Cyclone Michaung: రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటాం: మంత్రి కారుమూరి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister Karumuri Venkata Nageswara Rao Visits Cyclone affected areas: ‘మిచౌంగ్’ తుపాన్ నేపథ్యంలో సీఎం వైఎస్ జగన్ ఆదేశాలతో రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా.. అన్ని విధాలుగా ఆదుకుంటాం అని మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అన్నారు. సీఎం ప్రతి అంశంపై మానిటరింగ్ చేస్తున్నారని, నష్టపోయిన రైతులు అన్ని విధాల ఆదుకోవాలని అధికారులకు సూచనలు చేశారని తెలిపారు. నేడు విజయవాడ – మచిలీపట్నం హైవే రోడ్డు పరిసర ప్రాంతాలను మంత్రి కారుమూరి నాగేశ్వరరావు పరిలించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ తుపాన్ ప్రభావిత పరిస్థితులపై స్పందించారు.
పమిడిముక్కల మండలం గోపువానిపాలెం అడ్డరోడ్డు వద్ద మంత్రి కారుమూరి నాగేశ్వరరావు ఆగి.. మునిగిన వరి పొలాలను పరిశీలించారు. ‘మిచౌంగ్ తుఫానుతో కృష్ణ, ఎన్టీఆర్ జిల్లాల రైతులకు ఎక్కువ నష్టం జరిగింది. చాలాచోట్ల వరి పంట నీళ్లలో తెలియాడుతుంది. ముఖ్యమంత్రి జగన్ ప్రతి అంశంపై మానిటరింగ్ చేస్తున్నారు. నష్టపోయిన రైతులను అన్ని విధాలా ఆదుకోవాలని అధికారులకు సూచనలు చేశారు. కృష్ణ, ఎన్టీఆర్ జిల్లాలో డ్రయ్యర్ మిల్లులు ఎక్కువగా లేనందున ఇక్కడ ధాన్యాన్ని పల్నాడు, బాపట్ల, ఏలూరు పశ్చిమగోదావరి జిల్లాలకు తరలిస్తున్నాం. ఇన్సూరెన్స్, ఇన్పుట్ సబ్సిడీ అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు. పౌర సరఫరాల శాఖ తరపున రైతులను ఆదుకునేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నాం’ అని కారుమూరి తెలిపారు.
Also Read
- డాల్బీ ఆటమ్స్ సపోర్ట్, AI కెమెరా ఫీచర్లతో గ్రాండ్ ఎంట్రీకి సిద్దమైన TECNO CAMON 50 Ultra 5G..!
- India vs England: చేజారిన టీ20 సిరీస్.. రోహిత్-కోహ్లీ రీఎంట్రీ.. ఇక ఇంగ్లండ్పై ప్రతీకారమే మిగిలింది..!
- FIFA World Cup 2026: మెరినో మ్యాజిక్.. బెల్జియంపై 2-1 థ్రిల్లర్ విజయంతో సెమీస్లోకి స్పెయిన్.!
- Social Media Monitoring: సోషల్ మీడియాకు బ్రేక్లు..! ప్రత్యేక మెకానిజం
Also Read: Cyclone Michaung: 10 వేలు ఎక్కువైనా పర్వాలేదు.. అందరికీ మంచి సహాయం అందాలి: సీఎం జగన్
‘రైతులకు సబ్సిడీ అందించేందుకు వ్యవసాయ శాఖ చర్యలు చేపట్టింది. మిల్లుల వద్ద లారీల్లో ధాన్యాన్ని యుద్ధ ప్రాతిపదికన దిగుమతి చేసుకున్నందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నాం. అకాల వర్షాలకు నష్టపోయిన రైతులను దోచుకునేందుకు ప్రయత్నించే మిలర్స్ పై కఠిన చర్యలు తీసుకుంటాం. ఇప్పటివరకు 6 లక్షల 70 వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని తీసుకున్నాం.1300 కోట్ల రూపాయలకు గాను.. 1070 కోట్ల రూపాయలు చెల్లింపులు చేశాం. ఆఫ్లైన్లో 1,10,000 టన్నులు ధాన్యం తీసుకున్నాం. కార్డు లేని కౌలు రైతుల వద్ద నుంచి ధాన్యాన్ని సొసైటీల ద్వారా కొనుగోలు చేస్తాం.. చెల్లింపులు కూడా సొసైటీల ద్వారా చేస్తాం. ఇతర జిల్లాలకు తరలించే ధాన్యానికి ట్రాన్స్పోర్ట్ చార్జీలు రైతులపై పడకుండా చూస్తాం. రైతులను అన్ని విధాలా ఆదుకుంటాం’ అని మంత్రి కారుమూరి చెప్పారు.
తాజావార్తలు
-
Prabhas : ఫౌజీ బడ్జెట్ రూ. 500 -600 కోట్లు.. బెంచ్మార్క్ సెట్ చేయబోతుందా?
-
Nithiin : నాని బ్యానర్లో నితిన్ హీరోగా సినిమా ఫిక్స్
-
Shabad M*urder Case: రాత్రి 11 నుంచి అర్ధరాత్రి ఒంటిగంట వరకు కొనసాగిన హత్యలు.. ముందుగా మైనర్ బాలికను తీసుకెళ్లి..
-
Rakta Charitra: ‘రక్త చరిత్ర’ రీ రిలీజ్.. పార్ట్ 3పై క్లారిటీ ఇచ్చిన ఆర్జీవీ.. ‘ఇప్పుడున్న వాళ్లకు అంత సీన్ లేదు’
-
డాల్బీ ఆటమ్స్ సపోర్ట్, AI కెమెరా ఫీచర్లతో గ్రాండ్ ఎంట్రీకి సిద్దమైన TECNO CAMON 50 Ultra 5G..!
ట్రెండింగ్
-
IND vs ENG: భారత్తో సిరీస్లో మజా లేదు.. మేమే ప్రపంచ నంబర్-1.. బ్రూక్ సంచలన వ్యాఖ్యలు!
-
Australia-IPL Match: ఆస్ట్రేలియాలో ఐపీఎల్ మ్యాచ్.. బీసీసీఐతో క్రికెట్ ఆస్ట్రేలియా రహస్య చర్చలు!
-
Virat Smartphone సిరీస్.. లావా, ఫ్లిప్కార్ట్ భాగస్వామ్యం.!
-
8000mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme NARZO 100x 5G జూలై 15న లాంచ్.!
-
Rainy Season Tips : వర్షాకాలంలో బూట్ల దుర్వాసనకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!