Shivraj Chouhan: విదేశాల్లో చిన్న పిల్లాడిలా ఏడుస్తున్నాడు.. రాహుల్పై శివరాజ్ చౌహాన్ వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Shivraj Chouhan: మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీపై విరుచుకుపడ్డారు. రాహుల్ గాంధీ దేశంలో ఎవరూ వినడం లేదని విదేశాల్లో మాట్లాడుతున్నారని… అక్కడ చిన్నపిల్లాడిలా ఏడుస్తున్నారని శివరాజ్ సింగ్ చౌహాన్ ఎద్దేవా చేశారు. ఇలా ఏడ్వడం వల్ల కాంగ్రెస్ నాయకత్వంపై జాలేస్తోందని ఆయన అన్నారు. గత ఎన్నికల్లో మధ్యప్రదేశ్ పీసీసీ చీఫ్ కమల్నాథ్ అనే అబద్ధాలు ప్రచారం చేశారని, ఆయన తమ వాగ్దానాలను నెరవేర్చలేదని.. వాటిని నెరవేర్చకుండాని మరోసారి కొత్త వాగ్దానాలను ప్రచారం చేస్తున్నారన్నారు. అప్పటి హామీలు ఏమయ్యాయని ఆయన ప్రశ్నించారు.
మధ్యప్రదేశ్ బడ్జెట్లో మహిళల కోసం మొత్తం 40 శాతం బడ్జెట్ను అందిస్తామని కమల్నాథ్ వాగ్దానం చేశారని, చేశారా అంటూ శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రశ్నించారు. వాగ్దానాలు చేశారు తప్ప ప్రజల కోసం ఏం చేశారని ఆయన ప్రశ్నించారు. హోలీ వల్ల తాము అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఎటువంటి కార్యక్రమం చేయలేదు కానీ సోదరీమణుల సంక్షేమం కోసం కొన్ని నిర్ణయాలను తీసుకున్నామని శివరాజ్ సింగ్ అన్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేసే మహిళలు తమ పిల్లలను చూసుకోవాలని కాబట్టి వారికి ఏడు రోజుల సాధారణ సెలవులు అదనంగా ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. మహిళా ఉద్యోగులందరూ వారి అవసరానికి అనుగుణంగా ఉపయోగించవచ్చన్నారు.
Also Read
- India-China Relations: సరిహద్దు విషయంలో చైనా ఒకలా.. భారత్ మరోలా.. మోడీ-జిన్పింగ్ భేటీ తర్వాత ఆసక్తికర పరిణామం!
- AFG vs IND: నేడే భారత్-ఆఫ్ఘాన్ మ్యాచ్.. బుడ్డోడిని ఆడిస్తారా?.. లైవ్ స్ట్రీమింగ్, టైమ్, జట్ల పూర్తి వివరాలు ఇవే..
- OTR: సిక్కోలులో వైసీపీకి గ్రూపుల గోల! స్థానిక ఎన్నికల వేళ అసలు రచ్చ ఇదేనా?
- Bangladesh: బంగ్లాదేశ్కు భారత్ ‘‘కరెంట్ షాక్’’..
Read Also: Covid19 : కరోనా బాధితుల్లో గుండె సంబంధిత మరణాల ప్రమాదం 5 రెట్లు ఎక్కువ
అంతే కాకుండా 10వ తరగతి తరువాత బాలికలకు ఆర్థిక అక్షరాస్యత కోసం పాఠాలు నేర్పుతామని తెలిపారు. ఇది మహిళా ఆధారితమైనది. బాలికలకు నైపుణ్య శిక్షణ కోసం ఏర్పాట్లు చేయబడతాయి, ఇందులో చేనేత, ఎంబ్రాయిడరీ, సాంప్రదాయ జానపద కళలలో శిక్షణ ఉంటుందని ముఖ్యమంత్రి తెలిపారు. రాష్ట్ర మహిళలకు ఎన్ఐడీ, నిఫ్ట్ ఇన్స్టిట్యూట్స్ ద్వారా ఆధునిక నమూనాలు, ఆధునిక పద్ధతుల్లో శిక్షణ ఇవ్వబడుతుందన్నారు. ఐటీఐలో చదువుతున్న అమ్మాయిలకు డిజిటల్, ఆర్థిక అక్షరాస్యత, ఇంగ్లీష్, కమ్యూనికేషన్, పర్సనాలిటీ డెవలప్మెంట్ వంటి వాటిలో 60 నుండి 80 గంటల శిక్షణ ఇవ్వబడుతుందన్నారు.
తాజావార్తలు
-
Bigg Boss Telugu 10: ‘బిగ్ బాస్ తెలుగు 10’లో ఎవరు ఎంత సంపాదిస్తున్నారో తెలుసా?.. టాప్ లో ఆటో రామ్ ప్రసాద్..
-
US Open 2026: సబాలెంకాను ఓడించి ఎలెనా రిబాకినా చరిత్ర.. తొలిసారి యూఎస్ ఓపెన్ టైటిల్
-
Hanuman Ansh: రూ.2 కోట్ల బడ్జెట్.. రూ.200 కోట్ల వసూళ్లు.. ఆ ఒక్క పొరపాటుతో ఆస్కార్ ఛాన్స్ మిస్
-
Jana Sena : ఖమ్మంలో ఇవాళ జనసేన తెలంగాణ శంఖారావం.. భారీగా నేతలు, కార్యకర్తల రాక
-
BRICS Summit 2026: BRICSకి 20 ఏళ్లు.. ప్రత్యేక స్మారక తపాలా బిళ్లలు విడుదల చేసిన భారత్.. వీటి ప్రత్యేకత ఇదే
ట్రెండింగ్
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్తో సెప్టెంబర్ 15న భారత్లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!