Kerala Human Sacrifice: కేరళ నరబలి కేసు.. నిందితులకు 9రోజుల పోలీసు కస్టడీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kerala Human Sacrifice: కేరళ నరబలి కేసులో ముగ్గురు నిందితులను తొమ్మిది రోజుల పోలీసు కస్టడీకి పంపినట్లు అధికారులు గురువారం తెలిపారు. ఎర్నాకులం జిల్లాలోని పెరుంబవూరు మేజిస్ట్రేట్ కోర్టు మహ్మద్ షఫీ, భగవల్ సింగ్, లైలాలను పోలీసు కస్టడీకి పంపింది. అంతకుముందు, 12 రోజుల పోలీసు కస్టడీని మంజూరు చేస్తూ ఎర్నాకులంలోని జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ ముగ్గురు నిందితులు కేరళ హైకోర్టును ఆశ్రయించారు. పోలీసు కస్టడీకి సంబంధించిన ఉత్తర్వులను పక్కన పెట్టాలని కోరారు.
విచారణ సమయంలో వారు తమ న్యాయవాదిని కలిసేందుకు అనుమతిని కోరారు. అదే సమయంలో తమ ఒప్పుకోలు ప్రకటన వివరాలను మీడియా ద్వారా విడుదల చేయకూడదని ఆదేశాలు కూడా కోరారు. ఇంతలో కేరళ హైకోర్టు ఈ పిటిషన్ను కొట్టివేసింది, అయితే 15 నిమిషాల పాటు వారి న్యాయవాదిని కలవడానికి మాత్రం వారికి అనుమతి ఇచ్చింది. వారి పిటిషన్ను కొట్టివేస్తూ ఇద్దరు మహిళలను దారుణంగా నరబలి ఇవ్వడం కేరళ ప్రజలను దిగ్భ్రాంతికి గురి చేసిందని న్యాయస్థానం పేర్కొంది.
Also Read
- Wife Murder: బీమా డబ్బుల కోసం.. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను కొట్టి చంపేసిన కీచక భర్త..!
- Nellore: వివాహేతర సంబంధం.. నిండు ప్రాణం బలి.!
- Kolkata Airport Mosque: ముగ్గురు సీఎంలు టచ్ చేయలేకపోయారు.. సువేందు రాకతో ఎయిర్పోర్టు మసీదు తరలింపు.!
- Israel-France: ఇజ్రాయెల్ మంత్రి బెన్-గ్విర్కు ఫ్రాన్స్ షాక్.. దేశంలోకి రాకుండా నిషేధం
TRS MLAs Trap: పోలీసులకు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ఫిర్యాదు.. అసలు ఏం జరిగిందంటే..?
ఇద్దరు మహిళలను నరబలి ఇచ్చిన కేసు కేరళలో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ కేసులో విచారణ చేపట్టగా.. వెన్నులో వణుకు పుట్టించే విషయాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వచ్చాయి. నిందితులను ప్రేరేపించడం నుంచి మహిళలను తీసుకొచ్చి నరబలి ఇచ్చిన ప్రతీ విషయంలో మహమ్మద్ షఫీ అలియాస్ రషీద్ ఉన్నట్లు పోలీసుల విచారణలో తేలింది. డబ్బుకు ఆశపడిన ఓ దంపతులు దారుణానికి తెగబడ్డారు. ఏకంగా ఇద్దరు యువతులను దారుణంగా నరబలి ఇచ్చారు. కేరళలోని పతనంతిట్ట జిల్లా తిరువల్లకు చెందిని నిందితులు భగవల్ సింగ్ అతని భార్య లైలాలు డబ్బు ఆశకోసం ఇద్దరని దారుణంగా హత్య చేశారు. వీరిద్దరికి రషీద్ అలియాస్ మహ్మద్ షఫీ సహకరించారు. ముగ్గురు కలిసి ఇద్దరు యువతులను నరబలి ఇచ్చారు. 50 ఏళ్లుగా లాటరీ టికెట్లు అమ్ముకుంటున్న ఇద్దరు మహిళలను వీరు టార్గెట్ చేశారు. పతనంతిట్ట జిల్లాలోని సింగ్ మరియు లైలా నివాసం సమీపంలోని ఓ స్థలంలో పద్మ, రోస్లిన్గా గుర్తించబడిన ఇద్దరు మహిళల అవశేషాలు బయటపడ్డాయి. డబ్బు కోసం ప్రలోభపెట్టి ఇద్దరు మహిళలను క్రూరంగా హత్య చేసిన నరబలి కేసులో ప్రధాన నిందితుడు మహ్మద్ షఫీని విచారిస్తున్నట్లు కొచ్చి పోలీస్ కమిషనర్ ధ్రువీకరించారు.
తాజావార్తలు
-
Rahman : ‘పెద్ది’ ఆ కోరిక తీర్చింది!
-
Ram Charan: నా కెరీర్లోనే ‘పెద్ది’ నంబర్ వన్ చిత్రం
-
AP Film Corporation: ఏపీ ఫిల్మ్ కార్పొరేషన్ నూతన బోర్డు ఏర్పాటు
-
OTR : పాలమూరు కాంగ్రెస్లో రచ్చ రచ్చ.. సిటీ ప్రెసిడెంట్ పదవి కోసం కుమ్ములాట!
-
Wife Murder: బీమా డబ్బుల కోసం.. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను కొట్టి చంపేసిన కీచక భర్త..!
ట్రెండింగ్
-
iPhone Users Alert: వెలుగులోకి కొత్త ఫిషింగ్ మోసం.. అలర్ట్ జారీ చేసిన కేంద్రం.!
-
Early Age S*ex Results: చిన్న వయసులోనే శృంగారం.. ఈ సమస్యలు తప్పవా.?
-
Natural Home Remedy: తెల్ల జుట్టుకు సింపుల్ “హోమ్ రెమిడీ”.. ఆ మూడు పదార్థాలతో ఉంటే చాలు.. నేచురల్గా హెయిర్ కలర్ రెడీ.!
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?