Bharat Jodo Yatra: ముగింపుకు భారత్ జోడో యాత్ర.. శ్రీనగర్లో తిరంగా ఎగురవేయనున్న రాహుల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bharat Jodo Yatra: భారత్ జోడో యాత్ర ముగింపుకు చేరుకుంది. కాంగ్రెస్ పార్టీ గంపెడాశలు పెట్టుకున్న రాహుల్గాంధీ భారత్ జోడో యాత్ర ఈ నెల 30వ తేదీన భారీ బహిరంగ సభతో ముగియనుంది. కన్యాకుమారిలో యాత్రను ప్రారంభించిన రాహుల్గాంధీ.. జనంతో మమేకమవుతూ చివరి మజిలీకి చేరుకున్నారు. భారత్ జోడో యాత్ర అనబడే 3,570 కిలోమీటర్ల రాహుల్ పాదయాత్ర జనవరి 30న జమ్మూకశ్మీర్లో ముగుస్తుంది. కాంగ్రెస్ భారత్ జోడో యాత్రలో భాగంగాఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు శ్రీనగర్లోని చారిత్రాత్మక లాల్ చౌక్లో రాహుల్ గాంధీ త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించనున్నారు. అనంతరం మధ్యాహ్నం 2 గంటలకు పార్టీ రాష్ట్ర కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించనున్నారు.
కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు ద్వేషాన్ని పారద్రోలి – హృదయాలను కలిపే పాదయాత్ర.. అసాధ్యమనిపించిన భారత్ జోడో యాత్ర చరిత్ర పుటల్లో నమోదైంది.. ఈరోజు పాంథా చౌక్ నుంచి యాత్ర ప్రారంభమైందని కాంగ్రెస్ ట్వీట్ చేసింది. యాత్ర ముగింపు కార్యక్రమానికి కాంగ్రెస్ అన్ని విపక్షాలను ఆహ్వానించింది. అంతకుముందు శనివారం జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, పీడీపీ అధినేత్రి మెహబూబా ముఫ్తీ కూడా యాత్రలో పాల్గొన్నారు. మెహబూబా ముఫ్తీ తన కుమార్తెతో కలిసి భారత్ జోడో యాత్రలో పాల్గొన్నారు. ఆయన ప్రయాణాన్ని ఎంతో మెచ్చుకున్నారు. రాహుల్ గాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్ యొక్క భారత్ జోడో యాత్రను మెహబూబా ముఫ్తీ తాజా ఉత్సాహంగా అభివర్ణించారు. 2019 తర్వాత మొదటిసారిగా, ఈ యాత్ర ఇంత పెద్ద సంఖ్యలో ప్రజలు తమ ఇళ్లను విడిచిపెట్టడానికి అవకాశం ఇచ్చిందని అన్నారు.
Also Read
- CM Chandrababu: స్థానిక ఎన్నికలకు సిద్ధం కండి.. కూటమిలో గ్యాప్ వద్దు.. అభ్యర్థుల ఎంపికపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
- Off The Record: కేసీఆర్ సీఎం అయ్యాకే అసెంబ్లీకి వస్తారా..?
- Nitin Gadkari: ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘిస్తే లైసెన్స్ రద్దు.. గడ్కరీ కీలక ప్రకటన
- Trump: ముదురుతోన్న అమెరికా-కెనడా వాణిజ్య యుద్ధం.. కార్నీపై ట్రంప్ ఆగ్రహం
Gauhati High Court: జీన్స్ వేసిన న్యాయవాది.. దిమ్మతిరిగే షాకిచ్చిన హైకోర్టు
దీనికి ముందు, నేషనల్ కాన్ఫరెన్స్ నాయకుడు, జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా కూడా యాత్రకు మద్దతు ఇచ్చారు. బనిహాల్లో రాహుల్ గాంధీతో కలిసి ఒమర్ అబ్దుల్లా యాత్రలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ పర్యటన ఉద్దేశం రాహుల్ గాంధీ ప్రతిష్టను మెరుగుపరచడం కాదని, దేశ ప్రతిష్టను మెరుగుపరచడమేనని అన్నారు. యాత్రకు మంచి స్పందన వస్తోందని అన్నారు.
దేశంలో 5 నెలల పాటు కొనసాగిన కాంగ్రెస్ భారత్ జోడో యాత్ర జమ్మూకశ్మీర్లోని శ్రీనగర్లో సోమవారం (జనవరి 30) ముగియనుంది. ముగింపు వేడుక శ్రీనగర్లోని షేర్-ఎ-కశ్మీర్ స్టేడియంలో జరగనుంది, దీనికి కాంగ్రెస్ భారీ జనసందోహాన్ని అంచనా వేస్తోంది. దేశంలోని చాలా ప్రాంతీయ పార్టీలకు ఆహ్వానాలు పంపారు. జనవరి 11న, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ముగింపు వేడుకలకు హాజరు కావాలని దేశవ్యాప్తంగా 24 పార్టీలకు ఆహ్వానాలు పంపారు.
తాజావార్తలు
-
CM Chandrababu: స్థానిక ఎన్నికలకు సిద్ధం కండి.. కూటమిలో గ్యాప్ వద్దు.. అభ్యర్థుల ఎంపికపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
-
Off The Record: కేసీఆర్ సీఎం అయ్యాకే అసెంబ్లీకి వస్తారా..?
-
Nitin Gadkari: ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘిస్తే లైసెన్స్ రద్దు.. గడ్కరీ కీలక ప్రకటన
-
Trump: ముదురుతోన్న అమెరికా-కెనడా వాణిజ్య యుద్ధం.. కార్నీపై ట్రంప్ ఆగ్రహం
-
Konda Surekha : కొండా సురేఖకు ఫైనల్ షాక్.. బర్తరఫ్కు గవర్నర్ ఓకే..
ట్రెండింగ్
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!