Cyclone Montha: కాకినాడలో మొదలైన మొంథా తుపాన్ ప్రభావం.. ఒక్కసారిగా మారిన వాతావరణం!
- బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం
- కాకినాడలో మొదలైన మొంథా తుపాన్ ప్రభావం
- కాకినాడలో ఒక్కసారిగా మారిన వాతావరణం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కోస్తా జిల్లాల వైపు ‘మొంథా’ తుపాను దూసుకొస్తోంది. ప్రస్తుతం ఆగ్నేయ బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం కొనసాగుతోంది. ఈరోజు పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తుపానుగా బలపడే అవకాశముందని ఐఎండీ ఓ ప్రకటలో తెలిపింది. మంగళవారం ఉదయానికి తీవ్ర తుపానుగా మారి.. రాత్రికి కాకినాడ సమీపంలో తీరం దాటుతుందని అంచనా వేసింది. మంగళవారం 12 గంటల పాటు తీవ్ర తుపాను తీవ్రత కొనసాగి.. ఆపై తుపానుగా బలహీనపడొచ్చని చెప్పింది. తుపాను ప్రభావంతో రాబోయే నాలుగు రోజుల్లో ఏపీలోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది.
మొంథా తుపాన్ ప్రభావం కాకినాడలో మొదలైంది. సముద్రం దగ్గర వాతావరణం ఒక్కసారిగా మారింది. ఇపుడు భారీ ఈదురు గాలులు వీస్తున్నాయి. దాంతో తీర ప్రాంత మండలాల్లో అధికారులు హై అలెర్ట్ ప్రకటించారు. కాకినాడ సిటీ, కాకినాడ రూరల్, తాళ్లదేవు, ఉప్పాడ కొత్తపల్లి, తుని, తొండంగి మండలాలపై తుఫాన్ ప్రభావం భారీగా ఉండనుంది. ఇప్పటికే ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు కాకినాడ చేరుకున్నాయి. రేపు సాయంత్రానికి కాకినాడ తుని మధ్య తుపాన్ తీరం దాటనుంది. ఈరోజు, రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా 269 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు.
Also Read
- Crispy Mini Samosa Recipe: ఇంట్లోనే సులభంగా కరకరలాడే మినీ సమోసాల తయారీ
- Virat Smartphone సిరీస్.. లావా, ఫ్లిప్కార్ట్ భాగస్వామ్యం.!
- Shresta Iyer: శ్రేయస్ అయ్యర్ సోదరికి అత్యాచార బెదిరింపులు.. శ్రేష్ఠ అయ్యర్ ఆవేదన
- WhatsApp Username Feature: కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇస్తుందా..? వాట్సాప్ యూజర్నేమ్ ఫీచర్పై ఉత్కంఠ..
తుపాన్ ప్రభావంతో కాకినాడ యాంకరేజ్ పోర్ట్, డీప్ సీ పోర్ట్ ఖాళీ అయ్యాయి. కార్గో ఉన్న 15 షిప్లను సముద్రంలో సురక్షిత ప్రాంతాలకు తరలించారు. బీచ్, పర్యాటక ప్రాంతాలు ఇప్పటికే మూసివేశారు. ఐదు రోజుల పాటు జిల్లాలో విద్యా సంస్థలకు కలెక్టర్ సెలవు ప్రకటించారు. సహాయక చర్యల కోసం వంద మంది గజ ఈత గాళ్ళు, 70 బోట్లు సిద్ధంగా ఉన్నాయి. అందుబాటులో ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్డీ బృందాలు ఉన్నాయి. సముద్రానికి మధ్యలో హాప్ ఐలాండ్ దీవిలో ఉన్న 110 మందిని అధికారులు తీరానికి చేర్చారు.
తాజావార్తలు
-
Crispy Mini Samosa Recipe: ఇంట్లోనే సులభంగా కరకరలాడే మినీ సమోసాల తయారీ
-
PM Modi MCG Visit: యువ క్రికెటర్లతో ప్రధాని మోడీ ముచ్చట్లు.. భారత్-ఆస్ట్రేలియా స్పోర్ట్స్ కొలాబరేషన్ రోడ్మ్యాప్ ప్రారంభం
-
Virat Smartphone సిరీస్.. లావా, ఫ్లిప్కార్ట్ భాగస్వామ్యం.!
-
Prabhas : షూటింగ్కు స్మాల్ బ్రేక్ ఇచ్చి యూరప్ వెళ్తున్న ‘డార్లింగ్’
-
Rose Plant Care: గులాబీ మొక్కకు మొగ్గలు రావట్లేదా? ఈ సులభమైన చిట్కాలు పాటిస్తే పూలతో నిండిపోతది
ట్రెండింగ్
-
8000mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme NARZO 100x 5G జూలై 15న లాంచ్.!
-
Rainy Season Tips : వర్షాకాలంలో బూట్ల దుర్వాసనకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
IP69K రేటింగ్, 9000mAh బ్యాటరీతో లాంచ్ కానున్న REDMI Note 17 Pro..!
-
TGSRTCలో 1,500 కండక్టర్ పోస్టులు.. రాత పరీక్ష లేకుండానే ఉద్యోగం.!
-
Jio నుంచి గేమ్ ఛేంజింగ్ ప్లాన్.. 1,000+ టీవీ ఛానెల్స్, 150 ప్రీమియం ఛానెల్స్ కేవలం రూ.55కే.!