Narayana: ప్రజాస్వామ్యం ఖూనీ అవుతోంది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీలో ప్రజాస్వామ్యం ఖూనీ అవుతోందని మండిపడ్డారు సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ. తిరుపతిలో నారాయణ మాట్లాడుతూ.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో దొంగ ఓట్లను నమోదు చేయించిన రెవెన్యూ అధికారులను ఉరితీయాలి. తిరుపతి వైసిపి పడమటి కార్యాలయం చిరునామాతో 36 దొంగ ఓట్లను నమోదు చేశారు. ప్రజాస్వామ్యాన్ని నగ్నంగా ఖూనీ చేస్తున్నారు. అధికార పార్టీ నేతలు ఎన్ని అక్రమాలకు పాల్పడిన పిడిఎఫ్ అభ్యర్థుల విజయం ఖాయం. ఏపీలో రాక్షస పాలన కొనసాగుతోంది. వాలంటీర్ ఇంటిలో 22ఓట్లు నమోదు చేయించారు.ఒక మహిళకు 21మంది భర్తలు ఉన్నట్లు సృష్టించి ఓట్లు నమోదు చేశారు. యశోద నగర్ లోని ఖాళీ స్థలంలో 11 ఓట్లు నమోదు చేయించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసిపి అక్రమాలకు అంతులేకుండా పోతోంది. తిరుపతి నగరంలో 7వేల దొంగ ఓట్లున్నాయన్నారు నారాయణ. ఎన్నికల సంఘం వెంటనే చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.
Read Also: Anantapur Police: రాప్తాడు హైవేపై హవాలా డబ్బు.. అనంతపురం పోలీసులు అదుపులో కేరళ గ్యాంగ్
Also Read
- RCB Player: ‘ఆర్సీబీకి ఆడాలని నాకు లేదు’.. సంచలన వ్యాఖ్యలు చేసిన కెప్టెన్ రజత్ పాటిదార్..
- Iran-Israel War: శాంతించండి.. దాడులు ఆపాలంటూ ఇరాన్, ఇజ్రాయెల్కు భారత్ విజ్ఞప్తి
- Minister Sridhar Babu : ‘హిట్లర్’ వ్యాఖ్యలపై రగడ.. కేసీఆర్ వీడియోతో శ్రీధర్ బాబు కౌంటర్.!
- India Test Win: టెస్టు మ్యాచ్ గెలిచిన తర్వాత.. గ్రౌండ్లో బిత్తర చూపులు చూసిన టీమిండియా ఆటగాళ్లు.. ఎందుకంటే..
ఈసీ చర్యలు తీసుకోవాలి.. కూన రవి
శ్రీకాకుళంలో టీడీపీ సీనియర్ నేత కూన రవికుమార్ మాట్లాడుతూ.. పట్టభద్రుల ఎన్నికను కూడా అవినీతిమయం చేయాలని చూస్తున్నారు. పది , ఐదు తరగతిచదవని వారు కూడా ఓటర్లుగా నమెదు అయ్యారు.తప్పుడు ధృవపత్రాలతో ఓటర్లుగా నమెదైన వారిపై ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవాలి.క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం. అర్హతలేని వారు గ్రాడ్యుయేట్స్ గా నమెదు అయ్యారు. తక్షణం వారిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలి.వాలంటీర్ ల ద్వారా ఓట్లు కోనుగోలు చేయాలని కుట్ర చేస్తున్నారు.బ్యాంక్ ఖాతాలో డబ్బులు జమచేసి , ఓట్లు కోనుగోలు చేయాలని చూస్తున్నారు. జిల్లా మంత్రులు ధర్మాన , సీదిరి ప్రజాస్వామ్యం అపహాస్యం చేసేవిధంగా వ్యవహరిస్తున్నారు. ఉద్యోగలు , గ్రాడ్యుయేట్లు ఆలోచించి , టిడిపి బలపర్చిన పట్టబద్రుల ఎమ్మెల్సీ అభ్యర్ది కి ప్రతి ఒక్కరూ మద్దతు పలకాలి.
Read Also: Business Headlines 08-03-23: ఇక.. ‘లోకేష్’ తుపాకీలు. మరిన్ని వార్తలు
తాజావార్తలు
-
Thaman: ఇదే నా లాస్ట్ సినిమా: తమన్
-
RCB Player: ‘ఆర్సీబీకి ఆడాలని నాకు లేదు’.. సంచలన వ్యాఖ్యలు చేసిన కెప్టెన్ రజత్ పాటిదార్..
-
Iran-Israel War: శాంతించండి.. దాడులు ఆపాలంటూ ఇరాన్, ఇజ్రాయెల్కు భారత్ విజ్ఞప్తి
-
Minister Sridhar Babu : ‘హిట్లర్’ వ్యాఖ్యలపై రగడ.. కేసీఆర్ వీడియోతో శ్రీధర్ బాబు కౌంటర్.!
-
India Test Win: టెస్టు మ్యాచ్ గెలిచిన తర్వాత.. గ్రౌండ్లో బిత్తర చూపులు చూసిన టీమిండియా ఆటగాళ్లు.. ఎందుకంటే..
ట్రెండింగ్
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!