Cyclone Montha Effect: విద్యుత్ సరఫరాపై మొంథా బీభత్సం.. కృష్ణా జిల్లాలో 4 కోట్ల నష్టం!
- ఏపీలోని అన్ని చోట్ల భారీ వర్షాలు
- విద్యుత్ సరఫరాపై మొంథా బీభత్సం
- కృష్ణా జిల్లాలో 4 కోట్ల నష్టం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
‘మొంథా’ తుఫాన్ ప్రభావంతో ఏపీలోని అన్ని చోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. కృష్ణా జిల్లాలో తుఫాన్ బీభత్సం సృష్టించింది. తుఫాన్ బీభత్సంతో కృష్ణా జిల్లాలో నిలిచిన విద్యుత్ సరఫరాను పునరుద్ధరించడానికి విద్యుత్ శాఖ అధికారులు వర్షంలో కూడా మరమ్మతులు చేపట్టారు. మచిలీపట్నం, పెడన, అవనిగడ్డ, గుడివాడ ప్రాంతాల్లో భారీగా మరమ్మత్తు పనులు చేపట్టారు. జిల్లాలో సుమారు 4 కోట్ల వరకు నష్టం వచ్చినట్టు అధికారులు అంచనా వేస్తున్నారు. వీలైనంత త్వరగా విద్యుత్ సరఫరా పునరుద్ధరణ చేస్తామని అధికారులు చెప్పారు.
మొంథా తుఫాన్ ప్రభావంతో పల్నాడు, గుంటూరు జిల్లాలను భారీ వర్షాలు ముంచెత్తాయి. వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తుండడంతో ఎక్కడికక్కడ రాకపోకలు నిలిచిపోయాయి. మాచర్ల, గురజాల, వినుకొండ, పెదకూరపాడు నియోజకవర్గాలలో వాగులు, చెరువులు పొంగి ప్రకారం వహిస్తున్నాయి. దీంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గంలో నల్లమడ డ్రైన్, నక్కవాగు పొంగి ప్రవహించడంతో గుంటూరు-పర్చూరు మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వాహనాలు ఎక్కడికక్కడ నిలిపోయాయి.
Also Read
- Wife Murder: బీమా డబ్బుల కోసం.. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను కొట్టి చంపేసిన కీచక భర్త..!
- Nellore: వివాహేతర సంబంధం.. నిండు ప్రాణం బలి.!
- Kolkata Airport Mosque: ముగ్గురు సీఎంలు టచ్ చేయలేకపోయారు.. సువేందు రాకతో ఎయిర్పోర్టు మసీదు తరలింపు.!
- Israel-France: ఇజ్రాయెల్ మంత్రి బెన్-గ్విర్కు ఫ్రాన్స్ షాక్.. దేశంలోకి రాకుండా నిషేధం
విజయవాడ బస్టాండులో బస్సుల కోసం పడిగాపులు పడుతున్నారు ప్రయాణికులు. గమ్యస్ధానం నుంచీ బస్సు వస్తే తప్ప బస్సు ఉండదు అని అధికారులు చెపుతున్నారని ప్రయాణికులు అంటున్నారు. మరోవైపు ఇవాళ ఉదయం 11 గంటల నుంచీ అన్ని బస్ సర్వీసులు పునరుద్ధరించామని, బస్టాండులలో ఉండిపోయిన ప్రయాణికులకు సదుపాయాలు అందిస్తున్నామని చెపుతున్నారు అధికారులు.
Also Read: Montha Cyclone Live Updates: ‘మొంథా’ తుఫాన్ బీభత్సం.. లైవ్ అప్డేట్స్!
తుఫాను ప్రభావంతో పశ్చిమగోదావరి జిల్లాలోని మొగల్తూరు మండల ఆక్వా రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. భారీ వర్షాలకు తోడు సముద్ర పోటు ఎక్కువ కావడంతో రొయ్యల చెరువులు ముంపు బారిన పడుతున్నాయి. దీంతో రైతులకు తీవ్ర నష్టాలు ఏర్పడుతున్నాయి. చేసేదిలేక ముందుగానే పట్టుబడులు సాగించి వచ్చిన కాడికి అమ్ముకునే ప్రయత్నాల్లో రైతులు నిమగ్నమయ్యారు.
మోంథా తుఫాన్ ప్రభావానికి విఎమ్ఆర్టిఏ (VMRDA)బిల్డింగ్ వెనక అభివృద్ధి కోసం వేసిన ఐరన్ పరంజి కుప్పకూలింది…మొంథా తుఫాన్ తీరం దాటిన దగ్గర నుండి ఈదురుగాలులు ప్రభావం ఎక్కువుగా ఉండటంతో ఇలాంటి సంఘటనలు నగర వ్యాప్తంగా చోటు చేసుకుంటాన్నాయి. ఈ ప్రమాద ఘటనలో ఎటువంటి ప్రాణ నష్టం లేకపోయిన పాక్షికంగా పలు వాహనాలు దెబ్బతిన్నాయి.
తాజావార్తలు
-
Rahman : ‘పెద్ది’ ఆ కోరిక తీర్చింది!
-
Ram Charan: నా కెరీర్లోనే ‘పెద్ది’ నంబర్ వన్ చిత్రం
-
AP Film Corporation: ఏపీ ఫిల్మ్ కార్పొరేషన్ నూతన బోర్డు ఏర్పాటు
-
OTR : పాలమూరు కాంగ్రెస్లో రచ్చ రచ్చ.. సిటీ ప్రెసిడెంట్ పదవి కోసం కుమ్ములాట!
-
Wife Murder: బీమా డబ్బుల కోసం.. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను కొట్టి చంపేసిన కీచక భర్త..!
ట్రెండింగ్
-
iPhone Users Alert: వెలుగులోకి కొత్త ఫిషింగ్ మోసం.. అలర్ట్ జారీ చేసిన కేంద్రం.!
-
Early Age S*ex Results: చిన్న వయసులోనే శృంగారం.. ఈ సమస్యలు తప్పవా.?
-
Natural Home Remedy: తెల్ల జుట్టుకు సింపుల్ “హోమ్ రెమిడీ”.. ఆ మూడు పదార్థాలతో ఉంటే చాలు.. నేచురల్గా హెయిర్ కలర్ రెడీ.!
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?