V. Srinivasa Rao: ఉల్లి రైతులకు మేలు చేయకపోతే రాజీనామా చేయండి..!
- ఉల్లి రైతులకు గిట్టుబాటు ధర కల్పించలేక పోతే ప్రభుత్వం లేనట్లే..
- 3 వేలు గిట్టుబాటు ధర కల్పించాలి..
- ఉల్లి రైతుకు మేలు చేయకపోతే చంద్రబాబు రాజీనామా చేయాలి..
- సీపీఎం ఏపీ కార్యదర్శి వి. శ్రీనివాసరావు డిమాండ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
V. Srinivasa Rao: ఉల్లి రైతుకు మేలు చేయకపోతే రాజీనామా చేయండి అంటూ డిమాండ్ చేశారు సీపీఎం ఏపీ రాష్ట్ర కార్యదర్శి వి. శ్రీనివాసరావు.. కర్నూలు వ్యవసాయ మార్కెట్ యార్డులో పర్యటించింది సీపీఎం నేతల బృందం.. ఉల్లి రైతుల కష్టాలు అడిగి తెలుసుకున్నారు నేతలు.. ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ.. ఉల్లి రైతులు దయనీయ స్థితిలో వున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.. ఉల్లి నాటుకు ఎకరానికి 20 వేలు ఖర్చు అవుతుంది. రవాణా, కూలీ ఖర్చులతో లక్ష రూపాయలు అవుతుంది.. కానీ, క్వింటాల్కు రూ.1,200 గిట్టుబాటు ధరను కూడా కూటమి ప్రభుత్వం నిలిపివేయడం దారుణం అన్నారు.. డీబీటీ ద్వారా రైతులకు ఖాతాలో డబ్బులు వేస్తామని చెప్పినా.. ఇప్పటికీ రాలేదని విమర్శించారు..
Read Also: Netanyahu: ఇక పాలస్తీనా రాజ్యం ఉండదు.. మద్దతు దేశాలకు నెతన్యాహు హెచ్చరిక
Also Read
- Wedding Gift: వింత వెడ్డింగ్ గిఫ్ట్.. స్నేహితుడి భార్య ముఖాన్ని గుండెలపై శాశ్వతంగా వేయించుకున్న వ్యక్తి..!
- September 1 Rules Changes: సెప్టెంబర్ 1 నుంచి మారనున్న 5 కీలక విషయాలు.. మీ జేబుపై నేరుగా ప్రభావం!
- 10.1 అంగుళాల టచ్స్క్రీన్, 310 కి.మీ రేంజ్, బాక్సీ డిజైన్తో Suzuki e-Sky లాంచ్..!
- Road Accident: చిలకలూరిపేటలో ఘోర ప్రమాదం.. ఏడుగురి మృతి, 8 మందికి తీవ్ర గాయాలు!
ఎన్నికల ముందు చంద్రబాబు రైతులకు అనేక హామీలు ఇచ్చారు.. మిర్చికి ప్రకటించిన గిట్టుబాటు ధర ఇప్పటికీ రైతులకు రాలేదన్నారు శ్రీనివాసరావు.. అయితే, రైతుల నుండి ఉల్లి కొనుగోలు చేసి రేషన్ షాపుల ద్వారా పంపిణీ చేయాలని సూచించారు.. ఉల్లి రైతులకు గిట్టుబాటు ధర కల్పించలేక పోతే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం లేనట్లే.. 3 వేలు గిట్టుబాటు ధర కల్పించాలి, ఉల్లి రైతుకు మేలు చేయకపోతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.. మరోవైపు, లైసెన్స్ లేకుండా కర్నూలు మార్కెట్ యార్డులో కొనుగోలు చేస్తున్నారు. టమోటా, ఉల్లి రైతులు ఆందోళనలో వున్నారని తెలిపారు. .అయితే, పన్ను లేకుండా విదేశీ పత్తిని దిగుమతి చేస్తున్నారు. మోడీ ప్రభుత్వం రైతులను పట్టించుకోవడం లేదు. మేకిన్ ఇండియా పేరుతో ప్రజలను, రైతులను మభ్య పెడుతున్నారని దుయ్యబట్టారు.. ప్రధాని నరేంద్ర మోడీ మాటలు మానుకొని ఏపీలో ఉల్లి, టమోటా రైతులకు మేలు చేయాలని కోరారు.. కూటమి ప్రభుత్వంలో రైతులు అల్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి. శ్రీనివాసరావు..
తాజావార్తలు
-
Yash Toxic: యష్కు బిగ్ షాక్.. ‘టాక్సిక్’ తగ్గితేనే బెటర్!
-
Wedding Gift: వింత వెడ్డింగ్ గిఫ్ట్.. స్నేహితుడి భార్య ముఖాన్ని గుండెలపై శాశ్వతంగా వేయించుకున్న వ్యక్తి..!
-
September 1 Rules Changes: సెప్టెంబర్ 1 నుంచి మారనున్న 5 కీలక విషయాలు.. మీ జేబుపై నేరుగా ప్రభావం!
-
Producer Deepti: హీరోయిన్పై నిర్మాత సంచలన ఆరోపణలు.. ‘పేమెంట్ ఇవ్వను.. ఆ డబ్బు హార్ట్ ఆపరేషన్లకు విరాళంగా ఇస్తా’
-
King 100 : సంక్రాంతి కంటే ముందే విడుదలకి రెడీ అవుతున్న ‘కింగ్ 100’
ట్రెండింగ్
-
10.1 అంగుళాల టచ్స్క్రీన్, 310 కి.మీ రేంజ్, బాక్సీ డిజైన్తో Suzuki e-Sky లాంచ్..!
-
8000mAh బ్యాటరీ, 50MP కెమెరా, 144Hz AMOLED డిస్ప్లేతో Realme P4s 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!
-
165Hz డిస్ప్లే, 24GB RAM, 7,470mAh బ్యాటరీతో Lenovo Legion Tab Y700 AI టాబ్లెట్ లాంచ్.. ధర ఎంతంటే?
-
iPhone 18 Proలో అదిరిపోయే అప్గ్రేడ్స్.. రిలీజ్ డేట్, కలర్స్, బ్యాటరీ, కెమెరా, ధర పూర్తి వివరాలు ఇవే..
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ ఖరారు.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లను వదులుకుంటున్న కేకేఆర్?