Cyclone Montha: ‘మొంథా’ తుపాను ఎఫెక్ట్.. విద్యాసంస్థలు, పర్యాటక కేంద్రాలు క్లోజ్!
- మొంథా’ తుపాను ఎఫెక్ట్
- సముద్ర తీరంలో ఎగిసిపడుతున్న అలలు
- విద్యాసంస్థలు, పర్యాటక కేంద్రాలు క్లోజ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
‘మొంథా’ తుపాను ఆంధ్రప్రదేశ్ వైపు దూసుకొస్తోంది. ప్రస్తుతం ఆగ్నేయ బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం.. ఈరోజు నైరుతి, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తుపానుగా బలపడే అవకాశముంది. మంగళవారం రాత్రికి కాకినాడ సమీపంలో తీరం దాటుతుందని ఐఎండీ అంచనా వేసింది. తుపాన్ ప్రభావం ఇప్పటికే కాకినాడలో మొదలైంది. సముద్రం దగ్గర వాతావరణం పూర్తిగా మారింది. భారీ ఈదురు గాలులు వీస్తున్నాయి. ఇక తుఫాను ప్రభావంతో నెల్లూరులోని ఉదయగిరి-కావలి ప్రాంతాలలో తేలికపాటి వర్షం మొదలైంది. తుమ్మలపెంట సముద్ర తీరంలో అలలు ఎగిసిపడుతున్నాయి.
మొంథా తుపాను ప్రభావంతో విశాఖలోని విద్యాసంస్థలు, పర్యాటక కేంద్రాలను అధికారులు క్లోజ్ చేశారు. ఋషికొండ, సాగర్ నగర్ బీచ్లను తాత్కాలికంగా మూసివేశారు. పర్యాటకులు తీరప్రాంతానికి రావొద్దని అధికారుల హెచ్చరికలు జారీ చేశారు. స్థానికులు, సందర్శకులు అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. మూడు రోజుల పాటు కైలాసగిరి సహా బీచ్ రోడ్డులో ఉన్న సందర్శన స్థలాలను VMRDA మూసివేసింది. ఈనెల 29 వరకు కైలాసగిరిపై కేబుల్ కార్, అడ్వంచేర్ స్పోర్ట్స్ నిలిపివేయాలని ఆదేశించారు. ఇతర రాష్ట్రాల నుంచి కైలాసగిరి చూసేందుకు వస్తున్న పర్యాటకులను సెక్యూరిటీ సిబ్బంది వెనక్కి తిప్పి పంపిస్తున్నారు.
Also Read
- Off The Record: తెలంగాణ బీజేపీలో 'నో సింగిల్స్.. ఓన్లీ మింగిల్స్'
- NDA Majority: మెజారిటీకి కేవలం ఆరుగురు ఎంపీల దూరం.. డీలిమిటేషన్ బిల్లుపై ఉత్కంఠ.. ఎన్డీఏ వ్యూహం ఫలిస్తుందా?
- Off The Record: విజయశాంతి తీరుపై తెలంగాణ పీసీసీ సీరియస్ గా ఉందా..?
- Vaibhav Sooryavanshi: ఈసారి కొట్టాల్సిందే..! హనుమంతుడి ఆశీస్సులు తీసుకొని నెట్స్లోకి వైభవ్
Also Read: Cyclone Montha: కాకినాడలో మొదలైన మొంథా తుపాన్ ప్రభావం.. ఒక్కసారిగా మారిన వాతావరణం!
నేటి నుంచి మూడు రోజుల పాటు విశాఖ, ఎన్టీఆర్, కృష్ణా, నెల్లూరు, గుంటూరు, కాకినాడ జిల్లాలో విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారు. తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో విద్యా సంస్థలకు కలెక్టర్లు సెలవు ఇచ్చారు. తుఫాన్ ప్రభావంతో కాకినాడలో రైతు బజార్లు రద్దీగా మారాయి. తుపాన్ సమయంలో కూరగాయలు దొరుకుతాయో లేదో అని జనాలు అప్రమత్తమయ్యారు. వారం రోజులకు సరిపడా కూరగాయలు కొనుగోలు చేస్తున్నారు. గతంలో ఎప్పుడు లేనివిధంగా వ్యాపారాలు బిజీ బిజీగా ఉన్నారు.
తాజావార్తలు
-
Off The Record: తెలంగాణ బీజేపీలో ‘నో సింగిల్స్.. ఓన్లీ మింగిల్స్’
-
NDA Majority: మెజారిటీకి కేవలం ఆరుగురు ఎంపీల దూరం.. డీలిమిటేషన్ బిల్లుపై ఉత్కంఠ.. ఎన్డీఏ వ్యూహం ఫలిస్తుందా?
-
Off The Record: విజయశాంతి తీరుపై తెలంగాణ పీసీసీ సీరియస్ గా ఉందా..?
-
Vaibhav Sooryavanshi: ఈసారి కొట్టాల్సిందే..! హనుమంతుడి ఆశీస్సులు తీసుకొని నెట్స్లోకి వైభవ్
-
OTR: కూటమి సర్కార్కే షాకిచ్చిన జనసేన ఎమ్మెల్యే
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!