Corpses Festival: ఇదెక్కడి దిక్కుమాలిన సాంప్రదాయం.. శవాలతో పండగ ఏంట్రా బాబు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Corpses Festival: ప్రపంచంలో వివిధ ఆచారాలు, అనేక సంప్రదాయాలు ఉంటాయి. అయితే ఒక ఆచారం గురించి చెబితే ఇదెక్కడి దిక్కుమాలిన ఆచారం అంటారు. అదే శవాలతో పండుగ. అదేంటి శవాలనతో పండు ఏంట్రా బాబు అంటారా. అవును మీరు విన్నది నిజమే.. వారు అక్కడే పాతిపెట్టిన శవాలను బయటకు తీసి, దానిని అందంగా అలంకరించి, వాళ్లు బతుకున్నప్పుడు ఏమేమి చేసేవారు అంటే.. ఇష్టంగా ఏం తినేవారో.. ఎలా తయారు అయ్యేవారో.. అచ్చం అలాగే వంటలు చేసి, అందంగా ముస్తాబు చేసి ఆ శవాన్ని పూజించి చేస్తారు. ఇలాంటి ఆచారం చూడాలంటే డైరెక్ట్ గా ఇండోనేసియా వెళితే మీరు స్వయంగా చూడొచ్చు. ఇండోనేషియాలోని కొన్ని ప్రాంతాల ప్రజలు చనిపోయిన వారిని.. సమాధి నుంచి బయటకు తీసి, స్నానం చేయించి, పండుగలా జరుపుకునే సంప్రదాయాన్ని ప్రత్యేకంగా భావిస్తారు. అయితే ఆ వేడుక ఇంకా ఇప్పటికి కొనసాగుతోందనే ఉండటం గమనార్హం. ఈ వేడుకను మనెనే పండుగ అంటారు.
Read also: Chattisgarh : మనీ హీస్ట్ వెబ్ సిరీస్ని చూసి డ్రగ్స్ స్మగ్లింగ్.. నలుగురు అరెస్ట్
Also Read
దక్షిణ ఇండోనేషియాలోని సులవేసిలోని తోరాజా సంఘం ఒక విచిత్రమైన సంప్రదాయాన్ని కొనసాగిస్తోంది. అంటే చనిపోయిన వారు ఇంకా బతికే ఉన్నారనే నమ్మకం. అందుకే వారి సంవత్సరికం పాతిపెట్టిన శవాలను బయటకు తీసి ఆ రోజున పండుగ చేసుకుంటారు. ఈ ప్రత్యేక వేడుకను మనెనే అంటారు. ఆ రోజు అంటే సమాధుల నుండి శవాలను బయటకు తీసి శుభ్రం చేసే పండుగ. ఈ వేడుకలకు మృతుల కుటుంబ సభ్యులు, బంధువులు పెద్ద సంఖ్యలో తరలివస్తారు. శవాన్ని గుంతలోంచి బయటకు తీసి స్నానం చేయిస్తారు. ఆ శవానికి అంటుకున్న కీటకాలు, మురికిని జాగ్రత్తగా శుభ్రం చేస్తారు. కొత్త బట్టలు ధరించి, సమాధులను శుభ్రం చేస్తారు. మృతదేహాలను శుభ్రం చేసిన తర్వాత వారి పట్ల తమకున్న ప్రేమను, గౌరవాన్ని తెలియజేస్తారు. వాటిని అందంగా అలంకరింస్తారు. పురాతన ఆచారాలను అనుసరించడంతో పాటు టోరోజా ప్రజలు సంబంధాల బంధాన్ని మరింత బలోపేతం చేయడానికి వేల సంఖ్యలో ఆ పండుగకు కలిసి వస్తారు. టోరోజా ప్రజలు కొనసాగిస్తున్న ఈ ఆచారం ఇప్పుడు ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తుంది.
Read also: Gold Price Today : దిగొచ్చిన బంగారం, పెరిగిన వెండి ధరలు.. తులం ఎంతంటే?
బంధుమిత్రులు జీవించి ఉన్నప్పుడే వారి గౌరవాన్ని, ప్రేమను, ఆప్యాయతలను కాపాడుకుంటూ మరణించిన తర్వాత కూడా బంధువులను జరుపుకునే ఆచారాలను చూసేందుకు పర్యాటకులు పెద్ద సంఖ్యలో అక్కడికి తరలివస్తారు. ఇది విచిత్రమైన సంప్రదాయం అయినప్పటికీ, టోరోజా ప్రజల మతపరమైన ఆచారం నిజంగా అద్భుతమైనదని పర్యాటకు చెబుతున్నారు. చూసేందుకు, వినేందుకు భయంగా అనిపించినా టోకరా ప్రజలు పూర్వీకుల నుంచి ఈ ఆచారం వస్తందని, ఇప్పటి వరకు వారు అనుసరిస్తున్నట్లు తెలిపారు. వారికి ఆ పండుగ చాలా ఆనందాన్ని ఇస్తుందని అంటున్నారు. మరణం అంతం కాదు. దేనికీ అంతం లేదు, అది శాశ్వతమని నమ్ముతారు. చనిపోవడం అంటే టోరోజా ప్రజలు గాయపడినట్లు భావిస్తారు. దీని కోసం టోరోజా ప్రజలు దీనిని మకులా అని పిలుస్తారు. అంటే గాయపడిన వ్యక్తి చనిపోయినా, ఆ వ్యక్తిని బతికున్నట్లుగానే వ్యవహరిస్తారు. ప్రతి సంవత్సరం ఆగష్టు నెలలో, టోరోజా ప్రజలు వసంత మాసం చివరిలో మనెనే పండుగను జరుపుకుంటారు.
Double ismart : ఉస్తాద్ అలియాస్ డబుల్ ఇస్మార్ట్..దిమాక్ కిరి కిరి టీజర్ వచ్చేసింది..
తాజావార్తలు
-
Rupee: రూపాయి గరిష్ట పతనంపై.. ఆర్బీఐ సంచలన నిర్ణయం..
-
KKR Vs MI: కేకేఆర్ బౌలర్ల ధాటికి ముంబై విలవిల.. కోల్కతా టార్గెట్ ఎంతంటే..
-
Off The Record : జీడీ నెల్లూరు ఎమ్మెల్యే థామస్ గురించి టీడీపీలో చర్చలు
-
Uttar Pradesh: జిమ్లలో హిందూ మహిళలే టార్గెట్.. నిందితులపై యోగి సర్కార్ ఉక్కుపాదం..
-
Story Board : రూపాయి పతనం సెంచరీకి చేరువౌతోందా..? ఇరాన్ యుద్ధమే కొంప ముంచుతోందా..?
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!