Dasoju Sravan Kumar Fired on TPCC Revanth Reddy
కాంగ్రెస్ పార్టీని వీడుతున్నట్లు కాంగ్రెస్ జాతీయ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ కుమార్ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే తాజాగా మరోసారి ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సోనియా, రాహుల్ గాంధీ ఆలోచనలు తుంగలో తొక్కి రేవంత్ పని చేస్తున్నారని ఆరోపించారు. రేవంత్, మనిక్కం ఠాగూర్, సునీల్ ముగ్గురు కుమ్మక్కయ్యారన్నారు. ఇద్దరు రేవంత్ కు తాబేధారులు అయ్యారు. ప్రశ్నించే వాళ్లపై తప్పుడు నివేదికలు ఏఐసీసీకి ఇస్తున్నారు. కాంగ్రెస్ పార్టీని నామరూపాలు లేకుండా చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. మాణిక్కం ఠాగూర్, సునీల్లు రేవంత్ తప్పులపై మాట్లాడడం లేదు. కొప్పుల రాజు, జై రాం రమేశ్ కూడా ఏమి చేయలేని పరిస్థితి ఇప్పుడు ఉంది. రేవంత్ రెడ్డి పార్టీ నాయకులను బలహీన పరిచే ప్రయత్నం చేస్తున్నారు. ఏఐసీసీ పట్టించుకోదు.
టీపీసీసీ లో సొంత ముఠాను రేవంత్ ను తయారు చేశారు. ప్రతి నియోజకవర్గంలో బహుళ నాయకత్వం ను రేవంత్ ప్రోత్సాహిస్తున్నారు. రేవంత్ నాయకత్వంలో సొబర్ కాంగ్రెస్ పార్టీ…రాబర్ కాంగ్రెస్ పార్టీగా మారింది. ఏఐసీసీ నుంచి టీపీసీసీని ఫ్రాంచైజ్ తాను తెచ్చుకున్నట్టు రేవంత్ వ్యవహరిస్తున్నారు. రేవంత్ కు ఎవరికి దొరకడు. రేవంత్ దగ్గర ఎల్ 1,ఎల్ 2, ఎల్ 3 ,ఎల్ 4 దర్శనాలు ఉంటాయని, మాఫియాను నడిపినట్టు రేవంత్ నడుపుతున్నారన్నారు. కేసీఆర్ కు వ్యతిరేకంగా పోరాటం కొనసాగిస్తా, రేవంత్, కేసీఆర్ తీరు ఒక్కటే అని దాసోజు శ్రవణ్ కుమార్ అన్నారు.