Extramarital Affairs: ఆయనకు నలుగురు, ఆమెకు ఐదుగురు పిల్లలు.. లేచిపోయి పెళ్లి చేసుకున్నారు..
- యూపీలో తొమ్మిది మంది పిల్లలను వదిలి లేచిపోయి పెళ్లి చేసుకున్న ఓ జంట..
- పెళ్లి చేసుకున్న ఫోటోలను ఫేస్బుక్ పోస్ట్ చేసిన గోపాల్ అనే వ్యక్తి..
- నా భార్య డబ్బు, బంగారం తీసుకుని పారిపోయిందని గీత భర్త ఆరోపణలు..
- తన భర్త చనిపోయాడు.. ఆస్తిలో వాటా ఇవ్వాలని కోరిన గోపాల్ భార్య..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Extramarital Affairs: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని సిద్ధార్థనగర్ లో వివాహేతర సంబంధం పెట్టుకున్న ఒక జంట లేచిపోయి పెళ్లి చేసుకున్నారు. వివరాల్లోకి వెళితే.. మహారియా గ్రామానికి చెందిన గీత అనే వివాహితకు ఐదుగురు పిల్లల ఉన్నారు.. ఇక, అదే గ్రామానికి చెందిన గోపాల్ కి నలుగురు పిల్లల ఉన్నారు.. వీరి మధ్య గత కొంతకాలంగా అక్రమ సంబంధం కొనసాగింది. ఇక, పారిపోయి పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నదే తడువుగా ఇరువురు.. తమ జీవిత భాగస్వాములను, మొత్తం తొమ్మిది మంది పిల్లలను వదిలి వెళ్లిపోయి పెళ్లి చేసుకున్నారు.. ఆ ఫోటోను ఏప్రిల్ 5వ తేదీన గోపాల్ తన ఫేస్బుక్ ఖాతాలో పోస్ట్ చేశాడు.
Read Also: Israel: అమెరికా రాయబారిగా మైక్ హకబీ నియామకం.. నెతన్యాహు అభినందనలు
Also Read
- Vaibhav Sooryavanshi: బుడ్డోడికి మళ్లీ నిరాశే.. ఇంగ్లండ్తో తొలి టీ20లోనూ 'నో ఛాన్స్'.!
- Pawan Kalyan: సోషల్ మీడియా దుర్వినియోగంపై ఉక్కుపాదం మోపుతాం.. ‘ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్’ పేరుతో దూషణలు ఇక కుదరవు.!
- US: అమెరికాలో విషాదం.. ఆకస్మిక వరదల్లో ఏపీ యువకుడు మృతి
- Ishan Kishan: ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్లో పేలిన పాకెట్ డైనమెట్.. నెం.1 బ్యాటర్గా ఇషాన్ కిషన్.!
ఇక, గోపాల్ ఫేస్బుక్ ఖాతాలో పెళ్లి ఫోటోలు చూసిన గ్రామస్తులు వాటిని గీత భర్త శ్రీచంద్ కు, గోపాల్ భార్యకు చూపించారు. దీంతో రెండు కుటుంబాలలో తీవ్ర గందరగోళం ఏర్పడింది. గీత అత్తమామలుమాట్లాడుతూ.. తమ కుటుంబంలో విభేదాలు రావడంతో మా కొడలు తన తల్లిదండ్రుల ఇంటికి వెళ్లిపోయిందని అనుకున్నామన్నారు.. కానీ, ఇలా నా కొడుకును మోసం చేసి మరో వ్యక్తితో లేచిపోవడం దారుణం అన్నారు. మా కొడుకు ముంబైలో వడ పావ్ అమ్మి తమ కుటుంబాన్ని పోషించాడని చెప్పుకొచ్చారు. ఇక, గీత భర్త శ్రీచంద్ మాట్లాడుతూ.. నేను కష్టపడి సంపాదించిన రూ.90 వేల డబ్బు, బంగారం తీసుకుని పారిపోయిందని ఆరోపించాడు. ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేస్తానని వెల్లడించాడు.
Read Also: Vontimitta: రేపే ఒంటిమిట్ట కోదండరాముడి కల్యాణోత్సవం.. పట్టు వస్త్రాలు సమర్పించునున్న సీఎం..
అలాగే, గోపాల్ భార్య మాట్లాడుతూ.. నా భర్త “చనిపోయాడని” ప్రకటించింది. గోపాల్ ఎక్కడైనా జీవించవచ్చు, కానీ నా పిల్లలు భవిష్యత్ కోసం అతడి ఆస్తిలో వాటా ఇవ్వాలని డిమాండ్ చేసింది. ఇక, పిల్లల పెంపకం కోసం ఆయన ఆర్థికంగా బాధ్యత వహించాలని తేల్చి చెప్పింది. కాగా, ఈ ఘటనపై సిద్ధార్థ్ నగర్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ అనుజ్ సింగ్ మాట్లాడుతూ.. గోపాల్- గీత లేచిపోయి పెళ్లి చేసుకున్న విషయం తనకు తెలుసు.. కానీ, దీనిపై ఇంకా ఎటువంటి ఫిర్యాదులు అందలేదని అన్నారు. ఈ విషయంపై మాకు ఏదైనా ఫిర్యాదు అందితే, చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు.
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: బుడ్డోడికి మళ్లీ నిరాశే.. ఇంగ్లండ్తో తొలి టీ20లోనూ ‘నో ఛాన్స్’.!
-
ENG vs IND 1st T20: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్! ప్లేయింగ్ XI లో ఎవరెవరంటే?
-
Kayadu Lohar: అందుకే హిట్లున్నా లేకున్నా వరుస ఆఫర్లు!
-
Pawan Kalyan: సోషల్ మీడియా దుర్వినియోగంపై ఉక్కుపాదం మోపుతాం.. ‘ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్’ పేరుతో దూషణలు ఇక కుదరవు.!
-
US: అమెరికాలో విషాదం.. ఆకస్మిక వరదల్లో ఏపీ యువకుడు మృతి
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 10,000mAh బ్యాటరీతో Vivo Pad 5c ఎంట్రీ.. ధర ఎంతంటే?
-
Lenovo నుంచి డబుల్ ధమాకా.. Tab Plus Gen 2, LOQ మానిటర్ సిరీస్ లాంచ్.!
-
Fluffy Omelette: రెగ్యులర్ ఆమ్లెట్కు బదులుగా.. స్పాంజీలా ఉండే ‘ఫ్లఫీ ఆమ్లెట్’ చేసేయండి ఇలా.! లొట్టలేసుకుని తింటారంతే.!
-
Air Fryer vs Stove Cooking: ఎయిర్ ఫ్రయర్ Vs స్టవ్ వంట.. ఆరోగ్యానికి ఏది మంచిది.?
-
అందుబాటులోకి Aadhaar App కొత్త వెర్షన్..ఫేస్ ఆథెంటికేషన్, మొబైల్ నంబర్ అప్డేట్లతో పాటు మరిన్ని సేవలు.!