Damodara Raja Narasimha: కోవిడ్ నియంత్రణపై సమీక్ష సమావేశం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాష్ట్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి సి దామోదర రాజనర్సింహ హైదరాబాదులోని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలోనీ తన కార్యాలయంలో కోవిడ్ నియంత్రణపై సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సమీక్ష సమావేశం ముఖ్య అంశాలు:
Also Read
- Online Shopping: ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నారా..? కొత్త రూల్స్ వచ్చేస్తున్నాయ్.. కేంద్రం కీలక నిర్ణయం..
- Saudi-Europe: యూరప్కు సౌదీ బిగ్ షాక్.. చమురు నిలిపిపోయే అవకాశం
- Macron: యూరప్లో ఇంధన ధరలు మంటలు.. త్వరలో G7 దేశాల సమావేశం
- Air India: ఖర్చులు తగ్గించేందుకు కీలక నిర్ణయం.. ఎయిరిండియా కొత్త సీఈవో సూపర్ ప్లాన్!
COVID-19 కొత్త వేరియంట్ JN 1 అంత ప్రమాదకరం కాదు. గతంలో వచ్చిన కోవిడ్ లో ఇది ఒక భాగం. కోవిడ్ లక్షణాలైనా సాధారణ జ్వరం , ముక్కు కారడం, గొంతు నొప్పి ఆయాసంతో పాటు శ్వాస తీసుకోవడంలో తీవ్ర ఇబ్బందులు ఉంటే ఆసుపత్రికి వెళ్లి టెస్టులు చేసుకోవాలి. చిన్నపిల్లలకు పెద్ద వయసు ఉన్న ఇతర దీర్ఘకాలిక రోగాలు, వ్యాధి నిరోధక శక్తి ఉన్న వ్యక్తులకు కోవిడ్ సోకే అవకాశం ఉంది. కోవిడ్ నియంత్రణపై ప్రభుత్వం అప్రమత్తంగా ఉంది. కోవిడ్ రాకుండా ఉండేందుకు జనసందోహంలో ఉన్నప్పుడు తప్పనిసరిగా మాస్కులు ధరించాలి. ప్రజలందరూ సోషల్ డిస్టెన్స్ ను పాటించాలి.
*కోవిడ్ సంబంధ లక్షణాలు ఉంటే ఆస్పత్రులకు వెళ్లి డాక్టర్ ల సలహాలు తీసుకోవాలి.
*అనుమానం ఉంటే కోవిడ్ టెస్టులు RAT (rapid antigen test) , or RT – PCR ( Real-time reverse transcriptase-polymerase chain reaction ) టెస్టులు తప్పనిసరిగా చేసుకోవాలి.
*కొత్త వేరియంట్ కోవిడ్ వల్ల మరణాల శాతం తక్కువగా ఉంది.
* జీనోమ్ టెస్ట్ ల కోసం ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రత్యేక వార్డులను ఏర్పాటు చేయడం జరిగింది.
*వారిలో ఇతరత్రా దీర్ఘకాలిక రోగాలు ఉన్న వారికి మాత్రమే జబ్బు తీవ్రత అధికంగా ఉంది.
*ప్రజలు భయాందోళనలకు గురి కావాల్సిన అవసరం లేదు.
*కరోనా పై వస్తున్న వదంతులను నమ్మవద్దు. వదంతులను ప్రచారం చేయవద్దు.
*ప్రభుత్వం కరోనా కట్టడికి చిత్తశుద్ధితో కృషి చేస్తుంది.
*కోవిడ్ పరీక్షలకు అవసరమైన కిట్లు అందుబాటులో ఉన్నాయి.
*ఆక్సిజన్ ప్లాంట్లు పూర్తిస్థాయిలో పనిచేస్తున్నాయి.
*బెడ్ల కొరత లేకుండా చర్యలు చేపట్టడం జరిగింది.
*ఇప్పటివరకు ఎలాంటి మరణం నమోదు కాలేదు.
*నిన్న ఉస్మానియా ఆస్పత్రిలో జరిగిన రెండు మరణాలలో కూడా దీర్ఘకాలిక రోగాలైన గుండె, ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతుండడం వల్ల మరణాలు సంభవించాయి.
*పాజిటివ్ వచ్చిన ఇద్దరు చిన్న పిల్లల్లో ఒకరు జన్యుపరమైన గుండెజబ్బుతో బాధపడుతున్న వ్యక్తి చనిపోవడం జరిగింది.
*మిగతా వారందరూ త్వరగా కోలుకుంటున్నారు. త్వరలో వారిని డిశ్చార్జ్ చేయడం జరుగుతుంది.
ఈ సమీక్ష లో DME డాక్టర్ త్రివేణి, TSMSIDC ఎండి చంద్రశేఖర్ రెడ్డి, NIMS డైరెక్టర్ బీరప్ప, వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
తాజావార్తలు
-
OTR: దానం నాగేందర్ పై వేటు..మిగతా 9 మంది ఎమ్మెల్యేల సంగతేంటి ..?
-
Botsa Anusha: భీమిలి YSRCP నియోజకవర్గ సమన్వయకర్తగా బొత్స అనూష
-
Old Currency: కాజీపేటలో పాత నోట్ల కలకలం.. రూ.1.38 కోట్ల కరెన్సీతో 8 మంది అరెస్ట్!
-
Bhatti Vikramarka : ఎల్నినో ఎఫెక్ట్.. తెలంగాణలో ముందస్తు ప్లాన్
-
Online Shopping: ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నారా..? కొత్త రూల్స్ వచ్చేస్తున్నాయ్.. కేంద్రం కీలక నిర్ణయం..
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్పై భారత్ ఘన విజయం.. సెమీస్కు దూసుకెళ్లిన హర్మన్సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..