DCP Vineeth : చిట్ఫండ్ మోసాల పట్ల జనాల అప్రమత్తంగా ఉండాలి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మాదాపూర్లోని సమతా మూర్తి చిట్ ఫండ్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ చిట్టీల పేరుతో మోసాలకు పాల్పడింది. ఈ నేపథ్యంలో సమత మూర్తి చిట్ ఫండ్ ఇద్దరు నిర్వాహకులు శ్రీనివాస్ రాకేష్ అరెస్ట్ చేశారు పోలీసులు. ఈ సందర్భంగా మాదాపూర్ డీపీసీ వినీత్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాదాపూర్ డీసీపీ వినీత్ మాట్లాడుతూ.. మాదాపూర్ లో వేల్పుల శ్రీనివాస్ రాకేష్ గణేష్ డైరెక్టర్ లుగా ఏర్పడి సమత మూర్తి చిట్ ఫండ్ పేరుతో సంస్థ ఏర్పాటు చేశారన్నారు. ఎవరికైతే ఆర్థిక అవసరాలను చేసుకుని చిట్టి ద్వారా మోసాలు చేశారని ఆయన పేర్కొన్నారు. ఖాతాదారులను మోసం చేయడం ద్వారా సుమారు ఐదు కోట్ల వరకు దండుకున్నారని ఆయన అన్నారు. దాదాపు ఇప్పటి వరకు 120 వరకు బాధితులు ఉన్నట్టు ఐడెంటిఫై చేసామని ఆయన తెలిపారు. ఇందులో కొంత మంది బాధితుల స్టేట్మెంట్ రికార్డు చేసామని, ఇప్పటివరకు ఐదు కోట్ల మోసం జరిగింది విచారణలో మోసం విలువ పెరగవచ్చని ఆయన అన్నారు. శ్రీనివాస్ రాకేష్ లను అరెస్ట్ చేసి రిమాండ్ చేసామని ఆయన తెలిపారు. మొబైల్ ఫోన్స్ సీజ్ చేసాం గణేష్ పరారీలో ఉన్నారని ఆయన పేర్కొన్నారు.
ఇద్దరు ఉద్యోగులు కూడా ఉన్నారు వారిని కూడా ఆదుపులోకి తీసుకుంటామని, అమాయకులకు డబ్బు ఆశ చూపి చిట్ఫండ్ నిర్వాహకులు మోసాలకు పాల్పడుతున్నారన్నారు. మాదాపూర్ జోన్లో ఇలాంటివి ఆరు కేసులు ఉన్నాయని ఆయన వెల్లడించారు. వాళ్లను కూడా అరెస్ట్ చేస్తామని, గత ఆరు నెలలుగా నిందితులు చిట్ఫండ్ సంస్థ ద్వారా మోసాలకు పాల్పడుతున్నారన్నారు. మాదాపూర్ కూకట్పల్లి, ఎల్బీనగర్లో బ్రాంచెస్ ఓపెన్ చేశారని, తెలిసిన పరిచయస్తుల ద్వారా అలానే ఆన్లైన్ ద్వారా ఖాతాదారులను చేర్చుకున్నారన్నారు. నెలవారీగా డబ్బులు వచ్చే స్కీమ్స్ ఉన్నాయని ఖాతాదారులను నమ్మించారని, మొదట రెండు మూడు నెలలు సక్రమంగా డబ్బులు ఇచ్చి ఆపై మోసాలకు పాల్పడ్డారన్నారు. సమత మూర్తి పేరుతోపాటు చిన్న జీయర్ పేరు కూడా వాడారు వారికి ఈ చిట్ ఫండ్ కి ఎలాంటి సంబంధం లేదన్నారు. దోచుకున్న డబ్బు ఎక్కడ ఉందో సమాచారం ఉందని, బాధితులకు అప్పగించే ప్రయత్నం చేస్తామన్నారు. చిట్ఫండ్ మోసాల పట్ల జనాల అప్రమత్తంగా ఉండాలని ఆయన అన్నారు.
Also Read
- 6.99 అంగుళాల 120Hz OLED డిస్ప్లే, 8,000mAh బ్యాటరీతో REDMI Note 17 5G లాంచ్..!
- Engineering College fees: "అక్షరాలను అమ్ముకుంటున్న భకాసురులు".. ఇంజినీరింగ్ కాలేజీల్లో అదనపు వసూళ్ల పర్వం!
- Crispy Wheat Flour Snacks: బయటి జంక్ ఫుడ్కి బై..బై.. ఇంట్లోనే గోధుమపిండితో కరకరలాడే హెల్తీ స్నాక్స్ చేసేయండి ఇలా.!
- Local Body Elections: స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధంగా ఉండాలి.. మంత్రులకు నారా లోకేష్ దిశానిర్దేశం!
తాజావార్తలు
-
India Post Recruitment 2026: 10th పాసయ్యారా?.. ఇండియా పోస్ట్లో ప్రభుత్వ ఉద్యోగం పొందే అవకాశం.. మంచి జీతం
-
6.99 అంగుళాల 120Hz OLED డిస్ప్లే, 8,000mAh బ్యాటరీతో REDMI Note 17 5G లాంచ్..!
-
RC17 – Rukmini Vasanth: చరణ్ – సుకుమార్ సినిమాలో కాంతర హీరోయిన్!
-
Ajinkya Rahane: ఎంఎస్ ధోనీ రూమ్కు రూల్.. తలుపు మూసి ఉంటే అంతే సంగతులు!
-
Dorothy Official Teaser : ‘డొరోతి’ టైటిల్ టీజర్.. దటీజ్ కార్తీక్ సుబ్బరాజ్
ట్రెండింగ్
-
Crispy Wheat Flour Snacks: బయటి జంక్ ఫుడ్కి బై..బై.. ఇంట్లోనే గోధుమపిండితో కరకరలాడే హెల్తీ స్నాక్స్ చేసేయండి ఇలా.!
-
Best EV Bikes: బెస్ట్ మైలేజ్, అదిరే ఫీచర్లతో రూ.1.50 లక్షలలోపు కొనుగోలు చేయగల టాప్-5 EV బైక్లు ఇదిగో..!
-
Incredible Story: దేశవాళీ క్రికెట్లో 9 వేల రన్స్.. టీమిండియా డెబ్యూలోనే హాఫ్ సెంచరీ.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఓపెనర్!
-
Bear Kills Siblings: ఎలుగుబంటి బీభత్సం.. అన్నాచెల్లెళ్లపై దాడి, ఇద్దరి మృతి..!
-
Jio మాస్టర్ ప్లాన్.. రూ.319కే 18 నెలల Google AI Pro, 45GB హై-స్పీడ్ డేటా, అన్లిమిటెడ్ కాల్స్..!