ICC: 29న ‘ఛాంపియన్స్ ట్రోఫీ 2025’పై ఐసీసీ నిర్ణయాత్మక సమావేశం..
- ఈనెల 29న ఐసీసీ కీలక సమావేశం
- ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ ఖరారు చేసే అవకాశం
- వర్చువల్గా సమావేశాన్ని నిర్వహించనున్న ఐసీసీ.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ఈనెల 29న కీలక సమావేశం ఏర్పాటు చేయనుంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి-మార్చిలో పాకిస్థాన్లో జరగనున్న ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ను ఖరారు చేసేందుకు వర్చువల్ (ఆన్లైన్) సమావేశాన్ని నిర్వహించనుంది. కాగా.. టోర్నీ షెడ్యూల్ను ప్రకటించడంలో జాప్యం జరుగుతుండటంతో.. ఈ మీటింగ్ నిర్వహిస్తున్నారు. అయితే.. ఇరుదేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్న నేపథ్యంలో పాకిస్థాన్లో ఆడేందుకు భారత్ నిరాకరించడమే ఆలస్యానికి కారణం. 2008 ముంబైలో ఉగ్రదాడుల తర్వాత భారత్ పాకిస్థాన్లో పర్యటించలేదు.
బీసీసీఐ ఈ టోర్నమెంట్లో హైబ్రిడ్ మోడల్లో ఆడాలని నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో టీమిండియా మ్యాచ్లు మరో దేశంలో నిర్వహించుతారు. ఇండియా UAEలో నిర్వహించాలని కోరుతుంది. మరోవైపు.. ఈ నిర్ణయంపై పీసీబీ ఇంకా అంగీకరించలేదు. ఇదిలా ఉంటే.. ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ గురించి చర్చించడానికి ఐసీసీ బోర్డు నవంబర్ 29న సమావేశమవుతుందని ఐసీసీ ప్రతినిధి మంగళవారం పీటీఐకి చెప్పారు. డిసెంబర్ 1న జై షా ఐసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించడానికి ముందు ఈ సమావేశం జరుగుతుండటంతో.. ఈ సమస్యను పరిష్కరించేందుకు ఆసక్తి చూపనున్నారు.
Also Read
- Bihar IPL Team: ప్రతిభ ఉన్నా గుర్తింపు లేదు.. బీహార్కు కూడా ఐపీఎల్ జట్టు కావాలి..? పారిశ్రామికవేత్త భావోద్వేగ పోస్ట్ వైరల్..!
- Honda City facelift: భారత మార్కెట్లోకి సరికొత్త హోండా సిటీ ఫేస్లిఫ్ట్.. అదిరిపోయే లుక్స్, ఫీచర్లు!
- Prakash Raj: కాక్రోచ్ జనతా పార్టీలో ప్రకాష్ రాజ్ ఎంట్రీ.. వైరల్ అవుతున్న వీడియో!
- West Bengal: ప్రధాని మోడీకి ఝల్మురి వడ్డించిన షాప్ ఓనర్కి ప్రాణ భయం..! పాక్ నుంచి బెదిరింపులు..
Read Also: Liam Livingstone: RCB ‘హీరో’నే తీసుకుంది… 15 బంతుల్లోనే ఫిఫ్టీ కొట్టిన ఇంగ్లాండ్ ఆల్ రౌండర్
గత ఏడాది భారత్ ఆసియా కప్ మ్యాచ్లను శ్రీలంకలో ఆడింది. అయితే.. ఆసియా కప్ కోసం పాకిస్తాన్ కరాచీ, రావల్పిండి, లాహోర్లోని స్టేడియాలను పునరుద్ధరించింది. దీనికి పీసీబీ మిలియన్ల డాలర్లు ఖర్చు చేసింది. 1996లో పాకిస్థాన్ సహ-ఆతిథ్యమిచ్చిన ప్రపంచ కప్ తర్వాత అక్కడ జరుగుతున్న తొలి ఐసీసీ టోర్నమెంట్ ఛాంపియన్స్ ట్రోఫీ. 2009లో శ్రీలంక జట్టు బస్సుపై జరిగిన దాడి కారణంగా కొన్నాళ్ల పాటు అంతర్జాతీయ మ్యాచ్లకు ఆతిథ్యం ఇవ్వకుండా కోల్పోయిన పాకిస్థాన్.. తాజాగా ఇంగ్లండ్, ఆస్ట్రేలియా సహా పెద్ద జట్లకు తమ దేశంలో ఆతిథ్యం ఇచ్చింది.
ఐసీసీ 2021లో ఛాంపియన్స్ ట్రోఫీ ఆతిథ్య హక్కులను పాకిస్తాన్కు ఇచ్చింది. అందువల్ల పాకిస్తాన్లోనే అన్ని మ్యాచ్లను నిర్వహించడానికి అక్కడి క్రికెట్ ఫ్యాన్స్ నుంచి పీసీబీకి ఒత్తిడి కలిగిస్తున్నారు. ఈ క్రమంలో.. ఛాంపియన్స్ ట్రోఫీ కోసం భారత్ పాకిస్తాన్కు రాకపోతే.. భవిష్యత్తులో జరిగే ఐసీసీ పోటీలకు తమ జట్టును అక్కడికి పంపబోమని పీసీబీ తేల్చి చెప్పింది. మరోవైపు.. పాకిస్తాన్ గత సంవత్సరం వన్డే ప్రపంచ కప్ కోసం భారతదేశంలో పర్యటించింది. ఏడేళ్ల తర్వాత పాకిస్తాన్ జట్టు భారత్లో పర్యటించింది.
తాజావార్తలు
-
Bihar IPL Team: ప్రతిభ ఉన్నా గుర్తింపు లేదు.. బీహార్కు కూడా ఐపీఎల్ జట్టు కావాలి..? పారిశ్రామికవేత్త భావోద్వేగ పోస్ట్ వైరల్..!
-
Gayapadda Simham: ‘గాయపడ్డ సింహం’ ఓటీటీ రిలీజ్..
-
Honda City facelift: భారత మార్కెట్లోకి సరికొత్త హోండా సిటీ ఫేస్లిఫ్ట్.. అదిరిపోయే లుక్స్, ఫీచర్లు!
-
Kodak QLED Smart TV: కోడాక్ క్యూలెడ్ స్మార్ట్ టీవీ రిలీజ్.. Google TV 5.0తో థియేటర్ ఫీల్!
-
Peddi: ‘పెద్ది’ నుండి స్పెషల్ సాంగ్ ప్రోమో రిలీజ్.. అదిరిపోయిన చరణ్ – శృతి స్టెప్స్
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!