Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Story Icc To Take Final Decision On Champions Trophy 2025 Venue After Meeting On November 29

ICC: 29న ‘ఛాంపియన్స్ ట్రోఫీ 2025’పై ఐసీసీ నిర్ణయాత్మక సమావేశం..

Published Date :November 26, 2024 , 8:52 pm
By Rajesh Veeramalla
  • ఈనెల 29న ఐసీసీ కీలక సమావేశం
  • ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్‌ ఖరారు చేసే అవకాశం
  • వర్చువల్‌గా సమావేశాన్ని నిర్వహించనున్న ఐసీసీ.
ICC: 29న ‘ఛాంపియన్స్ ట్రోఫీ 2025’పై ఐసీసీ నిర్ణయాత్మక సమావేశం..
  • Follow Us :
  • google news
  • dailyhunt

అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ఈనెల 29న కీలక సమావేశం ఏర్పాటు చేయనుంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి-మార్చిలో పాకిస్థాన్‌లో జరగనున్న ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్‌ను ఖరారు చేసేందుకు వర్చువల్ (ఆన్‌లైన్) సమావేశాన్ని నిర్వహించనుంది. కాగా.. టోర్నీ షెడ్యూల్‌ను ప్రకటించడంలో జాప్యం జరుగుతుండటంతో.. ఈ మీటింగ్ నిర్వహిస్తున్నారు. అయితే.. ఇరుదేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్న నేపథ్యంలో పాకిస్థాన్‌లో ఆడేందుకు భారత్ నిరాకరించడమే ఆలస్యానికి కారణం. 2008 ముంబైలో ఉగ్రదాడుల తర్వాత భారత్ పాకిస్థాన్‌లో పర్యటించలేదు.

బీసీసీఐ ఈ టోర్నమెంట్‌లో హైబ్రిడ్ మోడల్‌లో ఆడాలని నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో టీమిండియా మ్యాచ్‌లు మరో దేశంలో నిర్వహించుతారు. ఇండియా UAEలో నిర్వహించాలని కోరుతుంది. మరోవైపు.. ఈ నిర్ణయంపై పీసీబీ ఇంకా అంగీకరించలేదు. ఇదిలా ఉంటే.. ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ గురించి చర్చించడానికి ఐసీసీ బోర్డు నవంబర్ 29న సమావేశమవుతుందని ఐసీసీ ప్రతినిధి మంగళవారం పీటీఐకి చెప్పారు. డిసెంబర్ 1న జై షా ఐసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించడానికి ముందు ఈ సమావేశం జరుగుతుండటంతో.. ఈ సమస్యను పరిష్కరించేందుకు ఆసక్తి చూపనున్నారు.

Also Read

  • Petrol, Diesel Price: భారీగా పెరిగిన ఎల్‌పీజీ సిలిండర్ ధరలు.. పెట్రోల్, డీజిల్ పెరుగుదలపై కేంద్రం క్లారిటీ!
  • Bitter Gourd Chips Recipe: కారం కారంగా కరకరలాడే కాకరకాయ చిప్స్.. చేదు లేకుండా ఇంట్లోనే సులభంగా తయారు చేసే ప్రత్యేక రెసిపీ..
  • AP Student Suicide in US: అమెరికాలో కర్నూలు యువకుడు ఆత్మహత్య.. పిస్టల్‌తో కాల్చుకుని..
  • Veggie Frittata Recipe: హెల్తీ అండ్ టేస్టీ.. లంచ్ బాక్స్‌లోకి కమ్మని 'వెజ్జీ ఫ్రిటాటా'.. తింటే పిల్లలు అస్సలు వదలరు!

Read Also: Liam Livingstone: RCB ‘హీరో’నే తీసుకుంది… 15 బంతుల్లోనే ఫిఫ్టీ కొట్టిన ఇంగ్లాండ్ ఆల్ రౌండర్

గత ఏడాది భారత్ ఆసియా కప్ మ్యాచ్‌లను శ్రీలంకలో ఆడింది. అయితే.. ఆసియా కప్ కోసం పాకిస్తాన్ కరాచీ, రావల్పిండి, లాహోర్‌లోని స్టేడియాలను పునరుద్ధరించింది. దీనికి పీసీబీ మిలియన్ల డాలర్లు ఖర్చు చేసింది. 1996లో పాకిస్థాన్ సహ-ఆతిథ్యమిచ్చిన ప్రపంచ కప్ తర్వాత అక్కడ జరుగుతున్న తొలి ఐసీసీ టోర్నమెంట్ ఛాంపియన్స్ ట్రోఫీ. 2009లో శ్రీలంక జట్టు బస్సుపై జరిగిన దాడి కారణంగా కొన్నాళ్ల పాటు అంతర్జాతీయ మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇవ్వకుండా కోల్పోయిన పాకిస్థాన్.. తాజాగా ఇంగ్లండ్, ఆస్ట్రేలియా సహా పెద్ద జట్లకు తమ దేశంలో ఆతిథ్యం ఇచ్చింది.

ఐసీసీ 2021లో ఛాంపియన్స్ ట్రోఫీ ఆతిథ్య హక్కులను పాకిస్తాన్‌కు ఇచ్చింది. అందువల్ల పాకిస్తాన్‌లోనే అన్ని మ్యాచ్‌లను నిర్వహించడానికి అక్కడి క్రికెట్ ఫ్యాన్స్ నుంచి పీసీబీకి ఒత్తిడి కలిగిస్తున్నారు. ఈ క్రమంలో.. ఛాంపియన్స్ ట్రోఫీ కోసం భారత్ పాకిస్తాన్‌కు రాకపోతే.. భవిష్యత్తులో జరిగే ఐసీసీ పోటీలకు తమ జట్టును అక్కడికి పంపబోమని పీసీబీ తేల్చి చెప్పింది. మరోవైపు.. పాకిస్తాన్ గత సంవత్సరం వన్డే ప్రపంచ కప్ కోసం భారతదేశంలో పర్యటించింది. ఏడేళ్ల తర్వాత పాకిస్తాన్ జట్టు భారత్‌లో పర్యటించింది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Champions Trophy 2025
  • Final decision
  • icc
  • Meeting
  • november 29

తాజావార్తలు

  • Petrol, Diesel Price: భారీగా పెరిగిన ఎల్‌పీజీ సిలిండర్ ధరలు.. పెట్రోల్, డీజిల్ పెరుగుదలపై కేంద్రం క్లారిటీ!

  • Bitter Gourd Chips Recipe: కారం కారంగా కరకరలాడే కాకరకాయ చిప్స్.. చేదు లేకుండా ఇంట్లోనే సులభంగా తయారు చేసే ప్రత్యేక రెసిపీ..

  • Shruti Haasan : హీరోయిన్‌గా కంటే ఐటంగర్ల్‌గా ఎక్కువ సంపాదిస్తున్న శృతి

  • AP Student Suicide in US: అమెరికాలో కర్నూలు యువకుడు ఆత్మహత్య.. పిస్టల్‌తో కాల్చుకుని..

  • Jason Holder: కేజీ నా దగ్గరే ఉన్నాడు.. రజత్ పాటీదార్ వివాదాస్పద క్యాచ్‌పై స్పందించిన హోల్డర్!

ట్రెండింగ్‌

  • 3.4K డిస్‌ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!

  • స్టైలిష్ కలర్స్‌తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?

  • స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!

  • Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!

  • Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్‌ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions