Sitrang Cyclone: బంగ్లాదేశ్లో సిత్రాంగ్ తుఫాన్ బీభత్సం.. 35 మంది మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sitrang Cyclone: బంగ్లాదేశ్లో సిత్రాంగ్ తుఫాన్ విళయతాండవం చేస్తోంది. సోమవారం రాత్రి బంగ్లాదేశ్లోని బరిసాల్ సమీపంలోని టింకోనా ద్వీపం, శాండ్విప్ మధ్య సిత్రాంగ్ తీరాన్ని దాటిన తర్వాత పశ్చిమ బెంగాల్ తీరాన్ని దాటుకుని బంగ్లాదేశ్ తీరాన్ని దాటింది. సిత్రాంగ్ తుఫాన్ కారణంగా దాదాపు 35 మంది చనిపోయారు. 15 తీరప్రాంత జిల్లాల్లో సుమారు 8 మిలియన్ల మంది ప్రజలు విద్యుత్తు లేకుండా చీకట్లోనే మగ్గుతున్నారు. దాదాపు 10,000 ఇళ్లు దెబ్బతిన్నాయని, 6,000 హెక్టార్ల (15,000 ఎకరాలు) పంటలు నాశనమయ్యాయని బంగ్లాదేశ్ ప్రభుత్వం తెలిపింది. వేల సంఖ్యలో మత్స్యకార ప్రాజెక్టులు కూడా కొట్టుకుపోయాయి. బంగ్లాదేశ్ తుఫాన్ వల్ల విద్యాసంస్థలను మూసివేశారు. రవాణా వ్యవస్థ కూడా స్తంభించింది.
దక్షిణ ద్వీపమైన మహేశ్ఖాలీలో తుఫాను ప్రభావం వల్ల అనేక చెట్లు నేలకూలాయి. దీంతో విద్యుత్, టెలికాం సేవలు నిలిచిపోయాయి. కరెంటు లేకపోవడంతో ఒక్క సారిగా ఆ ప్రాంతంలో చీకట్లు అలుముకున్నాయి. ఈ సమయంలో చాలా ఇళ్లలోకి వరద నీరు ప్రవేశించింది. పలువురు ఇళ్లలోకి పాములు కూడా వచ్చాయని బాధితులు తెలిపారు. అత్యధికంగా ప్రభావితమైన బారిసల్ ప్రాంతంలో కూరగాయల పొలాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఇదిలా ఉండగా బంగ్లాదేశ్ కు సమీపంలో ఉన్న భారత రాష్ట్రం అయిన పశ్చిమ బెంగాల్లో కూడా ఈ తుఫాన్ ప్రభావం కనిపిస్తోంది. సోమవారం వేలాది మంది ప్రజలను 100 కంటే ఎక్కువ సహాయ కేంద్రాలకు తరలించారు. ఇప్పటి వరకు ఎలాంటి నష్టమూ నమోదు కాలేదని అధికారులు తెలిపారు. సహాయ శిబిరాలకు వెళ్లిన పలువురు మంగళవారం తమ ఇళ్లకు తిరిగివచ్చారు.
Also Read
- Rajamahendravaram: గోదావరిలో హౌస్బోట్.. రాజమహేంద్రవరంలో పర్యాటకానికి ఫుల్ జోష్!
- Smartphone Tips: పాత ఫోన్లను మూలన పడేస్తున్నారా?.. వైర్లెస్ మౌస్గా మార్చేసే సింపుల్ ట్రిక్
- High Court Slams FDA: ‘మీరేమైన దేవుడు అనుకుంటున్నారా..?’ ఎఫ్డీఏకు హైకోర్టు షాక్..!
- Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
Basavalinga Swamy: కర్ణాటకలో మరో మఠాధిపతి సూసైడ్.. ఆ బెదిరింపులే కారణం
ఉష్ణమండల తుఫాను ఉత్తర బంగాళాఖాతం నుండి గంటకు 56 కి.మీ వేగంతో బంగ్లాదేశ్ వైపు కదిలింది. పశ్చిమ బెంగాల్లోని తీరప్రాంత జిల్లాలలో మోస్తరు నుంచి భారీ వర్షాలు, తుఫాను కారణంగా దీపావళి పండుగ ఉత్సాహం తగ్గింది. పశ్చిమ బెంగాల్లోని దక్షిణ జిల్లాల్లో వాతావరణం మెరుగుపడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తెలిపింది. ఇది మంగళవారం సాయంత్రానికి అల్పపీడనంగా బలహీనపడి అల్పపీడనంగా మారే అవకాశం ఉందని ప్రకటించింది. మంగళవారం ఉదయం పశ్చిమ బెంగాల్ తీరం వెంబడి గంటకు 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని, క్రమక్రమంగా 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గంటకు 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వాతావరణ కార్యాలయం హెచ్చరించింది. వాతావరణ సూచనల దృష్ట్యా అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ప్రజలకు సూచించింది. నబన్నలో జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి హరికృష్ణ ద్వివేది జిల్లా మేజిస్ట్రేట్లకు అవసరమైన సహాయాన్ని అందించాలని ఆదేశించారు. తీర ప్రాంతాల నుండి ప్రజలను తరలించాలని ఆదేశించారు. మత్స్యకారులకు రెడ్ అలర్ట్ ప్రకటించారు.
తాజావార్తలు
-
Suryakumar Yadav: తప్పంతా నాదే.. వన్డే కెరీర్పై సూర్యకుమార్ సంచలన వ్యాఖ్యలు!
-
IIT Deaths: ఐఐటీల్లో ఈ చావులు వెనుక ఉన్న కారణాలేంటి? విద్యార్థులను బలి తీసుకుంటుంది ఎవరు?
-
NEET Counselling 2026: NEET కౌన్సెలింగ్ తొలి విడతలో సీటు రాకపోవడంతో.. 21 ఏళ్ల విద్యార్థిని ఆత్మహత్య
-
Laikey Laikaa: రాషా థడానీ ఇంటెన్స్ రొమాంటిక్ యాక్షన్ ఆగిపోలేదు.. వాలెంటైన్స్ డేకు వస్తోంది..
-
China: వేలాది కుటుంబాల కన్నీటి వేదన..నిజాలను సమాధి చేసే పాలన.. చైనా నిజస్వరూపం ఇదే!
ట్రెండింగ్
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!
-
Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!