Cyclone Montha Effect: విద్యుత్ సరఫరాపై మొంథా బీభత్సం.. కృష్ణా జిల్లాలో 4 కోట్ల నష్టం!
- ఏపీలోని అన్ని చోట్ల భారీ వర్షాలు
- విద్యుత్ సరఫరాపై మొంథా బీభత్సం
- కృష్ణా జిల్లాలో 4 కోట్ల నష్టం
‘మొంథా’ తుఫాన్ ప్రభావంతో ఏపీలోని అన్ని చోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. కృష్ణా జిల్లాలో తుఫాన్ బీభత్సం సృష్టించింది. తుఫాన్ బీభత్సంతో కృష్ణా జిల్లాలో నిలిచిన విద్యుత్ సరఫరాను పునరుద్ధరించడానికి విద్యుత్ శాఖ అధికారులు వర్షంలో కూడా మరమ్మతులు చేపట్టారు. మచిలీపట్నం, పెడన, అవనిగడ్డ, గుడివాడ ప్రాంతాల్లో భారీగా మరమ్మత్తు పనులు చేపట్టారు. జిల్లాలో సుమారు 4 కోట్ల వరకు నష్టం వచ్చినట్టు అధికారులు అంచనా వేస్తున్నారు. వీలైనంత త్వరగా విద్యుత్ సరఫరా పునరుద్ధరణ చేస్తామని అధికారులు చెప్పారు.
మొంథా తుఫాన్ ప్రభావంతో పల్నాడు, గుంటూరు జిల్లాలను భారీ వర్షాలు ముంచెత్తాయి. వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తుండడంతో ఎక్కడికక్కడ రాకపోకలు నిలిచిపోయాయి. మాచర్ల, గురజాల, వినుకొండ, పెదకూరపాడు నియోజకవర్గాలలో వాగులు, చెరువులు పొంగి ప్రకారం వహిస్తున్నాయి. దీంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గంలో నల్లమడ డ్రైన్, నక్కవాగు పొంగి ప్రవహించడంతో గుంటూరు-పర్చూరు మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వాహనాలు ఎక్కడికక్కడ నిలిపోయాయి.
Also Read
- Vijay Political Rise: రజనీ, కమల్కు సైతం సాధ్యం కాలేదు.. ప్రజానాయకుడిగా మారిన విజయ్.. తమిళ రాజకీయాల్లో సరికొత్త మార్పు..
- Tamil Nadu Election Results: సనాతన ధర్మాన్ని నిర్మూలిస్తారా..? డీఎంకే చావుదెబ్బ కొట్టిన హిందువులు..
- Mamata Banerjee Biography: అలుపెరుగని పోరాటం.. 34 ఏళ్ల లెఫ్ట్ పాలనను కూల్చిన "దీదీ" ధైర్యం.. ఇదే మమత కథ!
- Vijay TVK Party: తమిళనాడులో హంగ్ దిశగా ఫలితాలు.. ఆ పార్టీతో టీవీకే విజయ్ పొత్తు?
విజయవాడ బస్టాండులో బస్సుల కోసం పడిగాపులు పడుతున్నారు ప్రయాణికులు. గమ్యస్ధానం నుంచీ బస్సు వస్తే తప్ప బస్సు ఉండదు అని అధికారులు చెపుతున్నారని ప్రయాణికులు అంటున్నారు. మరోవైపు ఇవాళ ఉదయం 11 గంటల నుంచీ అన్ని బస్ సర్వీసులు పునరుద్ధరించామని, బస్టాండులలో ఉండిపోయిన ప్రయాణికులకు సదుపాయాలు అందిస్తున్నామని చెపుతున్నారు అధికారులు.
Also Read: Montha Cyclone Live Updates: ‘మొంథా’ తుఫాన్ బీభత్సం.. లైవ్ అప్డేట్స్!
తుఫాను ప్రభావంతో పశ్చిమగోదావరి జిల్లాలోని మొగల్తూరు మండల ఆక్వా రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. భారీ వర్షాలకు తోడు సముద్ర పోటు ఎక్కువ కావడంతో రొయ్యల చెరువులు ముంపు బారిన పడుతున్నాయి. దీంతో రైతులకు తీవ్ర నష్టాలు ఏర్పడుతున్నాయి. చేసేదిలేక ముందుగానే పట్టుబడులు సాగించి వచ్చిన కాడికి అమ్ముకునే ప్రయత్నాల్లో రైతులు నిమగ్నమయ్యారు.
మోంథా తుఫాన్ ప్రభావానికి విఎమ్ఆర్టిఏ (VMRDA)బిల్డింగ్ వెనక అభివృద్ధి కోసం వేసిన ఐరన్ పరంజి కుప్పకూలింది…మొంథా తుఫాన్ తీరం దాటిన దగ్గర నుండి ఈదురుగాలులు ప్రభావం ఎక్కువుగా ఉండటంతో ఇలాంటి సంఘటనలు నగర వ్యాప్తంగా చోటు చేసుకుంటాన్నాయి. ఈ ప్రమాద ఘటనలో ఎటువంటి ప్రాణ నష్టం లేకపోయిన పాక్షికంగా పలు వాహనాలు దెబ్బతిన్నాయి.
తాజావార్తలు
-
Election Results 2026: గెలుపెవరిది?.. 4 రాష్ట్రాలు+UT ఎన్నికల ఫలితాలు.. మినిట్స్ టు మినిట్స్ అప్డేట్స్..
-
Bengal Election Results Live Updates: బెంగాల్ బాద్షా ఎవరు? మమత హ్యాట్రిక్ కొడుతుందా? అప్డేట్స్ మీకోసం..
-
TVK VIJAY : తమిళనాడు సీఎంగా విజయ్?.. జననాయగన్ రిలీజ్ కు లైన్ క్లియర్
-
Actor Vijay TVK: సినీ నుంచి రాజకీయాల వరకు దళపతి విజయ్ ప్రస్థానం.. సవాళ్లను అధిగమించి..
-
Rajasekhar: మొదట శ్రీదేవే పెళ్లి ప్రపోజల్ పెట్టింది.. కానీ
-
Vijay Political Rise: రజనీ, కమల్కు సైతం సాధ్యం కాలేదు.. ప్రజానాయకుడిగా మారిన విజయ్.. తమిళ రాజకీయాల్లో సరికొత్త మార్పు..
-
Tamil Nadu Election Results: సనాతన ధర్మాన్ని నిర్మూలిస్తారా..? డీఎంకే చావుదెబ్బ కొట్టిన హిందువులు..
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!