Delhi: మహిళా రెజ్లర్ లైంగిక వేధింపుల కేసులో బాధితురాలికి కోర్టు సమన్లు..
- లైంగిక వేధింపుల కేసుపై ఢిల్లీలోని రూస్ అవెన్యూ కోర్టులో విచారణ
- బాధితురాలికి సమన్లు జారీ చేసిన కోర్టు
- 14లోగా తన వాంగ్మూలాన్ని కోర్టు ముందు నమోదు చేయాలని ఆదేశం
- ఆమె విదేశాల్లో ఉన్నరని తెలిపిన న్యాయవాది
రెజ్లింగ్ అసోసియేషన్లో మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపుల కేసుపై ఢిల్లీలోని రూస్ అవెన్యూ కోర్టులో విచారణ జరిగింది. విచారణ సమయంలో హాజరు కానందుకు బాధితురాలు సాక్షికి కోర్టు సమన్లు జారీ చేసింది. నవంబర్ 14 లోగా కోర్టులో సాక్ష్యాలను దాఖలు చేయాలని ఆదేశించింది. ఈ కేసులో గతంలో కూడా బాధితురాలికి సమన్లు జారీ చేశారు. ప్రస్తుతం ఆమె దేశంలో లేరని, అందుకే ఇక్కడికి రాలేనని బాధితురాలి తరఫు లాయర్ కోర్టుకు తెలిపారు. వచ్చే నెలలో జరిగే ఛాంపియన్షిప్కు హాజరయ్యేందుకు సాక్షి విదేశాలకు వెళ్లారని చెప్పారు. మరో రెండు నెలల పాటు ఆమె అక్కడే ఉంటారని పేర్కొన్నారు. దీనిపై ఢిల్లీ పోలీసులు ఆమెకు సమన్లు జారీ చేయాలని కోర్టును ఆశ్రయించారు. పోలీసుల డిమాండ్ను అంగీకరించిన కోర్టు.. నవంబర్ 14లోగా తన వాంగ్మూలాన్ని కోర్టు ముందు నమోదు చేయాలని బాధితురాలిని ఆదేశించింది.
READ MORE: Health: మొలకలు వచ్చిన ఆలుగడ్డ తింటున్నారా..? ఎంత ప్రమాదకరమంటే
Also Read
- Petrol Price: బిగ్ షాక్.. లీటర్ పెట్రోల్పై రూ.25, డీజిల్పై రూ.28 రాత్రికి రాత్రే పెంపు..?
- Storyboard : తమిళనాడు రాజకీయం ఎలా ఉంది..? టీవీకే తో విజయ్ ఏం చేయబోతున్నారు..?
- Amazon Great India Summer Sale: అమెజాన్ సమ్మర్ సేల్లో.. ల్యాప్టాప్లు, స్మార్ట్ఫోన్లు సగం కంటే తక్కువ ధరకే!
- Telangana : పోలీస్ శాఖలో భారీ పదోన్నతులు.. సజ్జనార్, మహేష్ భగవత్ లకు డీజీపీ హోదా..!
కోర్టులో విచారణ సందర్భంగా.. ఆరోపణలు చేస్తున్న మహిళా రెజ్లర్లందరూ బ్రిజ్ భూషణ్ సింగ్ ముందు మాత్రమే కోర్టులో తమ వాంగ్మూలం ఇవ్వాలని బ్రిజ్ భూషణ్ తరఫు న్యాయవాది తెలిపారు. అలా జరగని పక్షంలో ఆయన లాయర్ ముందు వాంగ్మూలాన్ని నమోదు చేయాలన్నారు. కాగా.. ఈ కేసులో తదుపరి విచారణను నవంబర్ 14వ తేదీకి కోర్టు వాయిదా వేసింది. ఈరోజు ఈ కేసులో బాధితులైన ఇద్దరు రెజ్లర్లు తమ తరపున వాదించేందుకు కొత్త న్యాయవాదిని నియమించారు.
READ MORE: Maharashtra polls: ఇండియా కూటమికి షాక్.. చివరి నిమిషంలో కాంగ్రెస్ అభ్యర్థి నామినేషన్ విత్డ్రా
తాజావార్తలు
-
Off The Record : ఘోష్ కమిషన్ రిపోర్ట్ ఆధారంగా చర్యలు వద్దన్న హైకోర్ట్
-
Petrol Price: బిగ్ షాక్.. లీటర్ పెట్రోల్పై రూ.25, డీజిల్పై రూ.28 రాత్రికి రాత్రే పెంపు..?
-
Asian Games: ‘ఆసియా క్రీడల’ ప్రత్యక్ష ప్రసారం సోనీ నెట్వర్క్ చేతికి.. యాప్లో కూడా..
-
Storyboard : తమిళనాడు రాజకీయం ఎలా ఉంది..? టీవీకే తో విజయ్ ఏం చేయబోతున్నారు..?
-
Amazon Great India Summer Sale: అమెజాన్ సమ్మర్ సేల్లో.. ల్యాప్టాప్లు, స్మార్ట్ఫోన్లు సగం కంటే తక్కువ ధరకే!
ట్రెండింగ్
-
Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!
-
Mirchi Bajji Recipe: పర్ఫెక్ట్ గా, బండిమీద టేస్ట్ రావాలంటే మిరపకాయ బజ్జీ పిండి ఇలా కలిపి వేయండి.. లొట్టలేసుకుంటూ తినాల్సిందే.!
-
భారీ బ్యాటరీ + స్లిమ్ డిజైన్, రఫ్ & టఫ్ ఫోన్ Motorola Edge 70 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
200MP+200MP కెమెరాలు, IP66, IP68, IP69 రేటింగ్స్, 7025mAh బ్యాటరీతో ప్రీమియం ఫోన్ OPPO Find X9s Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
కాంపాక్ట్ డిజైన్, 8000mAh బ్యాటరీతో OPPO Pad Mini లాంచ్.. ధర ఎంతంటే.?