Haryana-Punjab: శంభు సరిహద్దును వారంలోపు తెరవాలని కోర్టు ఆదేశం..
- నూతన రైతు చట్టాలను వ్యతిరేకంగా ఈ ఏడాది ఫిబ్రవరి 10న ఢిల్లీకి మార్చ్ ప్రకటించిన రైతు సంఘాలు
- పంజాబ్- హర్యానాలోని శంభు సరిహద్దును బారికేడ్లతో మూసిన ప్రభుత్వం
- రైతులను అక్కడే అడ్డుకున్న పోలీసులు
- ఆ సరిహద్దును వారంలోపు తెరవాలని హైకోర్టు ఆదేశం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కేంద్ర ప్రవేశ పెట్టిన నూతన రైతు చట్టాలను వ్యతిరేకిస్తూ.. ఫిబ్రవరి 10, 2024న.. కొన్ని రైతు సంఘాలు ఢిల్లీకి మార్చ్ని ప్రకటించాయి. దీంతో హర్యానా ప్రభుత్వం పంజాబ్ మరియు హర్యానాలోని శంభు సరిహద్దును బారికేడ్ల సహాయంతో మూసివేసింది. రైతులను హర్యానా సరిహద్దులో పోలీసులు అడ్డుకున్నారు. అప్పటి నుంచి ఆ సరిహద్దు మూతపడి ఉంది. కాగా.. ఈ సరిహద్దును తెరవాలని చాలా మంది కోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. తాజాగా హర్యానా-పంజాబ్ హైకోర్టు ఈ సరిహద్దుపై తన తీర్పును ఇచ్చింది. శంభు సరిహద్దును వారంలోపు తెరవాలని పేర్కొంది. శంభు సరిహద్దు వద్ద ఏర్పాటు చేసిన బారికేడ్లను 7 రోజుల్లోగా తొలగించాలని హర్యానా ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
READ MORE: Minister PRO committed suicide: మంత్రి పీఆర్వో ఆత్మహత్య.. కారణం ఇదే..
Also Read
- Free Flight Journey: వారికి భారీ శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. ఒక రోజు ఉచిత విమాన ప్రయాణం..
- Indus Waters Treaty: సింధు జలాల ఒప్పందంపై పాకిస్తాన్కు కెనడా షాక్..
- Kavya Maran: పాకిస్థాన్ క్రికెటర్ను కొనుగోలు చేయడంపై చెలరేగిన రచ్చ.. కావ్య మారన్ రియాక్షన్ ఇదే!
- Gold In Bag: అలిపిరిలో దొరికిన బంగారం బ్యాగ్.. సీసీటీవీ పరిశీలించిన అధికారులు..
సరిహద్దుపై దాఖలైన పిటిషనర్ల తరఫు న్యాయవాది వాసు రంజన్ శాండిల్య మీడియాతో మాట్లాడుతూ.. చాలా కాలం క్రితమే సరిహద్దును తెరవాలని తమ తరపున పిటిషన్ దాఖలయ్యిందన్నారు. అందులో మూసివేతకు కారణమేమిటని పేర్కొన్నారు. శంభు సరిహద్దు కావడంతో అంబాలా వ్యాపారులు తీవ్ర నష్టాలను చవిచూశారని.. పస్తులుండే పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. ఈ కోర్టు తీర్పుతో పంజాబ్, హర్యానా, హిమాచల్, జమ్మూ కాశ్మీర్ వ్యాపారులకు మళ్లీ కొత్త జీవితం లభించినట్లయ్యిందని వెల్లడించారు. “గతంతో పోలిస్తే పరిస్థితి చాలా మారిపోయింది. ఇప్పుడు ఆందోళనకారుల సంఖ్య కూడా తగ్గింది. పోలీసులతో పాటు, లా అండ్ ఆర్డర్ను కాపాడాలి. రైతులను కూడా కాపాడాల్సిన అవసరం ఉంది.” అని కోర్టు పోలీసు శాఖను ఆదేశించింది. పంజాబ్ మరియు హర్యానా కూడా శాంతిభద్రతలను జాగ్రత్తగా చూసుకోవాలని సూచించింది.
తాజావార్తలు
-
Shamshabad : ఇండిగో ఉద్యోగినిపై క్యాబ్ డ్రైవర్ అత్యాచారయత్నం..!
-
Free Flight Journey: వారికి భారీ శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. ఒక రోజు ఉచిత విమాన ప్రయాణం..
-
Minister Seethakka : ములుగు టూర్కు వెళ్తున్నారా? మంత్రి సీతక్క కీలక హెచ్చరిక.!
-
Indus Waters Treaty: సింధు జలాల ఒప్పందంపై పాకిస్తాన్కు కెనడా షాక్..
-
Kavya Maran: పాకిస్థాన్ క్రికెటర్ను కొనుగోలు చేయడంపై చెలరేగిన రచ్చ.. కావ్య మారన్ రియాక్షన్ ఇదే!
ట్రెండింగ్
-
Cleaning Hacks : తుప్పు పట్టిన ఇనుప అల్మారా కొత్తదానిలా మెరవాలా? ఈ 4 చిట్కాలు చాలు.!
-
Remote Cleaning : వర్షాల్లో టీవీ రిమోట్ పనిచేయడం లేదా? ఈ 4 ట్రిక్స్తో కొత్తదానిలా మారుతుంది.!
-
Food Storage Tips : వంట నూనె ఇలా నిల్వ చేస్తే విషమే.! ఈ 5 సంకేతాలు కనిపిస్తే వెంటనే పారేయండి
-
Kitchen Tips : పుట్టగొడుగులు 2 రోజుల్లో పాడవుతున్నాయా? ఈ సీక్రెట్ ట్రిక్తో వారాల పాటు ఫ్రెష్.!
-
Sanju Samson: రోహిత్ భాయ్ సారీ.. నిన్ను నేను నమ్మలేదు.. సంజు ఆసక్తికర వ్యాఖ్యలు!