Dalit Man Thrashed: దళితుడిపై దారుణం.. స్తంభానికి కట్టి హింసించి.. గుండు కొట్టించి, ముఖాన్ని నల్లగా చేసి..
Dalit Man Thrashed: దళితులపై అరాచకాలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా ఉత్తరప్రదేశ్ బహ్రైచ్ జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఓ దళిత యువకుడికి తీవ్రంగా కొట్టి, గుండు కొట్టించి.. ముఖాన్ని నల్లగా మార్చారు. దళితుడు అయినందువల్లే ఇలా చేశారని కుటుంబసభ్యులు వాపోతున్నారు. ఉత్తరప్రదేశ్లోని బహ్రైచ్లో దొంగతనానికి పాల్పడ్డాడనే ఆరోపణలతో దళితుడిని కొట్టి, గుండు కొట్టించి, ముఖం నల్లగా చేశారు. బహ్రైచ్ జిల్లాలోని హార్దియా ప్రాంతంలోని ఓ ఇంట్లో టాయిలెట్ సీటును దొంగిలించాడనే ఆరోపణతో ముగ్గురు వ్యక్తులు యువకుడిని స్తంభానికి కట్టివేశారు. దినసరి కూలీ రాజేష్ కుమార్పై గుంపు దాడి చేసిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.
Professor Collapses On Stage : మాట్లాడుతూనే వేదికపై కుప్పకూలిన ప్రొఫెసర్.. అక్కడికక్కడే మృతి
Also Read
- Minister Nara Lokesh: ఒకే రాష్ట్రం, ఒకే రాజధాని మా విధానం.. అభివృద్ధి వికేంద్రీకరణ మా నినాదం..
- Bengal Elections: రేపు తృణమూల్ కంచుకోటలో పోలింగ్.. ఈసారి ఎవరిది పైచేయి!
- Fuel Shortage: తెలుగు రాష్ట్రాల్లో మూడోరోజుకు చేరిన ఇంధన కష్టాలు.. అధికారులు ఏం చెబుతున్నారంటే..?
- Akhil : అఖిల్ ‘లెనిన్’ మళ్లీ వాయిదా.. జూన్ బరిలోకి అక్కినేని వారసుడు దిగడం డౌటే
దొంగతనం ఆరోపణలు ఎదుర్కొంటున్న రాజేష్ కుమార్ను పోలీసులకు అప్పగించడానికి బదులు అతడిని కట్టేసి తీవ్రంగా దాడి చేశారు. యువకుడి కనుబొమ్మలు బ్లేడ్తో గీకేశారు. సగం మీసాన్ని తీసేయడంతో పాటు గుండు కొట్టించారు. కోటియా గ్రామానికి చెందిన ముగ్గురిపై దాడి, నేరపూరిత బెదిరింపుల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. అట్రాసిటీ చట్టం నిబంధనల ప్రకారం వారిపై కేసు నమోదైంది. స్థానిక బీజేపీ నేత రాధేశ్యామ్ మిశ్రా, అతని సహాయకులు రేణు వాజ్పేయ్, రాకేష్ తివారీలను ఈ దాడికి పాల్పడిన నిందితులుగా గుర్తించారు. పోలీసులు ఇద్దరు సహాయకులను అదుపులోకి తీసుకున్నారు. మిశ్రా పరారీలో ఉన్నాడు. ముగ్గురు వ్యక్తులపై కేసు నమోదు చేశామని, ఇప్పటికే ఇద్దరిని అరెస్టు చేశామని అదనపు పోలీసు సూపరింటెండెంట్ అశోక్ కుమార్ తెలిపారు. రాజేష్ దొంగతనానికి వచ్చానని నిందితులు పోలీసులకు తెలిపారు. తదుపరి విచారణ జరుగుతోంది.
Dalit man thrashed, head shaved, face blackened on allegations of theft in UP's Bahraichhttps://t.co/rBb5WltJe3
October 23, 2022 at 02:34PM pic.twitter.com/AYRFUB7bBM— GAGAN PREET (@gppreet) October 23, 2022
తాజావార్తలు
-
Minister Nara Lokesh: ఒకే రాష్ట్రం, ఒకే రాజధాని మా విధానం.. అభివృద్ధి వికేంద్రీకరణ మా నినాదం..
-
Bengal Elections: రేపు తృణమూల్ కంచుకోటలో పోలింగ్.. ఈసారి ఎవరిది పైచేయి!
-
Fuel Shortage: తెలుగు రాష్ట్రాల్లో మూడోరోజుకు చేరిన ఇంధన కష్టాలు.. అధికారులు ఏం చెబుతున్నారంటే..?
-
Akhil : అఖిల్ ‘లెనిన్’ మళ్లీ వాయిదా.. జూన్ బరిలోకి అక్కినేని వారసుడు దిగడం డౌటే
-
Petrol and Diesel Shortage in AP: పెట్రోల్, డీజిల్ కొరతపై సీఎం ఆరా
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!