Ramakrishna: చంద్రబాబు హయాంలో అన్నీ ప్రైవేట్పరం.. !
- ప్రభుత్వరంగ సంస్థలన్నింటినీ ప్రైవేటుపరం చేసేందుకే..
- చంద్రబాబు అధికారంలోకి వచ్చినట్లున్నారు..
- సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ ఫైర్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ramakrishna: ప్రభుత్వరంగ సంస్థలన్నింటినీ ప్రైవేటుపరం చేసేందుకే చంద్రబాబు అధికారంలోకి వచ్చినట్లున్నారని మండిపడ్డారు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ.. గుంటూరు ఏసీ కాలేజీలో ఏఐఎస్ఎఫ్ నిర్వహించి సమావేశంలో పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటినుంచి అన్ని రంగాలు ప్రైవేటీకరణ అవుతున్నాయన్నారు. గత ప్రభుత్వం తీసుకొచ్చిన మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చెయ్యడం సిగ్గుచేటని మండిపడ్డారు. మెడికల్ కాలేజీలు ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి వెళ్తే పేదలకు న్యాయం జరుగుతుందన్న గ్యారెంటీ లేదన్నారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఎంపీలు మాట్లాడడకపోవడం దారుణమన్నారు. డబుల్ ఇంజిన్ సర్కారు డబుల్ స్పీడుతో ప్రభుత్వ రంగంసంస్థలను ప్రైవేటీకరణ చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు..
Also Read
- SRM University Harassment Case: ఎస్ఆర్ఎం వర్సిటీలో లైంగిక వేధింపుల కలకలం.. మహిళా అసిస్టెంట్ ప్రొఫెసర్ ఫిర్యాదుతో..
- Ambati Rambabu Hunger Strike: నిరాహార దీక్ష చేపట్టిన అంబటి.. ప్రాణాలకు తెగించైనా మీ సంగతి తేలుస్తా..!
- Ambati Rambabu: పోలీసులకు ఫిర్యాదు చేసిన అంబటి రాంబాబు.. న్యాయం జరగకపోతే సుప్రీంకోర్టుకు వెళ్తా..
- Divyang Shakti Scheme: దివ్యాంగుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం.. వారికోసం మరింత ఆలోచన చేస్తాం..
గుంటూరు ఏసీ కాలేజీలో ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సదస్సులో పాల్గొన్న సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సీఎం చంద్రబాబు ప్రభుత్వ రంగ సంస్థలన్నిటిని ప్రైవేటీకరణ చేసేందుకు అధికారంలోకి వచ్చినట్లు ఉన్నారు.. దేశంలో ఏ రాష్ట్రంలోనూ ఏపీలో ఉన్న దౌర్భాగ్య పాలన లేదన్నారు.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం రాష్ట్ర ప్రజలు, విద్యార్థులు చేసుకున్న పాపమని మండిపడ్డారు.. కూటమి పాలనలో అన్ని రంగాలు వ్యవస్థలు ప్రైవేటీకరణ అవుతున్నాయి. గత ప్రభుత్వం తీసుకువచ్చిన మెడికల్ కళాశాలలను కూటమి ప్రభుత్వం ప్రైవేటీకరణ చేయటం సిగ్గుచేటు అన్నారు.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మాకు మెడికల్ కళాశాలలో అవసరం లేదంటూ కేంద్రానికి లేఖ రాసిందని విమర్శించారు.. మెడికల్ కళాశాలలు ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి వెళ్తే పేద విద్యార్థులకు న్యాయం జరుగుతుందని గ్యారెంటీ ఏంటి.? అని ప్రశ్నించారు.. అనేకమంది ప్రాణ త్యాగం చేసి సాధించుకున్న విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరణ చేస్తుంటే కేంద్ర ప్రభుత్వానికి టీడీపీ, జనసేన ప్రత్యక్షంగా.. పరోక్షంగా వత్తాసు పలుకుతున్నాయని మండిపడ్డారు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ..
తాజావార్తలు
-
Priyanka Chopra: విజయ్ క్రేజ్ చూసి షాక్ అయిన ప్రియాంక చోప్రా..
-
Ginger Candy: తాటి బెల్లం + అల్లం: గొంతు నొప్పి నుండి జీర్ణ సమస్యలకు.. చెక్ పెట్టే అద్భుత ఔషధం ‘అల్లం మురబ్బా’ ఇంట్లోనే చేసుకోండి ఇలా..
-
Rajinikanth-Kamal Haasan: రజనీ-కమల్ మెగా మల్టీస్టారర్లో త్రిష..
-
8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, యాక్టివ్ కూలింగ్తో గేమింగ్ మాన్స్టర్.. REDMAGIC 11S Pro రాక!
-
Drishyam3 : దృశ్యం -3 తెలుగు రీమేక్ నుండి తప్పుకున్న వెంకీ.. డబ్బింగ్ వర్షన్ రిలీజ్ కు రెడీ
ట్రెండింగ్
-
PM Modi: ఆడంబరాలు వద్దు.. పొదుపు ముద్దు.! దేశాభివృద్ధి కోసం ప్రధాని 10 కీలక సూచనలు..
-
Kathmandu: రన్వేపై మంటల్లో చిక్కుకున్న విమానం.. 278 మంది ప్రయాణికులు.?
-
Viral Road Accident: అరె బాబు.. బైకును అక్కడ ఎలా పార్క్ చేశావయ్యా.!
-
Forbes Survey: ఆఫీస్ ‘ప్రేమాయణం’.. 40 శాతం మంది తమ భాగస్వామిని మోసం చేస్తున్నారట! షాకింగ్ గణాంకాలు
-
Range Rover SV : భారత్లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత