Nagpur Panchayat Elections : నాగపూర్ జిల్లాలో బీజేపీకి షాక్.. పంచాయతీ ఎన్నికల్లో ఓటమి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nagpur Panchayat Elections : సాక్షాత్తూ కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు చంద్రశేఖర్ బువాంకులేల సొంత జిల్లా నాగ్పూర్లో బీజేపీకి షాక్ తగిలింది. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో కాషాయపార్టీకి చేదు ఫలితాలు వచ్చాయి. పంచాయతీ పోరులో కాంగ్రెస్ సత్తా చాటింది. అధిక స్థానాలను కైవసం చేసుకుంది. నాగపూర్ జిల్లా బీజేపీ మాతృ సంస్థ ఆర్ఎస్ఎస్ ప్రధాన కేంద్రం కావడం గమనార్హం. అలాంటి నాగ్పూర్లోనే ఇలాంటి ఫలితాలు రావటం బీజేపీకి మింగుడుపడని విషయమని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
Read Also: Muslim Girl: మేజర్ కాకుండానే పెళ్లికి అర్హులా..? తేల్చనున్న సుప్రీంకోర్టు
Also Read
- Government Schools Decline: ఒకే ఏడాదిలో 9,900 ప్రభుత్వ పాఠశాలల మూత... తెలుగు రాష్ట్రాల్లో భారీగా..! కారణమేంటి?
- YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..
- Beetroot Dosa: ఎప్పుడు మాములు దోసలేనా..? కొత్తగా క్రిస్పీ & హెల్దీ బీట్రూట్ దోస చేసేయండి ఇలా.!
- International Credit Cards: భారతీయులకు క్రెడిట్ కార్డులు ఇచ్చేందుకు నిరాకరిస్తున్న గ్లోబల్ బ్యాంక్స్.. ఎందుకంటే?
నాగ్పూర్ జిల్లాలో పంచాయతీ చైర్పర్సన్లు, డిప్యూటీ చైర్పర్సన్ల పదవులకు ఎన్నికలు జరిగాయి. అధికారిక సమాచారం ప్రకారం.. బీజేపీ వీటిల్లో ఒక్క చైర్పర్సన్ పదవినీ పొందలేకపోయింది. కేవలం మూడు డిప్యూటీ చైర్పర్సన్ సీట్లకే పరిమితమైంది.
Read Also: PM Modi: 23న అయోధ్యలో మోదీ పర్యటన.. 15లక్షల మందితో దీపోత్సవ వేడుక
మొత్తం 13 చైర్పర్సన్ పోస్టులకు గానూ హస్తం పార్టీ తొమ్మిది స్థానాల్లో విజయం సాధించింది. అలాగే, 13 డిప్యూటీ చైర్పర్సన్ పదవులకు గానూ ఎనిమిదింటిలో జయకేతనం ఎగురవేసింది. ఇక నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ (ఎన్సిపి) మూడు చైర్పర్సన్ పదవులను గెలుపొందింది. శివసేన ఒక్క స్థానాన్ని కైవసం చేసుకున్నది. కాంగ్రెస్ గెలుపొందిన వాటిలో సావోనేర్, కల్మేశ్వర్, పార్సియోని, మౌడా, కాంప్టీ, ఉమ్రేడ్, భివాపూర్, కుహి, నాగ్పూర్ రూరల్ లు ఉన్నాయి. కటోల్, నార్ఖేడ్, హింగ్నా స్థానాలను ఎన్సిపి గెలుచుకున్నది. రామ్టెక్ చైర్పర్సన్ పదవిని శివసేన గెలుచుకున్నది. రామ్టెఖ్ సీటును ముఖ్యమంత్రి ఏక్నాథ్ శిండే నేతృత్వంలోని ‘బాలాసాహేబంచి శివ సేన’ సొంతం చేసుకున్నట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.
తాజావార్తలు
-
Rahul Sipligunj : స్నేహితుడు ప్రేమ వ్యవహారంలో రాహుల్ సిప్లిగంజ్పై కేసు.. విశాఖలో FIR నమోదు
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
Jana Nayagan OTT Release: విజయ్ ‘జన నాయగన్’ ఓటీటీ ఎంట్రీ ఫిక్స్.. ఏ ప్లాట్ఫామ్లో అంటే?
-
Government Schools Decline: ఒకే ఏడాదిలో 9,900 ప్రభుత్వ పాఠశాలల మూత… తెలుగు రాష్ట్రాల్లో భారీగా..! కారణమేంటి?
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..
ట్రెండింగ్
-
Beetroot Dosa: ఎప్పుడు మాములు దోసలేనా..? కొత్తగా క్రిస్పీ & హెల్దీ బీట్రూట్ దోస చేసేయండి ఇలా.!
-
890cc V-Twin ఇంజిన్, కొత్త చాసిస్, కొత్త లుక్ తో Ducati Monster V2 లాంచ్.. ధర ఎంతంటే..?
-
64MP కెమెరా, 9.49 మి.మీ. మందం, AI కెమెరా ఫీచర్లతో ఆగస్టు 25న రానున్న Boltt Ace 5G..!
-
7,000mAh బ్యాటరీ, 50MP సోనీ కెమెరా, FHD+ LCD 120Hz డిస్ప్లేతో వచ్చేందుకు సిద్దమైన Moto G Max..!
-
రూ.8,499కే Lava Smart 4 లాంచ్.. మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 5000mAh బ్యాటరీ, 90Hz LCD డిస్ప్లేతో బడ్జెట్ ఫోన్..!