ్రాలో దారుణం..భర్తపై పెట్రోల్ పోసి నిప్పంటించిన భార్య..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఢిల్లీలో దారుణ ఘటన వెలుగు చూసింది.. కాపురానికి ఇంటికి రమ్మని పిలవడానికి అత్తింటికి వెళ్ళిన ఓ భర్తను తన భార్య పక్కా ప్లాన్ తో అతి దారుణంగా చంపాలనుకుంది.. మాట్లాడుతుండగా పెట్రోల్ పోసి నిప్పంటించింది భార్య.. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉంది.. ఈ దారుణ ఘటన ఆగ్రాలో వెలుగు చూసింది.. వివరాల్లోకి వెళితే..
భర్తపై పెట్రోల్ పోసి సజీవ దహనం చేసేందుకు ప్రయత్నించిన ఓ మహిళ, ఆమె కుటుంబ సభ్యులపై ఆగ్రా పోలీసులు కేసు నమోదు చేశారు. భార్యను ఇంటికి తీసుకొచ్చేందుకు అత్తమామల ఇంటికి వెళ్లిన సమయంలో ఈ ఘటన జరిగింది. భార్య, ఆమె సోదరుడు మరియు ఆమె తల్లి కుట్ర పన్నారని, తన సోదరుడు ధర్మేంద్రను సజీవ దహనం చేశారని ఆరోపిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు భాధితుడి సోదరుడు.. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వ్యక్తి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ట్రాన్స్ యమునా కాలనీలోని తేవారి బాగియా ప్రాంతంలో ఈ ఘటన జరిగింది.
Also Read
పోలీసుల ఫిర్యాదు ప్రకారం.. ప్రీతి, ధర్మేంద్ర నవంబర్ 8, 2019 న వివాహం చేసుకున్నారు. వివాహం అయినప్పటి నుండి ప్రీతి, ఆమె కుటుంబ సభ్యుల ప్రవర్తన స్నేహపూర్వకంగా లేదని బాధితుడి సోదరుడు లోకేష్ తెలిపారు. వివాహమైనప్పటికీ ప్రీతి తన తల్లిగారి ఇంటి వద్దే ఎక్కువ సమయం గడిపేదని పోలీసుల ఫిర్యాదులో పేర్కొన్నారు. ప్రీతి మూడు నెలల క్రితం తన పుట్టింటికి వెళ్లింది.. ఇక జూలై 18, 2023 న, ధర్మేంద్ర ఆమెను కలవడానికి వెళ్ళాడు, ఆమెను తిరిగి తన అత్తమామల ఇంటికి తీసుకురావాలనే ఉద్దేశ్యంతో ధర్మేంద్ర ఇంట్లో ఉండగానే ప్రీతి, ఆమె తల్లి శిల్ప, ఆమె సోదరుడు అజయ్ సింగ్ పెట్రోల్ పోసి నిప్పంటించారు. అతని అరుపులు విన్న ఇరుగుపొరుగు వారు వచ్చి వెంటనే అతడిని వైద్య సహాయం కోసం ఆసుపత్రికి తరలించారు. అతని పరిస్థితి ఇంకా విషమంగా ఉంది.. ఈ ఘటన పై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి, ప్రీతిని, ఆమె కుటుంబ సభ్యులను అదుపులోకి తీసుకున్నారు..
- Tags
- Agra
- Crime News
- Delhi
- latest news
- viral
తాజావార్తలు
-
Konda Surekha : కాంగ్రెస్ అధ్యక్షుడితో కొండా సురేఖ భేటీ.. కూతురి వ్యాఖ్యలపై ఖర్గే ఆరా
-
Telangana Auto Strike : ఆటో, క్యాబ్ సమ్మె క్యాన్సిల్.. ప్రభుత్వ చర్చలు సక్సెస్
-
AK-203: AK-203 ‘షేర్’.. రష్యన్ టెక్నాలజీ, మేడ్ ఇన్ ఇండియా రైఫిల్
-
NMMS Scholarship : విద్యార్థులకు రూ.48 వేల స్కాలర్షిప్.. రేపే లాస్ట్ ఛాన్స్.!
-
Varanasi: 50కి పైగా భాషల్లో ‘వారణాసి’.. డబ్బింగ్ కోసం 1600 మందికి పైగా ఆర్టిస్టులు!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!
-
Home Remedies: వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు, దోమలు, చీమలు, నల్లులకు చెక్ పెట్టే చిట్కాలు ఇవే!
-
Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!