Ramakrishna: చంద్రబాబు హయాంలో అన్నీ ప్రైవేట్పరం.. !
- ప్రభుత్వరంగ సంస్థలన్నింటినీ ప్రైవేటుపరం చేసేందుకే..
- చంద్రబాబు అధికారంలోకి వచ్చినట్లున్నారు..
- సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ ఫైర్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ramakrishna: ప్రభుత్వరంగ సంస్థలన్నింటినీ ప్రైవేటుపరం చేసేందుకే చంద్రబాబు అధికారంలోకి వచ్చినట్లున్నారని మండిపడ్డారు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ.. గుంటూరు ఏసీ కాలేజీలో ఏఐఎస్ఎఫ్ నిర్వహించి సమావేశంలో పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటినుంచి అన్ని రంగాలు ప్రైవేటీకరణ అవుతున్నాయన్నారు. గత ప్రభుత్వం తీసుకొచ్చిన మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చెయ్యడం సిగ్గుచేటని మండిపడ్డారు. మెడికల్ కాలేజీలు ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి వెళ్తే పేదలకు న్యాయం జరుగుతుందన్న గ్యారెంటీ లేదన్నారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఎంపీలు మాట్లాడడకపోవడం దారుణమన్నారు. డబుల్ ఇంజిన్ సర్కారు డబుల్ స్పీడుతో ప్రభుత్వ రంగంసంస్థలను ప్రైవేటీకరణ చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు..
Also Read
- Venkaiah Naidu: ‘ఇష్టపడి పని చేయండి.. నష్టపోవడం ఉండదు’.. పట్టభద్రులకు వెంకయ్య సందేశం
- Ambati Rambabu: ఏఐ వీడియో వివాదంలో అంబటి రాంబాబు.. కేసు నమోదు..
- Mudragada Padmanabham సంతాప సభలో ఆసక్తికర దృశ్యం.. ఆలింగనం చేసుకున్న బోండా ఉమ, అంబటి రాంబాబు.!
- Nadendla Manohar: స్థానిక ఎన్నికల్లో కొత్త వ్యూహం.. మంత్రి నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు..
గుంటూరు ఏసీ కాలేజీలో ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సదస్సులో పాల్గొన్న సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సీఎం చంద్రబాబు ప్రభుత్వ రంగ సంస్థలన్నిటిని ప్రైవేటీకరణ చేసేందుకు అధికారంలోకి వచ్చినట్లు ఉన్నారు.. దేశంలో ఏ రాష్ట్రంలోనూ ఏపీలో ఉన్న దౌర్భాగ్య పాలన లేదన్నారు.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం రాష్ట్ర ప్రజలు, విద్యార్థులు చేసుకున్న పాపమని మండిపడ్డారు.. కూటమి పాలనలో అన్ని రంగాలు వ్యవస్థలు ప్రైవేటీకరణ అవుతున్నాయి. గత ప్రభుత్వం తీసుకువచ్చిన మెడికల్ కళాశాలలను కూటమి ప్రభుత్వం ప్రైవేటీకరణ చేయటం సిగ్గుచేటు అన్నారు.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మాకు మెడికల్ కళాశాలలో అవసరం లేదంటూ కేంద్రానికి లేఖ రాసిందని విమర్శించారు.. మెడికల్ కళాశాలలు ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి వెళ్తే పేద విద్యార్థులకు న్యాయం జరుగుతుందని గ్యారెంటీ ఏంటి.? అని ప్రశ్నించారు.. అనేకమంది ప్రాణ త్యాగం చేసి సాధించుకున్న విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరణ చేస్తుంటే కేంద్ర ప్రభుత్వానికి టీడీపీ, జనసేన ప్రత్యక్షంగా.. పరోక్షంగా వత్తాసు పలుకుతున్నాయని మండిపడ్డారు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ..
తాజావార్తలు
-
Amravati: వెంటిలేటర్లో పేలుడు.. NICUలో మంటలు.. ముగ్గురు నవజాత శిశువులు మృతి.!
-
Modi-Trump: మోడీ–ట్రంప్ భేటీలో ట్విస్ట్.. ‘ప్రశ్నలు వద్దు’ అన్న భారత్, ట్రంప్ మాత్రం అడిగేశారు!
-
Hollywood: హాలీవుడ్ దెబ్బకు బాలీవుడ్ బెంబేలు .. ‘స్పైడర్ మ్యాన్’ దూకుడుతో మారుతున్న బాక్సాఫీస్ లెక్కలు
-
Yashasvi Jaiswal: ‘అలా ప్రవర్తించకూడదు’.. జైస్వాల్పై ఐసీసీ చర్యలు తప్పవు?
-
Karn Sharma Retirement: నాలుగు ఐపీఎల్ టైటిళ్ల హీరో రిటైర్మెంట్.. భారత్, ఐపీఎల్, దేశవాళీ క్రికెట్కు గుడ్బై!
ట్రెండింగ్
-
IP Ratings: IP67, IP68, IP69 అంటే ఏమిటి? స్మార్ట్ఫోన్ కొనేముందు ఈ వాటర్ప్రూఫ్ రేటింగ్స్ గురించి తప్పక తెలుసుకోండి.!
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!
-
Home Remedies: వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు, దోమలు, చీమలు, నల్లులకు చెక్ పెట్టే చిట్కాలు ఇవే!
-
Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క