Bharat Jodo Yatra: ముగింపుకు భారత్ జోడో యాత్ర.. శ్రీనగర్లో తిరంగా ఎగురవేయనున్న రాహుల్
Bharat Jodo Yatra: భారత్ జోడో యాత్ర ముగింపుకు చేరుకుంది. కాంగ్రెస్ పార్టీ గంపెడాశలు పెట్టుకున్న రాహుల్గాంధీ భారత్ జోడో యాత్ర ఈ నెల 30వ తేదీన భారీ బహిరంగ సభతో ముగియనుంది. కన్యాకుమారిలో యాత్రను ప్రారంభించిన రాహుల్గాంధీ.. జనంతో మమేకమవుతూ చివరి మజిలీకి చేరుకున్నారు. భారత్ జోడో యాత్ర అనబడే 3,570 కిలోమీటర్ల రాహుల్ పాదయాత్ర జనవరి 30న జమ్మూకశ్మీర్లో ముగుస్తుంది. కాంగ్రెస్ భారత్ జోడో యాత్రలో భాగంగాఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు శ్రీనగర్లోని చారిత్రాత్మక లాల్ చౌక్లో రాహుల్ గాంధీ త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించనున్నారు. అనంతరం మధ్యాహ్నం 2 గంటలకు పార్టీ రాష్ట్ర కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించనున్నారు.
కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు ద్వేషాన్ని పారద్రోలి – హృదయాలను కలిపే పాదయాత్ర.. అసాధ్యమనిపించిన భారత్ జోడో యాత్ర చరిత్ర పుటల్లో నమోదైంది.. ఈరోజు పాంథా చౌక్ నుంచి యాత్ర ప్రారంభమైందని కాంగ్రెస్ ట్వీట్ చేసింది. యాత్ర ముగింపు కార్యక్రమానికి కాంగ్రెస్ అన్ని విపక్షాలను ఆహ్వానించింది. అంతకుముందు శనివారం జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, పీడీపీ అధినేత్రి మెహబూబా ముఫ్తీ కూడా యాత్రలో పాల్గొన్నారు. మెహబూబా ముఫ్తీ తన కుమార్తెతో కలిసి భారత్ జోడో యాత్రలో పాల్గొన్నారు. ఆయన ప్రయాణాన్ని ఎంతో మెచ్చుకున్నారు. రాహుల్ గాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్ యొక్క భారత్ జోడో యాత్రను మెహబూబా ముఫ్తీ తాజా ఉత్సాహంగా అభివర్ణించారు. 2019 తర్వాత మొదటిసారిగా, ఈ యాత్ర ఇంత పెద్ద సంఖ్యలో ప్రజలు తమ ఇళ్లను విడిచిపెట్టడానికి అవకాశం ఇచ్చిందని అన్నారు.
Also Read
- Gold Rates: గోల్డ్ లవర్స్కు మళ్లీ షాక్.. నేటి బంగారం, వెండి ధరలు ఇలా!
- New LPG Rules: ఎల్పీజీ వినియోగదారులకు అలర్ట్.. అమల్లోకి కొత్త రూల్స్.. ఈ పని చేయకపోతే కనెక్షన్ కట్..!
- Tejasvi Surya: రూ.600 కోట్లతో మైనార్టీల కాలనీల్లో రోడ్లా? కర్ణాటక ప్రభుత్వంపై తేజస్వి సూర్య ధ్వజం
- PSL: చివరి ఓవర్ థ్రిల్లర్.. 2 పరుగుల తేడాతో విజయం.. ఫైనల్లోకి అగుడు పెట్టిన హైదరాబాద్ జట్టు..
Gauhati High Court: జీన్స్ వేసిన న్యాయవాది.. దిమ్మతిరిగే షాకిచ్చిన హైకోర్టు
దీనికి ముందు, నేషనల్ కాన్ఫరెన్స్ నాయకుడు, జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా కూడా యాత్రకు మద్దతు ఇచ్చారు. బనిహాల్లో రాహుల్ గాంధీతో కలిసి ఒమర్ అబ్దుల్లా యాత్రలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ పర్యటన ఉద్దేశం రాహుల్ గాంధీ ప్రతిష్టను మెరుగుపరచడం కాదని, దేశ ప్రతిష్టను మెరుగుపరచడమేనని అన్నారు. యాత్రకు మంచి స్పందన వస్తోందని అన్నారు.
దేశంలో 5 నెలల పాటు కొనసాగిన కాంగ్రెస్ భారత్ జోడో యాత్ర జమ్మూకశ్మీర్లోని శ్రీనగర్లో సోమవారం (జనవరి 30) ముగియనుంది. ముగింపు వేడుక శ్రీనగర్లోని షేర్-ఎ-కశ్మీర్ స్టేడియంలో జరగనుంది, దీనికి కాంగ్రెస్ భారీ జనసందోహాన్ని అంచనా వేస్తోంది. దేశంలోని చాలా ప్రాంతీయ పార్టీలకు ఆహ్వానాలు పంపారు. జనవరి 11న, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ముగింపు వేడుకలకు హాజరు కావాలని దేశవ్యాప్తంగా 24 పార్టీలకు ఆహ్వానాలు పంపారు.
తాజావార్తలు
-
Kyle Jamieson IPL Penalty: బిగ్ వార్నింగ్.. వైభవ్ సూర్యవంశీని అవుట్ చేసిన బౌలర్కు షాక్ ఇచ్చిన బీసీసీఐ..
-
Axar Patel: ఎందుకు అతడిని లెజెండ్ అంటారో ఇప్పుడు అర్థమైంది.. ఆ ఆనందమే వేరప్ప!
-
Gold Rates: గోల్డ్ లవర్స్కు మళ్లీ షాక్.. నేటి బంగారం, వెండి ధరలు ఇలా!
-
New LPG Rules: ఎల్పీజీ వినియోగదారులకు అలర్ట్.. అమల్లోకి కొత్త రూల్స్.. ఈ పని చేయకపోతే కనెక్షన్ కట్..!
-
Samsung Galaxy F17e 5G: సామ్ సంగ్ 5G ఫోన్ కేవలం రూ.13,774 కే.. 6000 mAh బ్యాటరీ, 50MP కెమెరా
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!