Hyderabad: రిటైర్డు ఉద్యోగికి మాయమాటలు చెప్పి రూ. 74.36 లక్షలు కాజేసిన సైబర్ నేరగాళ్లు.. కట్చేస్తే..
- వృద్ధుడికి మాయమాటలు చెప్పి డబ్బులు కొట్టేసిన సైబర్ నేరగాళ్లు అరెస్టు
- రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగి దగ్గర నుంచి 75 లక్షలు కాజేసిన సైబర్ నేరగాళ్లు
- నకిలీ ట్రేడింగ్ యాప్లో లింకులు పంపి పెట్టుబడుల పేరుతో మోసాలు
- టోలిచౌకి కి చెందిన 65 ఏళ్ల వృద్ధుడికి టోకరా వేసిన సైబర్ నేరగాళ్ళు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వృద్ధుడికి మాయమాటలు చెప్పి భారీగా డబ్బులు కొట్టేసిన సైబర్ నేరగాళ్లు సైబరాబాద్ పోలీసులకు చిక్కారు. టోలిచౌకి ప్రాంతానికి చెందిన 65 ఏళ్ల వృద్ధుడిని సైబర్ నేరగాళ్లు మోసం చేశారు. వృద్ధుడి నుంచి రూ. 74.36 లక్షలు కాజేశారు. బాధితుడు రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగి కావడంతో అతని నమ్మకాన్ని ఆసరాగా చేసుకున్నారు. నకిలీ ట్రేడింగ్ యాప్ లింకులు పంపి పెట్టుబడి పెట్టమని చెప్పి భారీగా మోసానికి పాల్పడ్డారు.
READ MORE: Reza Shah Pahlavi: ఖమేనీ రాజీనామా చేయాలి.. మళ్ళీ గర్జించిన ఇరాన్ మాజీ యువరాజు
Also Read
- ETPL Dublin Guardians: రాహుల్ ద్రవిడ్ యజమానిగా, రవిచంద్రన్ అశ్విన్ కెప్టెన్గా సరికొత్త టీం బరిలోకి.!
- Kondagattu Anjanna Temple: సంజీవని పర్వతం రాలిన చోటు.. కొండగట్టు అంజన్న ఆలయ విశిష్టత మీకు తెలుసా?
- Samsung: సర్టిఫైడ్ రీ-న్యూడ్ ప్రోగ్రామ్ తో రిఫర్బిష్డ్ గెలాక్సీ S25, గెలాక్సీ A56 మోడళ్లను తీసుకొచ్చిన శాంసంగ్..!
- CM Chandrababu: అసోం సీఎం ప్రమాణస్వీకారానికి సీఎం చంద్రబాబు.. గౌహతిలో బిజీ షెడ్యూల్!
వృద్ధుడి ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. కేసును ఛేదించేందుకు సైబరాబాద్ పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. సాంకేతిక ఆధారాలు సేకరించిన పోలీసులు నిందితులు మహారాష్ట్రలోని పూణేలో ఉన్నట్లు గుర్తించారు. వెంటనే బృందం అక్కడకు వెళ్లి రిషికేష్ జయవంత్ కాంబ్లే, మహమ్మద్ సుల్తాన్ షేక్ అనే ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు. దర్యాప్తులో భాగంగా నిందితులపై దేశవ్యాప్తంగా 38 సైబర్ మోసాలకు సంబంధించి కేసులు నమోదైనట్టు వెల్లడైంది. తెలంగాణలోనూ ఈ ముఠాపై ఇప్పటికే మూడు కేసులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. నిందితులపై మరిన్ని వివరాలు బయటకు రావాల్సి ఉంది.
READ MORE: Kishan Reddy: అప్పట్లో హైదరాబాద్లో బాంబు పేలుళ్లు.. మోడీ వచ్చాక ఉగ్రవాదుల జాడేలేదు..?
తాజావార్తలు
-
Raj Tarun: నిద్రలో నడుస్తూ హత్యలు.. రాజ్ తరుణ్ ‘టార్టాయిస్’ ఫస్ట్ లుక్ రిలీజ్!
-
ETPL Dublin Guardians: రాహుల్ ద్రవిడ్ యజమానిగా, రవిచంద్రన్ అశ్విన్ కెప్టెన్గా సరికొత్త టీం బరిలోకి.!
-
Kondagattu Anjanna Temple: సంజీవని పర్వతం రాలిన చోటు.. కొండగట్టు అంజన్న ఆలయ విశిష్టత మీకు తెలుసా?
-
Back-to-Back Surprises : ఎన్టీఆర్ – చరణ్ సమ్మర్ హీట్ పెంచేశారుగా
-
Shreyas Iyer Captaincy: శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీపై తీవ్ర విమర్శలు.. మ్యాచ్ మొత్తం తప్పిదాలే?
ట్రెండింగ్
-
Samsung: సర్టిఫైడ్ రీ-న్యూడ్ ప్రోగ్రామ్ తో రిఫర్బిష్డ్ గెలాక్సీ S25, గెలాక్సీ A56 మోడళ్లను తీసుకొచ్చిన శాంసంగ్..!
-
204HP పవర్, ADAS ఫీచర్లతో 2026 Skoda Kodiaq భారత్ లో లాంచ్.. ధర, ఫీచర్స్ ఇలా..
-
Ginger Candy: తాటి బెల్లం + అల్లం: గొంతు నొప్పి నుండి జీర్ణ సమస్యలకు.. చెక్ పెట్టే అద్భుత ఔషధం ‘అల్లం మురబ్బా’ ఇంట్లోనే చేసుకోండి ఇలా..
-
8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, యాక్టివ్ కూలింగ్తో గేమింగ్ మాన్స్టర్.. REDMAGIC 11S Pro రాక!
-
PM Modi: ఆడంబరాలు వద్దు.. పొదుపు ముద్దు.! దేశాభివృద్ధి కోసం ప్రధాని 10 కీలక సూచనలు..