KPHB Mur*der: భర్తను హత్య చేసి పాతిపెట్టిన భార్య.. రెండు రోజుల్లో కేసు చేధించిన పోలీసులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
KPHB Mur*der: ఈ మధ్యకాలంలో దేశంలో చాలా చోట్ల భర్తలను భార్యలు వివిధ రకాలుగా చంపేస్తున్న ఘటనలు ఎక్కువయ్యాయి. ఈ నేపథ్యంలోనే నాలుగు రోజుల క్రితం హైదరాబాద్ నగరంలోని కేపీహెచ్బీ పోలీస్ స్టేషన్ పరిధిలోని మిత్ర హిల్స్ లో భర్తను చంపి పాతిపెట్టిన కేసులో పోలీసులు ఫిర్యాదు అందిన రెండు రోజుల్లోనే కేసును చేదించారు. నిందితులు కవిత, ఆమె సోదరి జ్యోతి, మరిది మల్లేష్ లను అరెస్టు చేసి రిమాండ్ తరలించారు పోలీసులు. ఈ సందర్భంగా కేపీహెచ్బీ పోలీసు స్టేషన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏసీపీ శ్రీనివాసరావు హత్య ఘటనకు సంబంధించి వివరాలను వెల్లడించారు.
ఈ హత్య పథకం ప్రకారం మృతుడైన సాయిలును నగరానికి తీసుకువచ్చి జ్యోతి, మల్లేష్ ఇంటి వద్ద అవకాశం కోసం ఎదురు చూసి శుక్రవారం మద్యం తాగించి హత్యచేశారని తెలిపారు. హత్యకు ముందు పథకం ప్రకారం సాయిలుకు విద్యుత్ షాక్ ఇచ్చి చంపేందుకు యత్నించింప్పటికి, ప్రాణం ఉండటంతో గొంతు నులిమి, వృషణాలపై దాడి చేసి హత్య చేశారు. అయితే ఈ విషయం ఆటో డ్రైవర్ ఇచ్చిన పిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు.. ఆటో బుక్ చేసిన ప్రాంతానికి వెళ్లి వివరాలు సేకరించి సాయిలు హత్య ఉదంతాన్ని తెలుసుకున్నారు పోలీసులు. దానితో నిందితులు కవిత, జ్యోతీ, మల్లేష్ లను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు.
Also Read
- Petrol Diesel Purchase: కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం.. ఇక వారికి బంకుల్లో నో పెట్రోల్, డీజిల్!
- Indian Railways: రైలు ఆలస్యమైనా ప్రయాణికుడి తప్పేనా..? ప్లాట్ఫామ్ టికెట్ సమయం ముగిసిందంటూ రూ.520 జరిమానా.! వీడియో వైరల్..
- Cyber Crime: ఆన్లైన్ డేటింగ్ ఉచ్చులో మహిళా న్యాయమూర్తి.. జడ్జిగారి 'రోమాన్స్ స్కామ్' కథ వింటే నోరెళ్లబెడతారు!
- Mahabharata Lessons: కురుక్షేత్రం vs ఆధునిక వార్స్.. యుద్ధం కంటే ధర్మమే గొప్పది.. మహాభారతం నేర్పిన సత్యం ఇదే!
కవిత, అతని కుటుంబ సభ్యుల నుంచి అవమానకరమైన ప్రవర్తనను తట్టుకోలేక కవిత సాయిలును అంతమొందించేందుకు ప్లాన్ వేసి అమలు చేసారని తెలిపారు. హత్యకు మల్లేష్, జ్యోతి సహకరించినట్లు వెల్లడించారు అధికారులు. హత్య అనంతరం మృతదేహాన్ని సంగారెడ్డి జోగిపేట తరలించాలని ఆటో మాట్లాడుకుని అక్కడికి వెళ్లిన అనంతరం స్మశాన వాటిక వద్ద కుర్చీ విషయంలో గొడవ జరిగింది. అయితే, ఎక్కడి నుంచి తీసుకొచ్చానో అక్కడే దింపుతానని డ్రైవర్ చెప్పడంతో మృతదేహన్నీ కవిత మిత్ర హిల్స్ తీసుకొచ్చారు. మిత్ర హిల్స్ పక్కనే ఉన్న అలీతలాబ్ చెరువు సమీపంలో మృతదేహాన్ని పూడ్చి పెట్టి అక్కడ నుంచి సొంత గ్రామానికి వెళ్లి సాయిలు పనికి వెళ్లి రాలేదని అందరిని నమ్మించే ప్రయత్నం చేశారన్నారు. ఆటో డ్రైవర్ వల్లి నాయక్ ఫిర్యాదుతోనే ఈ కేసు బయటకు వచ్చిందని ఆయన తెలిపారు.
తాజావార్తలు
-
Petrol Diesel Purchase: కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం.. ఇక వారికి బంకుల్లో నో పెట్రోల్, డీజిల్!
-
Indian Railways: రైలు ఆలస్యమైనా ప్రయాణికుడి తప్పేనా..? ప్లాట్ఫామ్ టికెట్ సమయం ముగిసిందంటూ రూ.520 జరిమానా.! వీడియో వైరల్..
-
Gold Rate Today: భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు.. ఒక్కరోజులోనే షాకిచ్చిన బులియన్ మార్కెట్!
-
Cyber Crime: ఆన్లైన్ డేటింగ్ ఉచ్చులో మహిళా న్యాయమూర్తి.. జడ్జిగారి ‘రోమాన్స్ స్కామ్’ కథ వింటే నోరెళ్లబెడతారు!
-
Ben Stokes-ECB: పూర్తిస్థాయి నిషేధంపై ఆలోచిస్తున్నాం.. బాంబ్ పేల్చిన ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు!
ట్రెండింగ్
-
Mahabharata Lessons: కురుక్షేత్రం vs ఆధునిక వార్స్.. యుద్ధం కంటే ధర్మమే గొప్పది.. మహాభారతం నేర్పిన సత్యం ఇదే!
-
iQOO Flagship Days Sale ప్రారంభం.. iQOO 15, iQOO 15R, Neo 10పై భారీ తగ్గింపులు.!
-
Bangladesh History: ఆస్ట్రేలియాపై చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్.. క్రికెట్ చరిత్రలోనే మొదటిసారి!
-
FIFA World Cup: రెండు గోల్స్, మూడు రెడ్ కార్డ్స్.. దక్షిణాఫ్రికాను చిత్తు చేసి బోణి కొట్టిన మెక్సికో.!
-
Parenting Tips: డిజిటల్ చెరలో బాల్యం.. రోబోలుగా మారుతున్న పిల్లలు! పేరెంట్స్ ఈ జాగ్రత్తలు తీసుకోండి..