Rajya Sabha: రాజ్యసభలో దుమారం.. కాంగ్రెస్ ఎంపీ సీటు వద్ద నోట్ల కట్టలు..
- నేడు రాజ్యసభలో తీవ్ర దుమారం
- సభ వాయిదా పడిన తర్వాత సాధారణ తనిఖీలు
- కాంగ్రెస్ ఎంపీ సీటు వద్ద నోట్ల కట్టలు స్వాధీనం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నేడు రాజ్యసభలో తీవ్ర దుమారం రేగింది. సభ వాయిదా పడిన తర్వాత నిన్న సాధారణ తనిఖీల్లో భద్రతా అధికారులు ప్రస్తుతం అభిషేక్ మను సింఘ్వీకి కేటాయించిన సీటు నంబర్ 222 నుంచి కరెన్సీ నోట్లను స్వాధీనం చేసుకున్నారని రాజ్యసభ ఛైర్మన్ జగ్దీప్ ధన్ఖర్ తెలిపారు. రూ.500 కరెన్సీ నోట్లు ఉన్న కట్టను గుర్తించినట్లు ధన్ఖర్ తెలిపారు. ఆ నోట్ల అసలైనవో.. నకిలీవో స్పష్టత లేదన్నారు. చట్ట ప్రకారం విచారణ జరుగుతుందన్నారు. డబ్బు ఎవరిది అనే కోణంలో విచారణ కొనసాగుతోంది.
READ MORE: Shaktiman : అటు ఇటు తిరిగి ఆఖరికి ‘శక్తిమాన్’ ఎవరు అవుతారో ?
Also Read
- Karnataka Politics: కర్ణాటక రాజకీయంలో హైడ్రామా.. కేబినెట్ కొలువుదీరిన కొద్దిరోజులకే మంత్రి రాజీనామా!
- వరల్డ్ కప్ గెలిచినా అసలు ట్రోఫీ దక్కదట.! 'FIFA World Cup' గురించి తెలియని విషయాలు మీకోసం..
- 2000 vs 2026: పెట్రోల్ రూ. 26, సిలిండర్ రూ.157.. ఈ 26 ఏళ్లలో నిత్యావసరాల ధరలు ఎంత పెరిగాయో తెలుసా?
- Pat Cummins: "ఆ పిల్లాడు గ్రౌండ్లో కాదు.. స్కూల్లో ఉంటే బాగుండేది".. వైభవ్ విధ్వంసంపై SRH కెప్టెన్ కమిన్స్ ఆసక్తికర వ్యాఖ్యలు..
రాజ్యసభ చైర్మన్ జగ్దీప్ ధన్ఖర్ నోట్లను స్వీకరించడంపై మాట్లాడిన వెంటనే, ప్రతిపక్ష ఎంపీలు రచ్చ సృష్టించడం ప్రారంభించారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే మాట్లాడుతూ.. “ఈ వ్యవహారంపై విచారణ కొనసాగి.. అంతా తేలిపోయే వరకు ఛైర్మన్ అభిషేక్ మను సింఘ్వీ పేరు ప్రస్తావించకుండా ఉండాల్సిందని తన అభిప్రాయం వ్యక్తం చేశారు. ఖర్గే ప్రకటనపై అధికార పార్టీ ఎంపీలు రచ్చ సృష్టించారు. ఆదే సీటు వద్ద దొరికాయని మీరు ఎలా చెప్పగలరు? అని ప్రశ్నించారు.
READ MORE:Komatireddy Venkat Reddy: నాకు పేరు వస్తుందనే కేసీఆర్ నిధులు విడుదల చేయలేదు..
తాజాగా ఈ అంశంపై అభిషేక్ సింఘ్వీ స్పందించారు. “ఇలాంటిది ఇప్పటివరకు నేను ఎప్పుడూ చూడలేదు.. నిన్న రాజ్యసభకు వచ్చినప్పుడు నా జేబులో కేవలం ఒక రూ.500 నోటు మాత్రమే ఉంది. నేను రాజ్యసభకు 12.57కు చేరుకున్నాను. మధ్యాహ్నం 1 గంటకి సభ వాయిదా పడింది.. నేను అప్పటి నుంచి 1.30 వరకు ఎంపీ అయోధ్య రామిరెడ్డితో క్యాంటిన్లో కూర్చున్నాను.. ఆ తర్వాత వెళ్లిపోయాను.” అని తెలిపారు.
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi Record: వైభవ్ సూర్యవంశీకి గుడ్న్యూస్.. ఇక క్రికెట్ దిగ్గజం సచిన్ రికార్డు బద్దలే!
-
RBI MPC 2026: ఆర్బీఐ కీలక నిర్ణయం.. రెపో రేటు 5.25% వద్ద యథాతథం.. లక్షలాది మంది రుణగ్రహీతలకు ఊరట
-
Karnataka Politics: కర్ణాటక రాజకీయంలో హైడ్రామా.. కేబినెట్ కొలువుదీరిన కొద్దిరోజులకే మంత్రి రాజీనామా!
-
వరల్డ్ కప్ గెలిచినా అసలు ట్రోఫీ దక్కదట.! ‘FIFA World Cup’ గురించి తెలియని విషయాలు మీకోసం..
-
Ather Rizta Price Hike: పెరిగిన ఏథర్ రిజ్టా ధరలు.. ఏ వేరియంట్పై ఎంత ధర పెరిగిందో తెలుసా?
ట్రెండింగ్
-
HONOR Magic V6 లాంచ్.. కేవలం 8.75mm మందం, 6660mAh భారీ బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్.!
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..