Punjab CM Bhagawant Mann: మార్చిలోనే అమృత్పాల్ను అరెస్ట్ చేసి ఉండొచ్చు.. కానీ..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Punjab CM Bhagawant Mann: ఒక నెలపాటు సుదీర్ఘమైన వేట తర్వాత ఖలిస్తానీ వేర్పాటువాది అమృతపాల్ సింగ్ను పంజాబ్ పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. మార్చి 18న రాష్ట్రం అమృతపాల్ను అరెస్టు చేసే అవకాశం ఉందని, అయితే రక్తపాతాన్ని నివారించడమే తమ లక్ష్యమని ముఖ్యమంత్రి భగవంత్ మాన్ అన్నారు. మార్చి 18న పంజాబ్ పోలీసులు ఖలిస్తానీ వేర్పాటువాది, అతని సహాయకులపై అణిచివేత ప్రారంభించారు. ఒక్క బుల్లెట్ కూడా పేల్చకుండానే అమృతపాల్ సింగ్ను అరెస్టు చేశారని సీఎం భగవంత్ మాన్ పేర్కొన్నారు. మొత్తం ఎపిసోడ్ను పంజాబ్లో శాంతి, సౌభ్రాతృత్వానికి భంగం కలిగించే లోతైన కుట్ర అని ఆయన అభివర్ణించారు, ముఖ్యమైన వారిని అరెస్టు చేయడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం దానిని భగ్నం చేసిందని అన్నారు.
యువతను ఆయుధాలు తీసుకుని దేశానికి వ్యతిరేకంగా చట్టవిరుద్ధమైన కార్యకలాపాలకు పాల్పడేలా రెచ్చగొట్టే సంస్థను నడిపిన స్వయం ప్రకటిత మత నాయకుడు అమృత్పాల్ సింగ్ను అరెస్టు చేసినట్లు భగవంత్ మాన్ ఆదివారం తెలిపారు. ఏ అమాయకుడిపైనా చర్యలు తీసుకోలేదని స్పష్టం చేశారు.రాష్ట్రానికి, దేశానికి విద్వేషపూరిత శక్తులకు తొత్తుగా ఉన్న అమృత్పాల్ సింగ్ విషయంలో చట్టం తనదైన రీతిలో వ్యవహరిస్తోందని, అమాయకులపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని సీఎం భగవంత్ మాన్ ఒక ప్రకటనలో తెలిపారు. అమృతపాల్ను అరెస్ట్ చేసే ఆపరేషన్ గురించి ఆయన వివరించారు. పరారీలో ఉన్న వారిస్ పంజాబ్ డి చీఫ్ అమృత్పాల్ సింగ్ను పట్టుకునేందుకు శనివారం సాయంత్రం నుంచి చేపట్టిన ఆపరేషన్ గురించి తనకు తెలిసిందని పంజాబ్ సీఎం భగవంత్ మాన్ తెలిపారు. తాను నిద్రలేకుండా గడిపానని, అధికారుల నుంచి ప్రతి 15 నిమిషాలకు ఆపరేషన్కు సంబంధించిన అప్డేట్లను ట్రాక్ చేస్తున్నానని చెప్పారు.
Also Read
- Astrology: ఆగస్టు 10 సోమవారం దినఫలాలు.. ఈ రాశివారికి అనుకోని గుడ్ న్యూస్..
- VVS Laxman: వీవీఎస్ లక్ష్మణ్ ‘నో’ చెప్పడం వల్లే గంభీర్కు ఊహించని అవకాశం.. ఎవరికీ తెలియని సీక్రెట్ రివీల్..
- CM Chandrababu: ‘ప్రియాంక మృతికి కారణమైన వారిపై కఠిన చర్యలు’.. బాధిత కుటుంబానికి రూ. 20 లక్షల ఆర్థిక సాయం..
- New Phones: గూగుల్ నుంచి కొత్త ఫోన్స్.. పిక్సెల్ 11, 11 ప్రో, 11 ప్రో XL , 11 ప్రో ఫోల్డ్.. ఫీచర్స్ అదరహో..
Read Also: Military Level Talks: తూర్పు లడఖ్ సరిహద్దు వివాదం.. చైనాతో మరోసారి భారత్ సైనిక చర్చలు
శ్రీ గురుగ్రంథ సాహిబ్ జీ షీల్డ్ను తీసుకుని అజ్నాలా పోలీస్ స్టేషన్పై అమృతపాల్ దాడి చేసినప్పుడు, శ్రీ గురు గ్రంథ్ సాహిబ్ జీకి ఎలాంటి అగౌరవం జరగకుండా చూసుకోవాలని ఆయన పోలీసులను ఆదేశించారని భగవంత్ మాన్ చెప్పారు. శ్రీ గురు గ్రంథ్ సాహిబ్ జీ తమకు సర్వోన్నతమైనదని, అందుకే పోలీసులు దానిని మోసుకెళ్లే వాహనానికి తగిన గౌరవం ఇచ్చి స్వేచ్ఛగా ప్రయాణించేలా చేశారని ఆయన అన్నారు. ఆ ఘటనలో కొంతమంది పోలీసు అధికారులు గాయపడినప్పటికీ, శ్రీ గురు గ్రంథ్ సాహిబ్ జీ ఆధిపత్యం నిర్ధారించబడిందని సీఎం భగవంత్ మాన్ అన్నారు. అమృతపాల్ కోసం 30 రోజుల పాటు సాగిన వేటలో రాష్ట్రంలో శాంతి, మత సామరస్యాన్ని కొనసాగించినందుకు పంజాబ్ ప్రజలకు మన్ కృతజ్ఞతలు తెలిపారు. పంజాబ్ చాలా సారవంతమైన భూమిని కలిగి ఉందని, ద్వేషం, శత్రుత్వం తప్ప ఏదైనా దానిలో మొలకెత్తుతుందని అమృతపాల్ సింగ్ అరెస్టు తర్వాత ముఖ్యమంత్రి భగవంత్ మాన్ అన్నారు.
తాజావార్తలు
-
Tragedy: నార్సింగిలో ఘోర రోడ్డు ప్రమాదం.. రాంగ్ రూట్లో దూసుకొచ్చిన కారు, ఆర్మీ జవాన్ మృతి
-
Kapali: హన్సిక ‘కపాలి’ ఫస్ట్ లుక్.. కళ్లతోనే భయపెడుతున్న హీరోయిన్!
-
Delimitation Bill 2026: పార్లమెంట్లో డీలిమిటేషన్ బిల్లుపై ఉత్కంఠ.. డీఎంకే 22 మంది ఎంపీలే కీలకం, ఎన్డీఏకు పరీక్ష
-
Astrology: ఆగస్టు 10 సోమవారం దినఫలాలు.. ఈ రాశివారికి అనుకోని గుడ్ న్యూస్..
-
Hash Oil : స్నాప్చాట్లో డ్రగ్స్ దందా.. ORR వద్ద పెడ్లర్ అరెస్ట్.!
ట్రెండింగ్
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!