ICC: 29న ‘ఛాంపియన్స్ ట్రోఫీ 2025’పై ఐసీసీ నిర్ణయాత్మక సమావేశం..
- ఈనెల 29న ఐసీసీ కీలక సమావేశం
- ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ ఖరారు చేసే అవకాశం
- వర్చువల్గా సమావేశాన్ని నిర్వహించనున్న ఐసీసీ.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ఈనెల 29న కీలక సమావేశం ఏర్పాటు చేయనుంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి-మార్చిలో పాకిస్థాన్లో జరగనున్న ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ను ఖరారు చేసేందుకు వర్చువల్ (ఆన్లైన్) సమావేశాన్ని నిర్వహించనుంది. కాగా.. టోర్నీ షెడ్యూల్ను ప్రకటించడంలో జాప్యం జరుగుతుండటంతో.. ఈ మీటింగ్ నిర్వహిస్తున్నారు. అయితే.. ఇరుదేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్న నేపథ్యంలో పాకిస్థాన్లో ఆడేందుకు భారత్ నిరాకరించడమే ఆలస్యానికి కారణం. 2008 ముంబైలో ఉగ్రదాడుల తర్వాత భారత్ పాకిస్థాన్లో పర్యటించలేదు.
బీసీసీఐ ఈ టోర్నమెంట్లో హైబ్రిడ్ మోడల్లో ఆడాలని నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో టీమిండియా మ్యాచ్లు మరో దేశంలో నిర్వహించుతారు. ఇండియా UAEలో నిర్వహించాలని కోరుతుంది. మరోవైపు.. ఈ నిర్ణయంపై పీసీబీ ఇంకా అంగీకరించలేదు. ఇదిలా ఉంటే.. ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ గురించి చర్చించడానికి ఐసీసీ బోర్డు నవంబర్ 29న సమావేశమవుతుందని ఐసీసీ ప్రతినిధి మంగళవారం పీటీఐకి చెప్పారు. డిసెంబర్ 1న జై షా ఐసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించడానికి ముందు ఈ సమావేశం జరుగుతుండటంతో.. ఈ సమస్యను పరిష్కరించేందుకు ఆసక్తి చూపనున్నారు.
Also Read
- Thummidihatti Barrage: తెలంగాణ, మహారాష్ట్ర మధ్య తుమ్మిడిహట్టి పంచాయితీ.. నేడు కేంద్రం సమక్షంలో చర్చలు..!
- YS Jagan: పులివెందులలో వైఎస్ జగన్ రెండు రోజుల పర్యటన!
- Kranti Goud: నెం.11 స్థానంలో బ్యాటింగ్కు వచ్చి చరిత్ర సృష్టించిన క్రాంతి గౌడ్..!
- Remove Oil Stains: బట్టలపై నూనె మరకలు పొవట్లేదా.? ఇలా చేయండి.. రిజల్ట్ చూసి షాక్ అవుతారంతే.!
Read Also: Liam Livingstone: RCB ‘హీరో’నే తీసుకుంది… 15 బంతుల్లోనే ఫిఫ్టీ కొట్టిన ఇంగ్లాండ్ ఆల్ రౌండర్
గత ఏడాది భారత్ ఆసియా కప్ మ్యాచ్లను శ్రీలంకలో ఆడింది. అయితే.. ఆసియా కప్ కోసం పాకిస్తాన్ కరాచీ, రావల్పిండి, లాహోర్లోని స్టేడియాలను పునరుద్ధరించింది. దీనికి పీసీబీ మిలియన్ల డాలర్లు ఖర్చు చేసింది. 1996లో పాకిస్థాన్ సహ-ఆతిథ్యమిచ్చిన ప్రపంచ కప్ తర్వాత అక్కడ జరుగుతున్న తొలి ఐసీసీ టోర్నమెంట్ ఛాంపియన్స్ ట్రోఫీ. 2009లో శ్రీలంక జట్టు బస్సుపై జరిగిన దాడి కారణంగా కొన్నాళ్ల పాటు అంతర్జాతీయ మ్యాచ్లకు ఆతిథ్యం ఇవ్వకుండా కోల్పోయిన పాకిస్థాన్.. తాజాగా ఇంగ్లండ్, ఆస్ట్రేలియా సహా పెద్ద జట్లకు తమ దేశంలో ఆతిథ్యం ఇచ్చింది.
ఐసీసీ 2021లో ఛాంపియన్స్ ట్రోఫీ ఆతిథ్య హక్కులను పాకిస్తాన్కు ఇచ్చింది. అందువల్ల పాకిస్తాన్లోనే అన్ని మ్యాచ్లను నిర్వహించడానికి అక్కడి క్రికెట్ ఫ్యాన్స్ నుంచి పీసీబీకి ఒత్తిడి కలిగిస్తున్నారు. ఈ క్రమంలో.. ఛాంపియన్స్ ట్రోఫీ కోసం భారత్ పాకిస్తాన్కు రాకపోతే.. భవిష్యత్తులో జరిగే ఐసీసీ పోటీలకు తమ జట్టును అక్కడికి పంపబోమని పీసీబీ తేల్చి చెప్పింది. మరోవైపు.. పాకిస్తాన్ గత సంవత్సరం వన్డే ప్రపంచ కప్ కోసం భారతదేశంలో పర్యటించింది. ఏడేళ్ల తర్వాత పాకిస్తాన్ జట్టు భారత్లో పర్యటించింది.
తాజావార్తలు
-
Thummidihatti Barrage: తెలంగాణ, మహారాష్ట్ర మధ్య తుమ్మిడిహట్టి పంచాయితీ.. నేడు కేంద్రం సమక్షంలో చర్చలు..!
-
NTV Exclusive: ‘మండాడి’ కోసం 45 రోజులు సముద్రంలోనే.. నాలుగైదుసార్లు చావు అంచుల వరకు వెళ్లాం: సుహాస్
-
Bethlehem Family Unit: రూ. 250 కోట్ల దిశగా మలయాళ మూవీ.. తెలుగులోనూ రిలీజ్కు రెడీ!
-
YS Jagan: పులివెందులలో వైఎస్ జగన్ రెండు రోజుల పర్యటన!
-
Toxic : వంద కోట్ల గ్రాస్ కూడా రాబట్టలేక షాకిచ్చిన ‘యశ్ టాక్సిక్’
ట్రెండింగ్
-
Remove Oil Stains: బట్టలపై నూనె మరకలు పొవట్లేదా.? ఇలా చేయండి.. రిజల్ట్ చూసి షాక్ అవుతారంతే.!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!