CPI Ramakrishna: ఈ ఘటనకు వాళ్ల వైఫల్యమే కారణం.. సీపీఐ రామకృష్ణ సంచలన వ్యాఖ్యలు
- తొక్కిసలాటలో ఆరుగురు మృతి
- 41 మంది గాయపడ్డారన్న ఈవో
- స్పందించిన సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
శ్రీ వెంకటేశ్వర స్వామి వారి వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించి టోకెన్ల జారీ కౌంటర్ల వద్ద జరిగిన ఘటన భక్తుల్లో కలకలాన్ని రేపింది. తొక్కిసలాట ఘటనలో ఆరుగురు మృతి చెందారు.. 41 మంది భక్తులు గాయపడ్డారు.. 20 మంది భక్తులను డిశ్చార్జ్ చేశాం.. ఒకరిద్దరు మాత్రమే రెండు రోజుల పాటు వైద్యుల పర్యవేక్షణలో ఉండాలని టీటీడీ ఛైర్మన్ శ్యామల రావు అన్నారు. కాగా.. మృతులు విశాఖకు చెందిన జి. రజనీ(47), లావణ్య (40), శాంతి (34), తమిళనాడుకు చెందిన మెట్టు సేలం మల్లికా, కర్ణాటకకు చెందిన నిర్మల (50), నర్సీపట్నంకు చెందిన బొద్దేటి నాయుడు బాబుగా గుర్తించారు.
READ MORE: AP BJP: నీ దర్శనానికి వచ్చిన భక్తులకు ఏర్పాట్లు చేయలేనందుకు మమ్ములను క్షమించండి స్వామీ..
Also Read
- 48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
- CM Chandrababu: పేదల సొంతింటి కల సాకారం.. 28,445 కుటుంబాలకు సీఎం గుడ్న్యూస్
- Vijayasai Reddy: టీడీపీ, వైసీపీకి మూడో ప్రత్యామ్నాయం మేమే.. విజయసాయి రెడ్డి కీలక వ్యాఖ్యలు
- Asian Games 2026: జపాన్పై భారత్ ఘన విజయం.. సెమీస్కు దూసుకెళ్లిన హర్మన్సేన..!
ఇదిలా ఉండగా.. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, పార్టీ నేతలు తిరుపతి రుయా ఆసుపత్రిలో బాధితులను పరామర్శించారు. ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ… టీటీడీ, పోలీసుల వైఫల్యం వల్లే ఈ ఘటన జరిగిందని ఆరోపించారు. “ఈ ఘటనపై విచారణ జరిపించి బాధ్యులను శిక్షించాలి. సామాన్య భక్తులకు అధిక ప్రాధాన్యం ఇస్తామని టిటిడి ఛైర్మన్ పదే పదే చెబుతున్నారు. కానీ సామాన్య భక్తుల పరిస్థితి ఏ విధంగా మారిందో మనం చూశాం. వీఐపీలకు మాత్రం పూర్తిస్థాయిలో భద్రత కల్పిస్తున్నారు. ఘటన జరిగిన ప్రాంతం చాలా విశాలంగా ఉంది. పోలీసులు లేకపోయినట్లయితే ఈ ఘటన జరిగేది కాదు. ఎవరికి వారుగా క్యూలో వెళ్లి టోకెన్లు తీసుకునేవారు. భక్తులను పోలీసులు.. కట్టడి చేసి ఒక్కసారిగా వదలడం వల్లే ఈ తొక్కిసలాట జరిగింది. మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల రూపాయల చొప్పున ఎక్స్ గ్రేషియా చెల్లించాలి.” అని పేర్కొన్నారు.
READ MORE: Top Headlines @9AM : టాప్ న్యూస్
తాజావార్తలు
-
Zombie Reddy 2: తేజ సజ్జ ‘జాంబీ రెడ్డి 2’లో మైండ్ బ్లాక్ చేస్తున్న ఉపేంద్ర ఫస్ట్ లుక్ పోస్టర్!
-
Rahul Gandhi: ‘ఓటు చోరీ’ తర్వాత ఇప్పుడు ‘పార్టీ చోరీ’.. ఈసీపై రాహుల్ గాంధీ ఫైర్
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
CM Chandrababu: పేదల సొంతింటి కల సాకారం.. 28,445 కుటుంబాలకు సీఎం గుడ్న్యూస్
-
Explainer: ముస్లిం దేశాలు రగిలిపోవడానికి కారణమేంటి?
ట్రెండింగ్
-
Asian Games 2026: జపాన్పై భారత్ ఘన విజయం.. సెమీస్కు దూసుకెళ్లిన హర్మన్సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..
-
Floor Cleaning Tips: ఇల్లు తుడిచాక నేల జిడ్డుగా మారుతోందా? ఈ తప్పులే కారణం.. ఇలా చేస్తే మెరిసిపోతుంది!
-
Abhishek Sharma: కెరీర్ మొదలెట్టి రెండేళ్లే.. అప్పుడే కింగ్ కోహ్లీ సరసన అభిషేక్.. టీ20ల్లోనే అరుదైన రికార్డు!
-
Garlic Karam: వెల్లుల్లి కారం ముద్దముద్దగా అవుతుందా.? ఇలా చేయండి పొడిపొడిగా నెలల తరబడి తాజాగా ఉంటుందంటే.!