Daggubati Purandeswari: ఏపీ అభివృద్ధిలో సింహ భాగం బీజేపీదే.. ఈసారి ఎంపీల సంఖ్య 350 దాటుతుంది..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Daggubati Purandeswari: ఏపీ అభివృద్ధిలో సింహ భాగం కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానిదే అన్నారు బీజేపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి.. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ప్రజాపోరు రాష్ట్ర స్ధాయి సమావేశం నిర్వహించారు.. ఈ సందర్బంగా పారిశామికవేత్త ఏలూరి రామచంద్రారెడ్డి, తిరుపతి పార్లమెంట్ పరిధిలోని వైసీపీ నేత కేతా అమర్నాథ్ రెడ్డితో పాటు పలువరు తిరుపతి, ఒంగోలు, గిద్దలూరుకు చెందిన వివిధ పార్టీల నేతలో బీజేపీలో చేరారు.. ఈ సందర్భంగా పురంధేశ్వరి మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లో బీజేపీ పార్లమెంట్ సభ్యుల సంఖ్య 350 దాటుతుందనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు.
Read Also: Pushpa 2: ఫ్యాన్స్ కు ప్రామిస్… పుష్ప 2 అంతకు మించి ఉంటుంది
Also Read
- AP Liquor Scam: ఏపీ లిక్కర్ స్కాంలో ఈడీ దూకుడు.. అదుపులోకి ఏ1 నిందితుడు రాజ్ కేశిరెడ్డి.!
- Kalyan Banerjee: "నీ అల్లుడు కావాలా? మాలాంటి నమ్మకస్తులు కావాలా?" మమతకు కల్యాణ్ బెనర్జీ అల్టిమేటం!
- 8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లే, 50MP కెమెరాతో Tecno Pova 8 లాంచ్.. ధర ఎంతంటే.?
- YS Jagan-DSC: 270 మందికి అనుమానాస్పదంగా ఉద్యోగాలు.. సీబీఐ విచారణతోనే నిజాలు బయటకు!
ఇక, దొంగ ఓట్లపై సెంట్రల్ ఎలక్షన్ కమీషన్ (సీఈసీ)కి ఫిర్యాదులపై చర్యలు తీసుకుంటున్నారు.. తిరుపతి ఉప ఎన్నికల్లో 35 వేల దొంగ ఓట్లు గుర్తించి కంప్లైంట్ చేశామని తెలిపారు పురంధేశ్వరి.. ఐపీఎస్ ల మీద కూడా దొంగ ఓట్ల అంశంలో చర్యలు తీసుకుంటున్నారు.. అభ్యర్ధిని మార్చడంతో పాటు, ఓటర్లను లోపాయకారిగా నియోజకవర్గం మారుస్తున్నారని ఆరోపించారు. మంత్రి విడుదల రజని చిలకలూరిపేట నుంచి గుంటూరు మారగానే ఆమె అనుయాయిల ఓట్లు లోపాయకారిగా మారుతున్నాయి అని విమర్శించారు. మరోవైపు.. ఏపీ అభివృద్ధిలో సింహ భాగం బీజేపీ చేసిందే అన్నారు.. పార్లమెంటు అభ్యర్ధుల సంఖ్య ఈ సారి 350 దాటుతుందన్న ఆమె.. పార్టీలతో పొత్తుపై కేంద్ర నాయకత్వం నిర్ణయం తీసుకుంటుందన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి అసలు కనిపించడం లేదన్నారు. రాష్ట్ర పథకాలు అన్నీ కేంద్ర పథకాలు అని మేం చెప్పినా.. మాకు సహకారం ఇవాళ్టి వరకూ లేదన్నారు. ఈ నెల 29 వరకు ప్రజాపోరు కార్యక్రమం ఉంటుందని తెలిపారు ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి.
తాజావార్తలు
-
AP Liquor Scam: ఏపీ లిక్కర్ స్కాంలో ఈడీ దూకుడు.. అదుపులోకి ఏ1 నిందితుడు రాజ్ కేశిరెడ్డి.!
-
6G Technology In India: 5Gకి మించి.. 6G కోసం సిద్ధమవుతున్న భారత్.. కేంద్రం మాస్టర్ ప్లాన్
-
Kalyan Banerjee: “నీ అల్లుడు కావాలా? మాలాంటి నమ్మకస్తులు కావాలా?” మమతకు కల్యాణ్ బెనర్జీ అల్టిమేటం!
-
Harmanpreet Kaur: ఫియర్లెస్ క్రికెట్ ఆడుతాం.. పాకిస్థాన్ను చిత్తు చిత్తుగా ఓడిస్తాం!
-
Varalaxmi Sarathkumar Controversy : నేను అరవను కరుస్తా… “పోలీస్ కంప్లైంట్” డైరెక్టర్ కు హీరోయిన్ వరలక్ష్మీ స్ట్రాంగ్ కౌంటర్
ట్రెండింగ్
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లే, 50MP కెమెరాతో Tecno Pova 8 లాంచ్.. ధర ఎంతంటే.?
-
Mohammed Siraj Wedding: హీరోయిన్తో మహ్మద్ సిరాజ్ పెళ్లి.. జూన్లోనే ముహూర్తం!
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్లైన్ మ్యాప్స్తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?