Dalapathi Vijay: ‘ఐ యామ్ కమింగ్’ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన దళపతి విజయ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Dalapathi Vijay: తమిళనాడులో 2026లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల సమరానికి శనివారం సినీ నటుడు, టీవీకే పార్టీ అధినేత దళపతి విజయ్ శంఖం పూరించారు. ఈ ఎన్నికల్లో ఆయన పార్టీ పోటీ చేస్తుండటంతో రాజకీయ వర్గాల్లో ఎన్నికల ఫలితాలపై జోరుగా చర్చజరుగుతుంది. శనివారం విజయ్ తిరుచ్చిలో ‘ఐ యామ్ కమింగ్’ పేరుతో భారీ ఎలక్షన్ ప్రచారానికి శ్రీకారం చుట్టారు. విజయ్ ఇప్పటికే ‘మీట్ ది పీపుల్స్’ పేరుతో రాష్ట్రవ్యాప్తంగా డిసెంబర్ వరకు ప్రతి శని, ఆదివారాల్లో జనంలోకి రానున్నట్లు ప్రకటించారు.
READ ALSO: Ramakrishna: చంద్రబాబు హయాంలో అన్నీ ప్రైవేట్పరం.. !
Also Read
- Hyderabad Cyber Crime: దేశవ్యాప్తంగా సైబర్ క్రైమ్ పోలీసుల ఆపరేషన్.. సిమ్లు సరఫరా చేస్తున్న ముఠాల గుట్టురట్టు
- Story Board: మహా సంక్షోభం ఎవరి చేతుల్లో లేదా? ప్రజలు జాగ్రత్తలు పాటించాల్సిందేనా?
- Tawa Paneer Tikka Recipe: ఇంట్లోనే ఈజీగా రెస్టారెంట్ స్టైల్ 'తవా పనీర్ టిక్కా'.. సీక్రెట్ రెసిపీ మీకోసం!
- CM Revanth Reddy: పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై రేవంత్ ఫైర్.. కేంద్రంపై తీవ్ర విమర్శలు
ఆయన దూకుడు చూస్తుంటే.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గుర్తుకు వస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన నిర్వహించిన వారాహి యాత్రను గుర్తు తెచ్చేలా దళపతి ‘మీట్ ది పీపుల్స్’ కార్యక్రమం ఉండనున్నట్లు సమాచారం. ఇప్పటికే విజయ్ ప్రచారం కోసం ప్రత్యేకంగా హైటెక్ బస్సును సిద్ధం చేశారు. బస్సుపైకి ఎవరూ ఎక్కకుండా ఉండేందుకు పైభాగంలో ఇనుప కంచెలు ఏర్పాటు చేశారు. ఇక్కడ విశేషం ఏమిటంటే ఇది పూర్తిగా వారాహి వాహనం స్టైల్లోనే కనిపిస్తోంది. తమిళ అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ సింగిల్గా పోటీ చేస్తాను అని ఇప్పటికే క్లారిటీ ఇచ్చేశారు. దళపతి రాజకీయాల్లో తనదైన వ్యూహాన్ని అమలు చేస్తూ ముందుకు కదులుతున్నారు. ఇప్పటికే ఆయన తన పార్టీ సభ్యత్వం కోసం ‘మై టీవీకే’ అనే యాప్ను ప్రారంభించారు. రెండు కోట్ల మంది సభ్యులను చేర్చుకోవాలనే టార్గెట్తో ముందుకు సాగుతున్నట్లు ఇప్పటికే పార్టీ ప్రకటించింది.
విజయ్ జోరు చూస్తుంటే తమిళ రాజకీయాల్లో పెను సంచలనాలు సృష్టించేలా ఉన్నారని పలువురు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ద్రావిడ రాజకీయాల్లో ఇప్పటి వరకు అన్నాడీఎంకే, డీఎంకేల మధ్య ఉన్న నెక్ వైట్ ఇప్పుడు విజయ్ రాకతో కాక రేపుతుంది. ఈ త్రిముఖ పోరులో నాయకత్వ లేమితో ఇబ్బందులు ఎదుర్కొంటున్న అన్నాడీఎంకే భవితవ్యాన్ని ప్రశ్నార్థకం చేస్తుందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి.
READ ALSO: PM Modi Manipur Visit: ప్రధాని సమక్షంలో కంటతడి పెట్టిన బాధితులు..
తాజావార్తలు
-
India Unemployment: ఆరు నెలల గరిష్ఠానికి చేరిన భారత నిరుద్యోగ రేటు.. ఏప్రిల్లో 5.2% శాతానికి
-
Medical Shops: మే 20న రాష్ట్రవ్యాప్తంగా మెడికల్ షాప్స్ బంద్.. కారణం ఏంటంటే?
-
Hyderabad Cyber Crime: దేశవ్యాప్తంగా సైబర్ క్రైమ్ పోలీసుల ఆపరేషన్.. సిమ్లు సరఫరా చేస్తున్న ముఠాల గుట్టురట్టు
-
Story Board: మహా సంక్షోభం ఎవరి చేతుల్లో లేదా? ప్రజలు జాగ్రత్తలు పాటించాల్సిందేనా?
-
Tollywood: పర్సంటేజ్ సిస్టమ్ నుండి మినహాయింపు కోరిన 17 సినిమాల జాబితా..
ట్రెండింగ్
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..