Extramarital Affairs: ఆయనకు నలుగురు, ఆమెకు ఐదుగురు పిల్లలు.. లేచిపోయి పెళ్లి చేసుకున్నారు..
- యూపీలో తొమ్మిది మంది పిల్లలను వదిలి లేచిపోయి పెళ్లి చేసుకున్న ఓ జంట..
- పెళ్లి చేసుకున్న ఫోటోలను ఫేస్బుక్ పోస్ట్ చేసిన గోపాల్ అనే వ్యక్తి..
- నా భార్య డబ్బు, బంగారం తీసుకుని పారిపోయిందని గీత భర్త ఆరోపణలు..
- తన భర్త చనిపోయాడు.. ఆస్తిలో వాటా ఇవ్వాలని కోరిన గోపాల్ భార్య..
Extramarital Affairs: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని సిద్ధార్థనగర్ లో వివాహేతర సంబంధం పెట్టుకున్న ఒక జంట లేచిపోయి పెళ్లి చేసుకున్నారు. వివరాల్లోకి వెళితే.. మహారియా గ్రామానికి చెందిన గీత అనే వివాహితకు ఐదుగురు పిల్లల ఉన్నారు.. ఇక, అదే గ్రామానికి చెందిన గోపాల్ కి నలుగురు పిల్లల ఉన్నారు.. వీరి మధ్య గత కొంతకాలంగా అక్రమ సంబంధం కొనసాగింది. ఇక, పారిపోయి పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నదే తడువుగా ఇరువురు.. తమ జీవిత భాగస్వాములను, మొత్తం తొమ్మిది మంది పిల్లలను వదిలి వెళ్లిపోయి పెళ్లి చేసుకున్నారు.. ఆ ఫోటోను ఏప్రిల్ 5వ తేదీన గోపాల్ తన ఫేస్బుక్ ఖాతాలో పోస్ట్ చేశాడు.
Read Also: Israel: అమెరికా రాయబారిగా మైక్ హకబీ నియామకం.. నెతన్యాహు అభినందనలు
Also Read
- Santosh Goyal Story: విధి వంచించిన మేధావి.. ఈ పీహెచ్డీ స్కాలర్ పరిస్థితి చూస్తే కన్నీళ్లు ఆగవు..
- AP Liquor Scam Case: లిక్కర్ స్కామ్లో కీలక మలుపు.. రంగంలోకి దిగిన ఐటీ అధికారులు
- Vijay: ఆలయాల బాట పట్టిన విజయ్.. టీవీకే శ్రేణుల్లో నూతనోత్సాహం
- Minister Gottipati Ravikumar: విద్యుత్ కోతలకు నో.. నిరంతర సరఫరా ఉండాల్సిందే.. మంత్రి గొట్టిపాటి ఆదేశాలు
ఇక, గోపాల్ ఫేస్బుక్ ఖాతాలో పెళ్లి ఫోటోలు చూసిన గ్రామస్తులు వాటిని గీత భర్త శ్రీచంద్ కు, గోపాల్ భార్యకు చూపించారు. దీంతో రెండు కుటుంబాలలో తీవ్ర గందరగోళం ఏర్పడింది. గీత అత్తమామలుమాట్లాడుతూ.. తమ కుటుంబంలో విభేదాలు రావడంతో మా కొడలు తన తల్లిదండ్రుల ఇంటికి వెళ్లిపోయిందని అనుకున్నామన్నారు.. కానీ, ఇలా నా కొడుకును మోసం చేసి మరో వ్యక్తితో లేచిపోవడం దారుణం అన్నారు. మా కొడుకు ముంబైలో వడ పావ్ అమ్మి తమ కుటుంబాన్ని పోషించాడని చెప్పుకొచ్చారు. ఇక, గీత భర్త శ్రీచంద్ మాట్లాడుతూ.. నేను కష్టపడి సంపాదించిన రూ.90 వేల డబ్బు, బంగారం తీసుకుని పారిపోయిందని ఆరోపించాడు. ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేస్తానని వెల్లడించాడు.
Read Also: Vontimitta: రేపే ఒంటిమిట్ట కోదండరాముడి కల్యాణోత్సవం.. పట్టు వస్త్రాలు సమర్పించునున్న సీఎం..
అలాగే, గోపాల్ భార్య మాట్లాడుతూ.. నా భర్త “చనిపోయాడని” ప్రకటించింది. గోపాల్ ఎక్కడైనా జీవించవచ్చు, కానీ నా పిల్లలు భవిష్యత్ కోసం అతడి ఆస్తిలో వాటా ఇవ్వాలని డిమాండ్ చేసింది. ఇక, పిల్లల పెంపకం కోసం ఆయన ఆర్థికంగా బాధ్యత వహించాలని తేల్చి చెప్పింది. కాగా, ఈ ఘటనపై సిద్ధార్థ్ నగర్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ అనుజ్ సింగ్ మాట్లాడుతూ.. గోపాల్- గీత లేచిపోయి పెళ్లి చేసుకున్న విషయం తనకు తెలుసు.. కానీ, దీనిపై ఇంకా ఎటువంటి ఫిర్యాదులు అందలేదని అన్నారు. ఈ విషయంపై మాకు ఏదైనా ఫిర్యాదు అందితే, చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు.
తాజావార్తలు
-
Santosh Goyal Story: విధి వంచించిన మేధావి.. ఈ పీహెచ్డీ స్కాలర్ పరిస్థితి చూస్తే కన్నీళ్లు ఆగవు..
-
AP Liquor Scam Case: లిక్కర్ స్కామ్లో కీలక మలుపు.. రంగంలోకి దిగిన ఐటీ అధికారులు
-
iQOO Z11 & Z11x: ఐకూ Z11 సిరీస్ గ్లోబల్ లాంచ్ కన్ఫర్మ్.. ఫీచర్లు, స్పెసిఫికేషన్స్ వివరాలు
-
Vijay: ఆలయాల బాట పట్టిన విజయ్.. టీవీకే శ్రేణుల్లో నూతనోత్సాహం
-
Minister Gottipati Ravikumar: విద్యుత్ కోతలకు నో.. నిరంతర సరఫరా ఉండాల్సిందే.. మంత్రి గొట్టిపాటి ఆదేశాలు
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!