Ramakrishna: చంద్రబాబు హయాంలో అన్నీ ప్రైవేట్పరం.. !
- ప్రభుత్వరంగ సంస్థలన్నింటినీ ప్రైవేటుపరం చేసేందుకే..
- చంద్రబాబు అధికారంలోకి వచ్చినట్లున్నారు..
- సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ ఫైర్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ramakrishna: ప్రభుత్వరంగ సంస్థలన్నింటినీ ప్రైవేటుపరం చేసేందుకే చంద్రబాబు అధికారంలోకి వచ్చినట్లున్నారని మండిపడ్డారు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ.. గుంటూరు ఏసీ కాలేజీలో ఏఐఎస్ఎఫ్ నిర్వహించి సమావేశంలో పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటినుంచి అన్ని రంగాలు ప్రైవేటీకరణ అవుతున్నాయన్నారు. గత ప్రభుత్వం తీసుకొచ్చిన మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చెయ్యడం సిగ్గుచేటని మండిపడ్డారు. మెడికల్ కాలేజీలు ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి వెళ్తే పేదలకు న్యాయం జరుగుతుందన్న గ్యారెంటీ లేదన్నారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఎంపీలు మాట్లాడడకపోవడం దారుణమన్నారు. డబుల్ ఇంజిన్ సర్కారు డబుల్ స్పీడుతో ప్రభుత్వ రంగంసంస్థలను ప్రైవేటీకరణ చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు..
Also Read
- Ambati Rambabu: పోలీసులను రాజకీయ కక్షకు వాడుతున్నారు.. అంబటి రాంబాబు సంచలన ఆరోపణలు
- Vinukonda: అత్యాచారం చేశాడంటూ ఫిర్యాదు.. పోలీస్ స్టేషన్ లో లొంగిపోయిన మాజీ సీఐ చినమల్లయ్య.!
- Tenali: మహిళ సెల్ఫీ సూసైడ్ కలకలం.. పోలీసుల వేధింపులే కారణమంటూ ఆవేదన.!
- Ambati Rambabu: పెట్రో ధరలపై రిక్షా తొక్కి అంబటి నిరసన.. రెడ్ బుక్ నా మీదే కాదు.. జనసేన వాళ్లపై కూడా అమలు..!
గుంటూరు ఏసీ కాలేజీలో ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సదస్సులో పాల్గొన్న సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సీఎం చంద్రబాబు ప్రభుత్వ రంగ సంస్థలన్నిటిని ప్రైవేటీకరణ చేసేందుకు అధికారంలోకి వచ్చినట్లు ఉన్నారు.. దేశంలో ఏ రాష్ట్రంలోనూ ఏపీలో ఉన్న దౌర్భాగ్య పాలన లేదన్నారు.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం రాష్ట్ర ప్రజలు, విద్యార్థులు చేసుకున్న పాపమని మండిపడ్డారు.. కూటమి పాలనలో అన్ని రంగాలు వ్యవస్థలు ప్రైవేటీకరణ అవుతున్నాయి. గత ప్రభుత్వం తీసుకువచ్చిన మెడికల్ కళాశాలలను కూటమి ప్రభుత్వం ప్రైవేటీకరణ చేయటం సిగ్గుచేటు అన్నారు.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మాకు మెడికల్ కళాశాలలో అవసరం లేదంటూ కేంద్రానికి లేఖ రాసిందని విమర్శించారు.. మెడికల్ కళాశాలలు ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి వెళ్తే పేద విద్యార్థులకు న్యాయం జరుగుతుందని గ్యారెంటీ ఏంటి.? అని ప్రశ్నించారు.. అనేకమంది ప్రాణ త్యాగం చేసి సాధించుకున్న విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరణ చేస్తుంటే కేంద్ర ప్రభుత్వానికి టీడీపీ, జనసేన ప్రత్యక్షంగా.. పరోక్షంగా వత్తాసు పలుకుతున్నాయని మండిపడ్డారు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ..
తాజావార్తలు
-
OTR: ఆరు నియోజకవర్గాల్లో కొత్త ఇన్ఛార్జ్లు.. తూర్పుగోదావరిపై చంద్రబాబు ప్రత్యేక ఫోకస్..
-
OTR: మాజీ ఎమ్మెల్యే, మంత్రి మధ్య సమాధి రాజకీయం
-
New Country: ఐసీసీ సభ్యత్వం పొందిన మరో దేశం.. మొత్తం 111కు చేరిన సంఖ్య..
-
India-UK: అమల్లోకి భారత్-యూకే ఒప్పందం.. ఏవేవి ధరలు తగ్గాయంటే..!
-
Lenin Success Meet: ‘లెనిన్’ సక్సెస్ మీట్లో భావోద్వేగానికి గురైన భాగ్యశ్రీ.. ‘వాళ్ల ప్రేమే నా అతిపెద్ద అవార్డు’!
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!