ICC: 29న ‘ఛాంపియన్స్ ట్రోఫీ 2025’పై ఐసీసీ నిర్ణయాత్మక సమావేశం..
- ఈనెల 29న ఐసీసీ కీలక సమావేశం
- ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ ఖరారు చేసే అవకాశం
- వర్చువల్గా సమావేశాన్ని నిర్వహించనున్న ఐసీసీ.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ఈనెల 29న కీలక సమావేశం ఏర్పాటు చేయనుంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి-మార్చిలో పాకిస్థాన్లో జరగనున్న ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ను ఖరారు చేసేందుకు వర్చువల్ (ఆన్లైన్) సమావేశాన్ని నిర్వహించనుంది. కాగా.. టోర్నీ షెడ్యూల్ను ప్రకటించడంలో జాప్యం జరుగుతుండటంతో.. ఈ మీటింగ్ నిర్వహిస్తున్నారు. అయితే.. ఇరుదేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్న నేపథ్యంలో పాకిస్థాన్లో ఆడేందుకు భారత్ నిరాకరించడమే ఆలస్యానికి కారణం. 2008 ముంబైలో ఉగ్రదాడుల తర్వాత భారత్ పాకిస్థాన్లో పర్యటించలేదు.
బీసీసీఐ ఈ టోర్నమెంట్లో హైబ్రిడ్ మోడల్లో ఆడాలని నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో టీమిండియా మ్యాచ్లు మరో దేశంలో నిర్వహించుతారు. ఇండియా UAEలో నిర్వహించాలని కోరుతుంది. మరోవైపు.. ఈ నిర్ణయంపై పీసీబీ ఇంకా అంగీకరించలేదు. ఇదిలా ఉంటే.. ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ గురించి చర్చించడానికి ఐసీసీ బోర్డు నవంబర్ 29న సమావేశమవుతుందని ఐసీసీ ప్రతినిధి మంగళవారం పీటీఐకి చెప్పారు. డిసెంబర్ 1న జై షా ఐసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించడానికి ముందు ఈ సమావేశం జరుగుతుండటంతో.. ఈ సమస్యను పరిష్కరించేందుకు ఆసక్తి చూపనున్నారు.
Also Read
- Aman Sanger: నాలుగేళ్లలో ఐదున్నర లక్షల కోట్ల సంపాదన.. 25 ఏళ్ల భారతీయ కుర్రాడి సక్సెస్ స్టోరీ..
- Anant Ambani: టీటీడీకి రూ.27.5 కోట్ల భారీ విరాళం.. 50 మంది డ్రైవర్లు, ఛార్జింగ్ స్టేషన్ కూడా!
- Iran: "నరకం చూపిస్తాం".. అమెరికా, గల్ఫ్ దేశాలకు ఇరాన్ తీవ్ర హెచ్చరిక
- Donald Trump: "ఇకపై ఇరాన్ అనే దేశమే ఉండదు".. ట్రంప్ బిగ్ వార్నింగ్.. ఆందోళనలో ప్రపంచ దేశాలు!
Read Also: Liam Livingstone: RCB ‘హీరో’నే తీసుకుంది… 15 బంతుల్లోనే ఫిఫ్టీ కొట్టిన ఇంగ్లాండ్ ఆల్ రౌండర్
గత ఏడాది భారత్ ఆసియా కప్ మ్యాచ్లను శ్రీలంకలో ఆడింది. అయితే.. ఆసియా కప్ కోసం పాకిస్తాన్ కరాచీ, రావల్పిండి, లాహోర్లోని స్టేడియాలను పునరుద్ధరించింది. దీనికి పీసీబీ మిలియన్ల డాలర్లు ఖర్చు చేసింది. 1996లో పాకిస్థాన్ సహ-ఆతిథ్యమిచ్చిన ప్రపంచ కప్ తర్వాత అక్కడ జరుగుతున్న తొలి ఐసీసీ టోర్నమెంట్ ఛాంపియన్స్ ట్రోఫీ. 2009లో శ్రీలంక జట్టు బస్సుపై జరిగిన దాడి కారణంగా కొన్నాళ్ల పాటు అంతర్జాతీయ మ్యాచ్లకు ఆతిథ్యం ఇవ్వకుండా కోల్పోయిన పాకిస్థాన్.. తాజాగా ఇంగ్లండ్, ఆస్ట్రేలియా సహా పెద్ద జట్లకు తమ దేశంలో ఆతిథ్యం ఇచ్చింది.
ఐసీసీ 2021లో ఛాంపియన్స్ ట్రోఫీ ఆతిథ్య హక్కులను పాకిస్తాన్కు ఇచ్చింది. అందువల్ల పాకిస్తాన్లోనే అన్ని మ్యాచ్లను నిర్వహించడానికి అక్కడి క్రికెట్ ఫ్యాన్స్ నుంచి పీసీబీకి ఒత్తిడి కలిగిస్తున్నారు. ఈ క్రమంలో.. ఛాంపియన్స్ ట్రోఫీ కోసం భారత్ పాకిస్తాన్కు రాకపోతే.. భవిష్యత్తులో జరిగే ఐసీసీ పోటీలకు తమ జట్టును అక్కడికి పంపబోమని పీసీబీ తేల్చి చెప్పింది. మరోవైపు.. పాకిస్తాన్ గత సంవత్సరం వన్డే ప్రపంచ కప్ కోసం భారతదేశంలో పర్యటించింది. ఏడేళ్ల తర్వాత పాకిస్తాన్ జట్టు భారత్లో పర్యటించింది.
తాజావార్తలు
-
Aman Sanger: నాలుగేళ్లలో ఐదున్నర లక్షల కోట్ల సంపాదన.. 25 ఏళ్ల భారతీయ కుర్రాడి సక్సెస్ స్టోరీ..
-
Anant Ambani: టీటీడీకి రూ.27.5 కోట్ల భారీ విరాళం.. 50 మంది డ్రైవర్లు, ఛార్జింగ్ స్టేషన్ కూడా!
-
Kangana Ranaut: ఆ నటుడి పెదవిని కంగనా కొరికిందా?.. ‘రివాల్వర్ రాణి’ కిస్ సీన్ మళ్లీ వైరల్
-
Vaibhav Sooryavanshi Debut: వైభవ్ సూర్యవంశీ టీమిండియా అరంగేట్రం కష్టమే!
-
Iran: “నరకం చూపిస్తాం”.. అమెరికా, గల్ఫ్ దేశాలకు ఇరాన్ తీవ్ర హెచ్చరిక
ట్రెండింగ్
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్తో మరింత సౌలభ్యం.!