Haryana-Punjab: శంభు సరిహద్దును వారంలోపు తెరవాలని కోర్టు ఆదేశం..
- నూతన రైతు చట్టాలను వ్యతిరేకంగా ఈ ఏడాది ఫిబ్రవరి 10న ఢిల్లీకి మార్చ్ ప్రకటించిన రైతు సంఘాలు
- పంజాబ్- హర్యానాలోని శంభు సరిహద్దును బారికేడ్లతో మూసిన ప్రభుత్వం
- రైతులను అక్కడే అడ్డుకున్న పోలీసులు
- ఆ సరిహద్దును వారంలోపు తెరవాలని హైకోర్టు ఆదేశం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కేంద్ర ప్రవేశ పెట్టిన నూతన రైతు చట్టాలను వ్యతిరేకిస్తూ.. ఫిబ్రవరి 10, 2024న.. కొన్ని రైతు సంఘాలు ఢిల్లీకి మార్చ్ని ప్రకటించాయి. దీంతో హర్యానా ప్రభుత్వం పంజాబ్ మరియు హర్యానాలోని శంభు సరిహద్దును బారికేడ్ల సహాయంతో మూసివేసింది. రైతులను హర్యానా సరిహద్దులో పోలీసులు అడ్డుకున్నారు. అప్పటి నుంచి ఆ సరిహద్దు మూతపడి ఉంది. కాగా.. ఈ సరిహద్దును తెరవాలని చాలా మంది కోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. తాజాగా హర్యానా-పంజాబ్ హైకోర్టు ఈ సరిహద్దుపై తన తీర్పును ఇచ్చింది. శంభు సరిహద్దును వారంలోపు తెరవాలని పేర్కొంది. శంభు సరిహద్దు వద్ద ఏర్పాటు చేసిన బారికేడ్లను 7 రోజుల్లోగా తొలగించాలని హర్యానా ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
READ MORE: Minister PRO committed suicide: మంత్రి పీఆర్వో ఆత్మహత్య.. కారణం ఇదే..
Also Read
- International Tea Day: మీరు ప్రతిరోజూ తాగే చాయ్ నిజంగా ఆరోగ్యకరమేనా..?
- Who is Abhijit Dipke: ఎవరీ అభిజీత్ దీప్కే?.. అమెరికా నుంచి రాజకీయం చేస్తున్న "కాక్రోచ్ జనతా పార్టీ" వెనుక మాస్టర్మైండ్!
- KTR: “కేబినెట్ సమావేశంలోనైనా కళ్లు తెరవండి”.. సీఎం రేవంత్కి కేటీఆర్ లేఖ
- Helmet and Hair Loss: హెల్మెట్ వల్ల నిజంగా జుట్టు రాలుతుందా..? వైద్యులు చెప్పిన అసలు నిజం ఇదే..
సరిహద్దుపై దాఖలైన పిటిషనర్ల తరఫు న్యాయవాది వాసు రంజన్ శాండిల్య మీడియాతో మాట్లాడుతూ.. చాలా కాలం క్రితమే సరిహద్దును తెరవాలని తమ తరపున పిటిషన్ దాఖలయ్యిందన్నారు. అందులో మూసివేతకు కారణమేమిటని పేర్కొన్నారు. శంభు సరిహద్దు కావడంతో అంబాలా వ్యాపారులు తీవ్ర నష్టాలను చవిచూశారని.. పస్తులుండే పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. ఈ కోర్టు తీర్పుతో పంజాబ్, హర్యానా, హిమాచల్, జమ్మూ కాశ్మీర్ వ్యాపారులకు మళ్లీ కొత్త జీవితం లభించినట్లయ్యిందని వెల్లడించారు. “గతంతో పోలిస్తే పరిస్థితి చాలా మారిపోయింది. ఇప్పుడు ఆందోళనకారుల సంఖ్య కూడా తగ్గింది. పోలీసులతో పాటు, లా అండ్ ఆర్డర్ను కాపాడాలి. రైతులను కూడా కాపాడాల్సిన అవసరం ఉంది.” అని కోర్టు పోలీసు శాఖను ఆదేశించింది. పంజాబ్ మరియు హర్యానా కూడా శాంతిభద్రతలను జాగ్రత్తగా చూసుకోవాలని సూచించింది.
తాజావార్తలు
-
Apple: ఆపిల్ వాచ్ & ఎయిర్పాడ్స్ ప్రోలో.. కొత్త ఆరోగ్య ఫీచర్లు వచ్చేశాయ్!
-
International Tea Day: మీరు ప్రతిరోజూ తాగే చాయ్ నిజంగా ఆరోగ్యకరమేనా..?
-
Hardik Pandya-BCCI: హార్దిక్ పాండ్యాకు బీసీసీఐ భారీ షాక్!
-
Who is Abhijit Dipke: ఎవరీ అభిజీత్ దీప్కే?.. అమెరికా నుంచి రాజకీయం చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ” వెనుక మాస్టర్మైండ్!
-
KTR: “కేబినెట్ సమావేశంలోనైనా కళ్లు తెరవండి”.. సీఎం రేవంత్కి కేటీఆర్ లేఖ
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!