Shocking Survey : కాపురాలు కటకట.. చిచ్చుపెడుతున్న సెల్ఫోన్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి నిద్రపోయేవరకు దినచర్యలో సెల్ఫోన్ భాగమైపోయింది. సెల్ఫోన్ లేకుండా ఏపనీ కాదు అని ఇప్పటి యువత అంటున్నారు. అందులో నిజం లేకపోలేదు. టెక్నాలజీ పెరిగిపోవడంలో చరవాణిని చేతిలో పెట్టకొని ప్రపంచాన్నే గూగుల్ చేస్తున్నారు. అయితే.. తాజాగా నిర్వహించిన సర్వేల్లో.. దంపతుల మధ్య సెల్ ఫోన్ చిచ్చుపెడుతోందని తేలింది. వారి భాగస్వాములతో మాట్లాడే సమయంలోనూ సెల్ఫోన్ ‘సవితి’ పాత్ర పోషిస్తోందనేది తెలుస్తోంది.
Also Read : Pavitra Lokesh: పవిత్ర- నరేష్ కేసులో కొత్త ట్విస్ట్.. వారికి దబిడిదిబిడే
పెళ్లయిన 10 మందిలో 8 మంది భారతీయులు స్మార్ట్ఫోన్లు సంబంధాలను దెబ్బతీస్తున్నట్లు భావిస్తున్నారు. స్మార్ట్ఫోన్లు జంటల మధ్య సహజ సంభాషణలను దెబ్బతీస్తున్నాయి. 10 మంది వివాహిత భారతీయులలో 8 మంది కంటే ఎక్కువ మంది మొబైల్ల అధిక వినియోగం తమ సంబంధాలను తీవ్రంగా దెబ్బతీస్తున్నట్లు సోమవారం ఒక కొత్త అధ్యయనం తెలిపింది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, 67 శాతం మంది ప్రజలు తమ జీవిత భాగస్వామితో సమయం గడుపుతున్నప్పుడు కూడా తమ ఫోన్లలో ఉన్నట్లు ఒప్పుకున్నారు.
Also Read
- Supreme Court: మహిళకు ఉద్యోగం నిరాకరించినందుకు పనిష్మెంట్.. రూ.12 లక్షలు పరిహారం చెల్లించాలని తీర్పు
- Third Front: దేశంలో ‘‘థర్డ్ ఫ్రంట్’’.. కనిమొళి వరస భేటీలతో కొత్త చర్చ..
- Marital Rape: వైవాహిక అత్యాచారంపై సుప్రీంకోర్టు కీలక విచారణ.. తెగే పంచాయితీనేనా?
- Pakistan: అరేబియా సముద్రంలో భారత్-పాక్ నేవీ ఢీ.. చైనా వ్యూహాలపై అనుమానం.!
అధ్యయనం ప్రకారం.. మితిమీరిన స్మార్ట్ఫోన్ వాడకంతో, 66 శాతం మంది తమ పాట్నర్తో వారి సంబంధం బలహీనపడిందని చెప్పారు. సైబర్మీడియా రీసెర్చ్ (CMR)తో కలిసి వివో (Vivo) ఓ సర్వే చేసింది. స్మార్ట్ఫోన్లలో అతిగా వాడటం వల్ల 70 శాతం మంది వ్యక్తులు తమ స్మార్ట్ఫోన్లో నిమగ్నమై ఉన్నప్పుడు తమ జీవిత భాగస్వామి వారికి అంతరాయం కలిగిస్తే చిరాకు పడతారని అంగీకరించారు.
Also Read : Harish Rao : ప్రేమ, ఆప్యాయతతో పేషెంట్లకు చికిత్స అందించండి
వివో ఇండియా హెడ్ బ్రాండ్ స్ట్రాటజీ యోగేంద్ర శ్రీరాముల మాట్లాడుతూ.. “నేటి జీవితంలో స్మార్ట్ఫోన్ యొక్క ప్రాముఖ్యత నిస్సందేహంగా ఉంది. అయితే అధిక వినియోగం వినియోగదారులు జాగ్రత్తగా ఉండాల్సిన అంశంగా మిగిలిపోయింది.’ అని ఆయన అన్నారు. అయితే. భారతదేశంలో 1.2 బిలియన్లకు పైగా మొబైల్ ఫోన్ వినియోగదారులు మరియు 600 మిలియన్ల స్మార్ట్ఫోన్ వినియోగదారులు ఉన్నారు. అధ్యయనం ప్రకారం, వివాహిత జంటలు తమ భాగస్వాములతో సంభాషణలో ఎక్కువగా పరధ్యానంలో ఉంటారని, 69 శాతం మంది తమ జీవిత భాగస్వాములతో సంభాషించేటప్పుడు తగినంత శ్రద్ధ వహించడం లేదని ఒప్పుకున్నారు.
భారతీయులు సమస్యలను అంగీకరిస్తున్నారు. వారి స్మార్ట్ఫోన్తో ఉన్నప్పుడు ప్రవర్తనను మార్చుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. దాదాపు 88 శాతం మంది ప్రజలు తమ జీవిత భాగస్వాములతో అర్థవంతమైన సంభాషణల కోసం ఎక్కు సమయాన్ని కేటాయించాలనుకుంటున్నారని అధ్యయనం తెలిపింది.
తాజావార్తలు
-
OTR : అనకాపల్లి జిల్లాలో సీఎం రమేష్ వర్సెస్ గుడివాడ అమర్నాథ్
-
Story Board : డీలిమిటేషన్ పై కేంద్రం వ్యూహమేంటి..? తెలుగు రాష్ట్రాల్లో ఏం జరుగుతుంది..?
-
CM Revanth Reddy :హైదరాబాద్లో హార్వర్డ్ కోర్సులు.. డిసెంబర్ నుంచే క్లాసులు
-
Telangana SIR : ఓటర్లకు ఈసీ గుడ్న్యూస్.. నోటీసులకు ఇక ఇలా స్పందించొచ్చు
-
Supreme Court: మహిళకు ఉద్యోగం నిరాకరించినందుకు పనిష్మెంట్.. రూ.12 లక్షలు పరిహారం చెల్లించాలని తీర్పు
ట్రెండింగ్
-
Samsung Phones: పర్సుకి ఫోన్కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!