Damodara Raja Narasimha : అందోల్ నియోజకవర్గం లో 30 కోట్లతో రోడ్ల మరమ్మతులకు శంకుస్థాపన
- పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో రోడ్లు అద్వాన్నంగా మారాయి
- రాష్ట్రవ్యాప్తంగా రోడ్ల పునర్నిర్మాణం పనుల్లో రాష్ట్ర ప్రభుత్వం ఉంది
- కుల గణన పూర్తి కావస్తున్నది. త్వరలో ప్రభుత్వానికి నివేదిక
- చలికాలం దృష్ట్యా సంక్షేమ వసతి గృహాలు, గురుకుల పాఠశాలల విద్యార్థులకు మెరుగైన వస్తువులు కల్పించాలి.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Damodara Raja Narasimha : గత పది సంవత్సరాల బిఆర్ఎస్ పాలనలో రోడ్ల మరమ్మత్తులు లేక రాష్ట్రంలో రోడ్లన్నీ అద్వాన్నంగా తయారయ్యాయి అని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ అన్నారు. మంగళవారం అందోల్ నియోజకవర్గంలో సుమారు 30 కోట్లతో వివిధ రోడ్డు పునర్నిర్మాణం పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. గత పది సంవత్సరాల కాలంలో రోడ్లు మరమత్తు పనులు చేపట్టకపోవడం తో రోడ్లన్నీ అధ్వానంగా తయారయ్యాయి అన్నారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం రోడ్ల పునర్నిర్మాణ పనుల్లో ఉందన్నారు. అందులో నియోజకవర్గంలో మంగళవారం రూ .30 కోట్లతో వివిధ రోడ్డు నిర్మాణం పనులకు శంకుస్థాపన చేసినట్లు మంత్రి తెలిపారు. మంగళవారం పుల్కల్ మండలం కోడూరు ఎక్స్ రోడ్డు నుండి కొండారెడ్డిపల్లి ఎక్స్ రోడ్ వరకు కోట్లతో, డాకుర్ పిడబ్ల్యుడి రోడ్డు నుండి పోతిరెడ్డిపల్లి ఎక్స్ రోడ్ వరకు కోట్లతో, రోళ్ల పహాడ్ గేట్ నుండి గ్రామం వరకు కోట్లతో రోడ్డు నిర్మాణం పనులకు మంత్రి దామోదర్ శంకుస్థాపన చేశారు. రానున్న రోజుల్లో రాష్ట్రంలోని అన్ని రోడ్లకు మరమ్మతు పనులు చేపట్టడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుందన్నారు.
ICC: 29న ‘ఛాంపియన్స్ ట్రోఫీ 2025’పై ఐసీసీ నిర్ణయాత్మక సమావేశం..
Also Read
- INDIA alliance: రేపే ఇండియా కూటమి సమావేశం.. 23 పార్టీలు హాజరయ్యే ఛాన్స్..
- CM Chandrababu: స్థానిక ఎన్నికలపై సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు..
- India vs Pakistan: అంపైర్లు కూడా భారత్కే సపోర్ట్.. పాక్ క్రికెటర్ సంచలన ఆరోపణలు..
- TG20 League: 'హైదరాబాద్ ఈ ఛాంపియన్స్' ఫైనల్ స్క్వాడ్.. ఇదిగో పూర్తి లిస్ట్..
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వే కులగనున కార్యక్రమం పూర్తికావస్తుందన్నారు. సామాజిక ఇంటింటి సర్వే పూర్తికాగానే ప్రభుత్వం నీకు నివేదిక అందజేయున్నట్లు తెలిపారు. చలికాలంను దృష్టిలో పెట్టుకొని సంక్షేమ వసతి గృహాల విద్యార్థులకు గురుకుల పాఠశాలల విద్యార్థులకు ప్రత్యేక సౌకర్యాలు కల్పించడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు గతంలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ వసతి గృహాల విద్యార్థులకు గురుకుల పాఠశాల విద్యార్థులకు కాస్మోటిక్ చార్జీలు మేస్చార్జీలు పెంచిందన్నారు విద్యార్థులకు నాణ్యమైన భోజనం మెనూ ప్రకారం అందించేలా చర్యలు చేపట్టిందన్నారు. చలికాలంలో విద్యార్థులు ఇబ్బందులు పడకుండా ఉండడానికి అవసరమైన అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ చంద్ర శేఖర్, పంచాయతీ రాజ్, ఎస్ ఈ జగదీశ్, ఆర్ డి ఓ పాండు, మండల ప్రత్యేక అధికారి, ప్రజా ప్రతినిధులు, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.
CM Revanth Reddy : ధాన్యం కొనుగోళ్లు త్వరితగతిన పూర్తి చేయాలి
తాజావార్తలు
-
INDIA alliance: రేపే ఇండియా కూటమి సమావేశం.. 23 పార్టీలు హాజరయ్యే ఛాన్స్..
-
CM Revanth Reddy : సైబరాబాద్కు రూ.1,858 కోట్ల బూస్ట్.. రేపు సీఎం భారీ శంకుస్థాపనలు
-
CM Chandrababu: స్థానిక ఎన్నికలపై సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు..
-
Kitchen Hacks: ఇలా చేస్తే మీ వంటింట్లోకి చీమలు చచ్చినారావు.. కేవలం 2 నిమిషాల్లో ఇంట్లోనే ఈ నాచురల్ స్ప్రే చేసుకోండిలా!
-
buchi babu: సినిమా హిట్ అయినా ఆ తప్పును ఒప్పుకున్న డైరెక్టర్ బుచ్చిబాబు..
ట్రెండింగ్
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!