Netanyahu: ఇక పాలస్తీనా రాజ్యం ఉండదు.. మద్దతు దేశాలకు నెతన్యాహు హెచ్చరిక
- ఇక పాలస్తీనా రాజ్యం ఉండదు
- మద్దతు దేశాలకు నెతన్యాహు హెచ్చరిక
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇకపై పాలస్తీనా రాజ్యం ఉండబోదని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ప్రకటించారు. ఈ మేరకు ఇజ్రాయెల్ ప్రధానమంత్రి కార్యాలయం ఎక్స్లో పోస్ట్ చేసింది. పాలస్తీనా రాజ్య స్థాపనకు ఆయా దేశాలు మద్దతు పలుకుతున్నాయి. ఐక్యరాజ్యసమితిలో తీర్మానం చేస్తామంటూ వెల్లడించాయి. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ నుంచి ఈ ప్రకటన రావడం ఆశ్చర్యం కలిగిస్తోంది.
ఇది కూడా చదవండి: Rajnath Singh: ఆపరేషన్ సిందూర్-2, 3 పార్టులు పాక్ తీరుపై ఆధారపడి ఉంటుంది
Also Read
- Divorce Battle: భర్తపై 23 ఏళ్ల న్యాయపోరాటం.. చివరకు రూ.85 కోట్లు గెలుచుకున్న భారత సంతతికి చెందిన మహిళ
- Vladimir Putin: "మోడీపై ఒత్తిడి తేవడం ఎవరి తరం కాదు".. భారత్కు రష్యా అధ్యక్షుడు పుతిన్ గట్టి మద్దతు
- Donald Trump: మోడీ నాకు మంచి స్నేహితుడు.. భారత్తో త్వరలో వాణిజ్య ఒప్పందం..
- Employee Salary Freeze: ఉద్యోగులకు షాక్.. టెక్ కంపెనీ సంచలన నిర్ణయం.. జీతాల కంటే AI ముఖ్యం..!
ఈనెలాఖరు ఐక్యరాజ్యసమితి అసెంబ్లీ కౌన్సిల్ సమావేశంలో పాల్గొనేందుకు నెతన్యాహు అమెరికా వెళ్తున్నారు. ఈ సందర్భంగా వైట్హౌస్కు రావాలని నెతన్యాహుకు ట్రంప్ ఫోన్ చేసి ఆహ్వానించారు. ఇక ఇంతలోనే ఇజ్రాయెల్ సంచలన ప్రకటన చేసింది. ఇక మా దేశంలో మధ్యలో ఒక ఉగ్రవాద రాజ్యాన్ని బలవంతంగా ఏర్పాటు చేయడానికి జరుగుతున్న ప్రయత్నాలు జరగనివ్వబోమన్నారు. అమెరికా నుంచి వచ్చాక దీనిపై కీలక ప్రకటన ఉంటుందని నెతన్యాహు పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: Charlie Kirk: ట్రంప్ సమక్షంలో చార్లీ కిర్క్ భార్య ఎరికా కీలక ప్రకటన
అక్టోబర్ 7, 2023న హమాస్ ఉగ్రవాదుల ఊచకోత తర్వాత పాలస్తీనాకు మద్దతిస్తున్నా నాయకులకు మా దగ్గర స్పష్టమైన సందేశం ఉందని ఇజ్రాయెల్ తెలిపింది. ఇక పాలస్తీనా రాజ్యం ఉండదని పేర్కొంది. జోర్డాన్ నదికి పశ్చిమాన పాలస్తీనా రాజ్యం ఉండబోదని ఇజ్రాయెల్ పీఎంవో స్పష్టం చేసింది. అమెరికా నుంచి తిరిగి వచ్చిన తర్వాత దీనిపై ప్రతిస్పందన ఉంటుందని నెతన్యాహు కార్యాలయం వెల్లడిచింది.
అక్టోబర్ 7, 2023న హమాస్ ఉగ్రవాదులు.. ఇజ్రాయెల్పై దాడి చేసి 250 మందిని బందీలుగా తీసుకెళ్లిపోయారు. ఆనాటి నుంచి హమాస్ అంతమే లక్ష్యంగా గాజాపై ఇజ్రాయెల్ భీకరదాడులు చేస్తోంది. అయితే అంతర్జాతీయ మధ్యవర్తుల కారణంగా కొంతమంది బందీలను హమాస్ విడుదల చేసింది. ఇంకా 40, 50 మంది బందీలు హమాస్ చెరలో ఉన్నారు. ఒకేసారి విడిచిపెట్టాలని అమెరికా ఒత్తిడి చేసింది. కానీ విడిచిపెట్టలేదు. దీంతో గాజా స్వాధీనం కోసం ఇజ్రాయెల్ ప్రయత్నిస్తోంది. దీంతో భీకరదాడులు చేస్తోంది. ఇక ఖతార్లో హమాస్ నేతలు ఉన్నారన్న సమాచారంతో ఇజ్రాయెల్ దాడులకు పాల్పడింది. ఈ వ్యవహారం అంతర్జాతీయంగా విమర్శలు వెల్లువెత్తాయి.
Prime Minister Benjamin Netanyahu: "There will be no Palestinian state. The response to the latest attempt to force upon us a terror state in the heart of our land will be given after my return from the United States"
"I have a clear message to those leaders who are recognizing… pic.twitter.com/1RyGknKZRC
— ANI (@ANI) September 22, 2025
తాజావార్తలు
-
Lalit Modi: సచిన్, గంగూలీ, ద్రవిడ్లను నేను బ్రతిమాలుకున్నా.. లలిత్ మోడీ సంచలన వ్యాఖ్యలు!
-
Divorce Battle: భర్తపై 23 ఏళ్ల న్యాయపోరాటం.. చివరకు రూ.85 కోట్లు గెలుచుకున్న భారత సంతతికి చెందిన మహిళ
-
2000 vs 2026: పెట్రోల్ రూ. 26, సిలిండర్ రూ.157.. ఈ 26 ఏళ్లలో నిత్యావసరాల ధరలు ఎంత పెరిగాయో తెలుసా?
-
Sanjosh Foundation: చిన్న హీరో, పెద్ద సహాయం.. 118 మంది విద్యార్థులకు స్కాలర్షిప్లు, మరెన్నో సేవా కార్యక్రమాలు!
-
JanaNayagan : విజయ్ ‘జననాయగన్’.. బయ్యర్లకు వడ్డీతో సహా డబ్బులు వెనక్కి ఇస్తున్న కేవీఎన్ ప్రొడక్షన్స్!
ట్రెండింగ్
-
HONOR Magic V6 లాంచ్.. కేవలం 8.75mm మందం, 6660mAh భారీ బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్.!
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..