Shocking Survey : కాపురాలు కటకట.. చిచ్చుపెడుతున్న సెల్ఫోన్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి నిద్రపోయేవరకు దినచర్యలో సెల్ఫోన్ భాగమైపోయింది. సెల్ఫోన్ లేకుండా ఏపనీ కాదు అని ఇప్పటి యువత అంటున్నారు. అందులో నిజం లేకపోలేదు. టెక్నాలజీ పెరిగిపోవడంలో చరవాణిని చేతిలో పెట్టకొని ప్రపంచాన్నే గూగుల్ చేస్తున్నారు. అయితే.. తాజాగా నిర్వహించిన సర్వేల్లో.. దంపతుల మధ్య సెల్ ఫోన్ చిచ్చుపెడుతోందని తేలింది. వారి భాగస్వాములతో మాట్లాడే సమయంలోనూ సెల్ఫోన్ ‘సవితి’ పాత్ర పోషిస్తోందనేది తెలుస్తోంది.
Also Read : Pavitra Lokesh: పవిత్ర- నరేష్ కేసులో కొత్త ట్విస్ట్.. వారికి దబిడిదిబిడే
పెళ్లయిన 10 మందిలో 8 మంది భారతీయులు స్మార్ట్ఫోన్లు సంబంధాలను దెబ్బతీస్తున్నట్లు భావిస్తున్నారు. స్మార్ట్ఫోన్లు జంటల మధ్య సహజ సంభాషణలను దెబ్బతీస్తున్నాయి. 10 మంది వివాహిత భారతీయులలో 8 మంది కంటే ఎక్కువ మంది మొబైల్ల అధిక వినియోగం తమ సంబంధాలను తీవ్రంగా దెబ్బతీస్తున్నట్లు సోమవారం ఒక కొత్త అధ్యయనం తెలిపింది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, 67 శాతం మంది ప్రజలు తమ జీవిత భాగస్వామితో సమయం గడుపుతున్నప్పుడు కూడా తమ ఫోన్లలో ఉన్నట్లు ఒప్పుకున్నారు.
Also Read
- ACB Raids: ఆర్అండ్బీ ఈఎన్సీ మోహన్ నాయక్పై ఏసీబీ దాడులు.. 11 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు.!
- Supreme Court: పెళ్లికి ముందు శారీరక బంధంలో ఉంటే క్యారెక్టర్ను తప్పుపట్టలేం.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు!
- West Nile Fever: డెంగ్యూ, మలేరియానే కాదు.. కేరళలో దోమ కాటుతో మరో ప్రాణాంతక వ్యాధి!
- Zojila Tunnel Breakthrough: భారత ఇంజినీరింగ్ అద్భుతం.. 'జోజిలా టన్నెల్ బ్రేక్ త్రూ' ను ప్రారంభించిన కేంద్ర మంత్రి..
అధ్యయనం ప్రకారం.. మితిమీరిన స్మార్ట్ఫోన్ వాడకంతో, 66 శాతం మంది తమ పాట్నర్తో వారి సంబంధం బలహీనపడిందని చెప్పారు. సైబర్మీడియా రీసెర్చ్ (CMR)తో కలిసి వివో (Vivo) ఓ సర్వే చేసింది. స్మార్ట్ఫోన్లలో అతిగా వాడటం వల్ల 70 శాతం మంది వ్యక్తులు తమ స్మార్ట్ఫోన్లో నిమగ్నమై ఉన్నప్పుడు తమ జీవిత భాగస్వామి వారికి అంతరాయం కలిగిస్తే చిరాకు పడతారని అంగీకరించారు.
Also Read : Harish Rao : ప్రేమ, ఆప్యాయతతో పేషెంట్లకు చికిత్స అందించండి
వివో ఇండియా హెడ్ బ్రాండ్ స్ట్రాటజీ యోగేంద్ర శ్రీరాముల మాట్లాడుతూ.. “నేటి జీవితంలో స్మార్ట్ఫోన్ యొక్క ప్రాముఖ్యత నిస్సందేహంగా ఉంది. అయితే అధిక వినియోగం వినియోగదారులు జాగ్రత్తగా ఉండాల్సిన అంశంగా మిగిలిపోయింది.’ అని ఆయన అన్నారు. అయితే. భారతదేశంలో 1.2 బిలియన్లకు పైగా మొబైల్ ఫోన్ వినియోగదారులు మరియు 600 మిలియన్ల స్మార్ట్ఫోన్ వినియోగదారులు ఉన్నారు. అధ్యయనం ప్రకారం, వివాహిత జంటలు తమ భాగస్వాములతో సంభాషణలో ఎక్కువగా పరధ్యానంలో ఉంటారని, 69 శాతం మంది తమ జీవిత భాగస్వాములతో సంభాషించేటప్పుడు తగినంత శ్రద్ధ వహించడం లేదని ఒప్పుకున్నారు.
భారతీయులు సమస్యలను అంగీకరిస్తున్నారు. వారి స్మార్ట్ఫోన్తో ఉన్నప్పుడు ప్రవర్తనను మార్చుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. దాదాపు 88 శాతం మంది ప్రజలు తమ జీవిత భాగస్వాములతో అర్థవంతమైన సంభాషణల కోసం ఎక్కు సమయాన్ని కేటాయించాలనుకుంటున్నారని అధ్యయనం తెలిపింది.
తాజావార్తలు
-
ACB Raids: ఆర్అండ్బీ ఈఎన్సీ మోహన్ నాయక్పై ఏసీబీ దాడులు.. 11 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు.!
-
Supreme Court: పెళ్లికి ముందు శారీరక బంధంలో ఉంటే క్యారెక్టర్ను తప్పుపట్టలేం.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు!
-
Ben Stokes: బెన్ స్టోక్స్ నైట్క్లబ్ వివాదం.. అసలు ఏం జరిగింది?.. భద్రతా సిబ్బందికి కుట్లు పడటానికి కారణమేంటి?
-
West Nile Fever: డెంగ్యూ, మలేరియానే కాదు.. కేరళలో దోమ కాటుతో మరో ప్రాణాంతక వ్యాధి!
-
Peddi : “పెద్ది”పై అల్లు అర్జున్ జెన్యూన్ రివ్యూ… ప్రశంసల వర్షం
ట్రెండింగ్
-
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?
-
Vivo Y31s 5G లాంచ్.. IP69K+ రేటింగ్, 6500mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్ తో అదిరిపోయే ఫీచర్లు.!
-
7.7 మి.మీ. మందం, 5200mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే కేవలం రూ.11,999లకే.. Infinix Smart 20 లాంచ్.!
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!