Tammineni Veerabhadram: బీఆర్ఎస్ పొత్తు ధర్మం పాటించ లేదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హైదరాబాద్ లో సీపీఎం తెలంగాణ కార్యవర్గ సమావేశం జరుగుతోంది. ఈ సమావేశంలో బీవీ రాఘవులు, తమ్మినేని వీరభద్రం, జూలకంఠి రంగారెడ్డి, సీతారాములు సహా ఇతర సభ్యులు హాజరయ్యారు. అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా ఈ సమావేశం కొనసాగుతుంది. అందులో భాగంగా సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం మాట్లాడుతూ.. బీఆర్ఎస్, బీజేపీకి దగ్గరవుతుందని ఆరోపించారు. బీఆర్ఎస్ పొత్తు ధర్మం పాటించ లేదని పేర్కొన్నారు. కలిసి వచ్చే పార్టీలతో పని చేస్తామని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు.
Read Also: Indian American: చిన్న గొడవకే ప్రియురాలిని కాల్చి చంపిన భారతీయ యువకుడు..
Also Read
- Food Poisoning: జగిత్యాల జిల్లాలో విషాదం.. పెళ్లి భోజనం తిని 15 మందికి అస్వస్థత..
- T20 Cricket: కేవలం 7 పరుగులకే ఆలౌట్, 10 రన్స్కే కుప్పకూలిన జట్లు, టీ20 చరిత్రలోనే అత్యంత దారుణ స్కోర్లు ఇవే!
- Union Budget: అక్టోబర్ 12 నుంచి కేంద్ర బడ్జెట్ కసరత్తు.. కీలక అంశాలపై ఫోకస్
- Central Employees: కేంద్ర ఉద్యోగుల జీతాల్లో ఊహించని మార్పు.. 3 శాతం ఉన్న ఇంక్రిమెంట్ 6 శాతానికి..?
తొందర పడాల్సిన అవసరం లేదని పార్టీ నిర్ణయించిందని తమ్మినేని పేర్కొన్నారు. ధరల పెరుగుదలపై సెప్టెంబర్ 1 నుండి 7 వరకు ప్రదర్శనలు, నిరసనలు చేపడతామన్నారు. సాయుధ పోరాటం స్ఫూర్తితో సెప్టెంబర్ 10 నుండి 17 వరకు విప్లవ వార్షికోత్సవాలు జరుపనున్నట్లు ఆయన తెలిపారు. సాయుధ పోరాట వారసత్వం తమదేనని.. కొనసాగిస్తామని తమ్మినేని వీరభద్రం అన్నారు. అమిత్ షా, మోడీ తెలంగాణలో అధికారంలోకి రావాలనే ఆశలు ఆడియశాలు అయ్యాయని ఆరోపించారు. బీజేపీ మరింత పడిపోతుందని తమ్మినేని విమర్శించారు. బీజేపీ ఓ విష కూటమి అని దుయ్యబట్టారు. నిర్దిష్ట ప్రతిపాదన వచ్చినప్పుడు అన్ని రకాల చర్చలు చేస్తామని తెలియజేశారు. ఉమ్మడిగా ఏం చేయాలి అనేది ఆలోచన చేస్తామని తమ్మినేని వీరభద్రం పేర్కొన్నారు.
Read Also: Rajini: అన్ని సెంటర్లకి ఒకడే సూపర్ స్టార్… అన్ని ఇండస్ట్రీలకి ఒకటే హిట్…
పొత్తులపై కాంగ్రెస్ తో చర్చలు జరిపామని కూనంనేని సాంబశివరావు అన్నారు. ఇవి కేవలం ప్రాథమిక చర్చలేనని పేర్కొన్నారు. తాము కొన్ని ప్రతిపాదనలు పెట్టామని.. తమను తాము త్యాగం చేసుకోలేమని కూనంనేని తెలిపారు. తమకు బలం ఉన్న సీట్లలో పోటీ చేస్తామని చెప్పారు. తమ ప్రతిపాదనలు కాంగ్రెస్ అడిగారని.. వాళ్లు ఆమోదం చెప్తే పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు. మరోసారి సిపిఐ, సిపిఎం నాయకత్వం కూడా భేటీ కాబోతుందని తెలియజేశారు.
- Tags
- Alliance
- BRS
- CPM
- telugu news
తాజావార్తలు
-
Food Poisoning: జగిత్యాల జిల్లాలో విషాదం.. పెళ్లి భోజనం తిని 15 మందికి అస్వస్థత..
-
Emraan Hashmi: సినిమా సక్సెస్ జోష్లో ఇమ్రాన్ హష్మీకి బిగ్ షాక్.. స్వైన్ ఫ్లూ పాజిటివ్!
-
T20 Cricket: కేవలం 7 పరుగులకే ఆలౌట్, 10 రన్స్కే కుప్పకూలిన జట్లు, టీ20 చరిత్రలోనే అత్యంత దారుణ స్కోర్లు ఇవే!
-
Kittu Pawan: ఫోక్ స్టార్ కిట్టు పవన్ హీరోగా సినిమా ప్రారంభం!
-
Union Budget: అక్టోబర్ 12 నుంచి కేంద్ర బడ్జెట్ కసరత్తు.. కీలక అంశాలపై ఫోకస్
ట్రెండింగ్
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!