India-China: సరిహద్దు వివాదం.. భారత్-చైనాల మధ్య ఉన్నత స్థాయి చర్చలు మరింత ఆలస్యం..!
- భారత్-చైనాల మధ్య ఉన్నత స్థాయి చర్చలు మరింత ఆలస్యం..!
- ఏడు నెలల నుంచి జరగని సైనిక సమావేశాలు
- సరిహద్దు వివాదంపై 2021 ఫిబ్రవరిలో చర్చలు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సరిహద్దు ఉద్రిక్తతలను పరిష్కరించడానికి ఇండియా-చైనా కార్ప్స్ కమాండర్-22వ రౌండ్ ఉన్నత స్థాయి చర్యలు మరింత ఆలస్యం కానున్నట్లు తెలుస్తోంది. ఫిబ్రవరి 19న జరిగిన 21వ రౌండ్ చర్చల తర్వాత.. రెండు అణ్వాయుధ పొరుగు దేశాల మధ్య సంభాషణలో భాగంగా ఏడు నెలల నుంచి సైనిక సమావేశాలు జరగలేదు. 2020 మేలో లడఖ్లోని గాల్వాన్ వ్యాలీ వద్ద ఇరుదేశాల సైన్యాల మధ్య హింసాత్మక ఘర్షణ జరిగింది. అప్పటి నుంచి భారతదేశం, చైనా మధ్య సంబంధాలు అత్యంత తక్కువగా ఉన్నాయి. ఈ క్రమంలో సరిహద్దు వివాదంపై 2021 ఫిబ్రవరిలో చర్చలు జరిగాయి.
Read Also: Iraqi Airways: చైనా వెళ్తున్న ఇరాకీ ఎయిర్వేస్ విమానం కోల్కతాలో అత్యవసర ల్యాండింగ్..
Also Read
- Vaibhav Sooryavanshi: జింబాబ్వే సిరీస్పై కన్నేసిన వైభవ్ సూర్యవంశీ.. ‘ఈ సిరీస్ వదిలే ప్రసక్తే లేదు’..
- అమ్మా.. నాన్న నన్ను క్షమించండి..
- Shreyas Iyer: రేపటి మ్యాచ్కు మా స్ట్రాటజీ ఇదే.. మమ్మల్ని ఎవరూ ఆపలేరు: శ్రేయస్ అయ్యర్
- Rahul Gandhi: 'ప్రభుత్వాన్ని తొలగించండి' అని పోలీసులు నా చెవిలో చెప్పారు: రాహుల్ గాంధీ
తూర్పు లడఖ్లోని వాస్తవ నియంత్రణ రేఖ (ఎల్ఎసి) వెంబడి కొనసాగుతున్న ప్రతిష్టంభనను పరిష్కరించడానికి ప్రారంభించిన కమాండర్-స్థాయి చర్చలు చారిత్రాత్మకంగా శాంతి, స్థిరత్వాన్ని కాపాడుకోవడంలో కీలక పాత్ర పోషించాయి. 21వ రౌండ్ తర్వాత శాంతిని కాపాడేందుకు ఇరుపక్షాల నిబద్ధతను ధృవీకరిస్తూ ప్రకటన చేసినప్పటికీ, వివాదానికి స్పష్టమైన పరిష్కారం లభించలేదు. అయితే అధికారుల మధ్య గ్రౌండ్-లెవల్ రొటీన్ కమ్యూనికేషన్ మార్పిడి జరిగింది. కానీ 2024 ఫిబ్రవరి తర్వాత కమాండర్ స్థాయి చర్చలు జరగలేదు. వర్కింగ్ మెకానిజం ఫర్ కన్సల్టేషన్ అండ్ కోఆర్డినేషన్ (WMCC) సమావేశాల ద్వారా చర్చలు కొనసాగుతున్నప్పటికీ.. ఉన్నత స్థాయి సైనిక చర్చలు లేకపోవడం ఆలస్యం వెనుక కారణాలపై ఊహాగానాలకు దారితీసింది.
Read Also: Mumbai Rain: ముంబైలో వర్ష బీభత్సం.. ఓపెన్ డ్రైన్లో పడి మహిళ మృతి
ముఖ్యంగా పెట్రోలింగ్ హక్కులు, ఉపసంహరణకు సంబంధించిన సమస్యలను పరిష్కరించడంలో ప్రాథమిక పురోగతి ఉన్నప్పటికీ.. చర్చలు నిలిచిపోయినట్లు తెలుస్తోంది. ఇటీవల.. విదేశాంగ మంత్రి జైశంకర్ కూడా ఇదే విధమైన భావాలను వ్యక్తం చేశారు. సాధించిన పురోగతిని గుర్తిస్తూ.. పెట్రోలింగ్ హక్కులు, పూర్తి స్థాయిని తగ్గించడానికి సంబంధించిన సమస్యలు పరిష్కరించబడలేదని నొక్కి చెప్పారు.
తాజావార్తలు
-
Chiranjeevi: నా అభిమానులు ఎస్కేఎన్, సాయి రాజేష్లను చూసి గర్వపడుతున్నా..
-
Delhi Protest : దేశ రాజధానిలో మళ్లీ రగిలిన ఉద్రిక్తతలు.. జంతర్ మంతర్ వద్ద రణరంగం.!
-
CM Revanth Reddy : మున్సిపల్ అధికారులకు సీఎం రేవంత్ అల్టిమేటం..
-
Vaibhav Sooryavanshi: జింబాబ్వే సిరీస్పై కన్నేసిన వైభవ్ సూర్యవంశీ.. ‘ఈ సిరీస్ వదిలే ప్రసక్తే లేదు’..
-
HYDRA Ranganath: రూ.1.5 లక్షల కోట్ల ప్రభుత్వ భూములు కాపాడాం
ట్రెండింగ్
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!