Shocking Survey : కాపురాలు కటకట.. చిచ్చుపెడుతున్న సెల్ఫోన్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి నిద్రపోయేవరకు దినచర్యలో సెల్ఫోన్ భాగమైపోయింది. సెల్ఫోన్ లేకుండా ఏపనీ కాదు అని ఇప్పటి యువత అంటున్నారు. అందులో నిజం లేకపోలేదు. టెక్నాలజీ పెరిగిపోవడంలో చరవాణిని చేతిలో పెట్టకొని ప్రపంచాన్నే గూగుల్ చేస్తున్నారు. అయితే.. తాజాగా నిర్వహించిన సర్వేల్లో.. దంపతుల మధ్య సెల్ ఫోన్ చిచ్చుపెడుతోందని తేలింది. వారి భాగస్వాములతో మాట్లాడే సమయంలోనూ సెల్ఫోన్ ‘సవితి’ పాత్ర పోషిస్తోందనేది తెలుస్తోంది.
Also Read : Pavitra Lokesh: పవిత్ర- నరేష్ కేసులో కొత్త ట్విస్ట్.. వారికి దబిడిదిబిడే
పెళ్లయిన 10 మందిలో 8 మంది భారతీయులు స్మార్ట్ఫోన్లు సంబంధాలను దెబ్బతీస్తున్నట్లు భావిస్తున్నారు. స్మార్ట్ఫోన్లు జంటల మధ్య సహజ సంభాషణలను దెబ్బతీస్తున్నాయి. 10 మంది వివాహిత భారతీయులలో 8 మంది కంటే ఎక్కువ మంది మొబైల్ల అధిక వినియోగం తమ సంబంధాలను తీవ్రంగా దెబ్బతీస్తున్నట్లు సోమవారం ఒక కొత్త అధ్యయనం తెలిపింది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, 67 శాతం మంది ప్రజలు తమ జీవిత భాగస్వామితో సమయం గడుపుతున్నప్పుడు కూడా తమ ఫోన్లలో ఉన్నట్లు ఒప్పుకున్నారు.
Also Read
- Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
- Nepal Floods: "నువ్వు దేవుడు సామీ".. వరదల్లో 1,643 మంది విద్యార్థుల ప్రాణాలు కాపాడిన ప్రిన్సిపాల్
- Rajamahendravaram: గోదావరిలో హౌస్బోట్.. రాజమహేంద్రవరంలో పర్యాటకానికి ఫుల్ జోష్!
- Smartphone Tips: పాత ఫోన్లను మూలన పడేస్తున్నారా?.. వైర్లెస్ మౌస్గా మార్చేసే సింపుల్ ట్రిక్
అధ్యయనం ప్రకారం.. మితిమీరిన స్మార్ట్ఫోన్ వాడకంతో, 66 శాతం మంది తమ పాట్నర్తో వారి సంబంధం బలహీనపడిందని చెప్పారు. సైబర్మీడియా రీసెర్చ్ (CMR)తో కలిసి వివో (Vivo) ఓ సర్వే చేసింది. స్మార్ట్ఫోన్లలో అతిగా వాడటం వల్ల 70 శాతం మంది వ్యక్తులు తమ స్మార్ట్ఫోన్లో నిమగ్నమై ఉన్నప్పుడు తమ జీవిత భాగస్వామి వారికి అంతరాయం కలిగిస్తే చిరాకు పడతారని అంగీకరించారు.
Also Read : Harish Rao : ప్రేమ, ఆప్యాయతతో పేషెంట్లకు చికిత్స అందించండి
వివో ఇండియా హెడ్ బ్రాండ్ స్ట్రాటజీ యోగేంద్ర శ్రీరాముల మాట్లాడుతూ.. “నేటి జీవితంలో స్మార్ట్ఫోన్ యొక్క ప్రాముఖ్యత నిస్సందేహంగా ఉంది. అయితే అధిక వినియోగం వినియోగదారులు జాగ్రత్తగా ఉండాల్సిన అంశంగా మిగిలిపోయింది.’ అని ఆయన అన్నారు. అయితే. భారతదేశంలో 1.2 బిలియన్లకు పైగా మొబైల్ ఫోన్ వినియోగదారులు మరియు 600 మిలియన్ల స్మార్ట్ఫోన్ వినియోగదారులు ఉన్నారు. అధ్యయనం ప్రకారం, వివాహిత జంటలు తమ భాగస్వాములతో సంభాషణలో ఎక్కువగా పరధ్యానంలో ఉంటారని, 69 శాతం మంది తమ జీవిత భాగస్వాములతో సంభాషించేటప్పుడు తగినంత శ్రద్ధ వహించడం లేదని ఒప్పుకున్నారు.
భారతీయులు సమస్యలను అంగీకరిస్తున్నారు. వారి స్మార్ట్ఫోన్తో ఉన్నప్పుడు ప్రవర్తనను మార్చుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. దాదాపు 88 శాతం మంది ప్రజలు తమ జీవిత భాగస్వాములతో అర్థవంతమైన సంభాషణల కోసం ఎక్కు సమయాన్ని కేటాయించాలనుకుంటున్నారని అధ్యయనం తెలిపింది.
తాజావార్తలు
-
Spy Action Thriller: థియేటర్లలో పట్టించుకోలేదు.. ఓటీటీలో నంబర్ 1 ట్రెండింగ్ లో స్పై యాక్షన్ థ్రిల్లర్
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Nepal Floods: “నువ్వు దేవుడు సామీ”.. వరదల్లో 1,643 మంది విద్యార్థుల ప్రాణాలు కాపాడిన ప్రిన్సిపాల్
-
Suryakumar Yadav: తప్పంతా నాదే.. వన్డే కెరీర్పై సూర్యకుమార్ సంచలన వ్యాఖ్యలు!
-
IIT Deaths: ఐఐటీల్లో ఈ చావులు వెనుక ఉన్న కారణాలేంటి? విద్యార్థులను బలి తీసుకుంటుంది ఎవరు?
ట్రెండింగ్
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!
-
Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!