PM Modi: 23న అయోధ్యలో మోదీ పర్యటన.. 15లక్షల మందితో దీపోత్సవ వేడుక
PM Modi: ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈ దీపావళిని అయోధ్యలో జరుపుకోనున్నారు. ఆదివారం ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో దీపావళి వేడుకల్లో మోదీ పాల్గొననున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లను అధికారులు చేస్తున్నారు. ప్రతీయేటా దీపావళికి ఒకరోజు ముందు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం దీపోత్సవ్ వెలుగుల పండుగని నిర్వహిస్తోంది. దీనిలో ప్రజలు అయోధ్యలోని నదీతీరంలో ‘ద్వీపాలతో’ వరుసలో ఉంటారు. గత ఏడాది తొమ్మిది లక్షల మందితో రికార్డు నెలకొల్పగా.. 23న 15లక్షల మందితో చారిత్రాత్మక ప్రపంచ రికార్డు నెలకొల్పేలా యూపీ పర్యాటక శాఖ కృషి చేస్తుంది. అక్టోబర్ 23న సరయూ నది ఒడ్డున నెలకొని ఉన్న రామ్కీ పైడి ఘాట్ల శ్రేణిలో దీపోత్సవ వేడుకల్లో ప్రధాని పాల్గొంటారు. తద్వారా అయోధ్యలోని భక్తుల సమక్షంలో దీపావళి పండుగను జరుపుకోనున్నారు.
Read Also: Phone : ఫోన్ తీశాడంటూ బావిలో వేలాడదీశారు.. చిన్నారిపై క్రూరత్వం
Also Read
అయోధ్యలో దీపోత్సవ సంప్రదాయం యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వంలో ప్రారంభమైంది. 2017లో 51వేల మంది దివ్యాంగులతో ప్రారంభమై, 2019లో 4.10 లక్షలకు, 2020లో ఆరు లక్షలకుపైగా, గత ఏడాది తొమ్మిది లక్షలకు పైగా చేరి కొత్త గిన్నిస్ వరల్డ్ రికార్డును నెలకొల్పింది. ఈ ఏడాది దాదాపు 15లక్షల మందితో మళ్లీ చారిత్రాత్మక ప్రపంచ రికార్డును నెలకొల్పనున్నట్లు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ పర్యాటక శాఖ ట్వీట్ చేసింది.
Read Also: Weight Loss : బంపర్ ఆఫర్.. బరువు తగ్గితే రూ.1000కోట్ల బహుమతి
అక్టోబర్ 23న సాయంత్రం 4.55 గంటలకు శ్రీ రామ జన్మభూమిలో భగవాన్ శ్రీ రామ్ లాలా విరాజ్మన్కు ప్రధాని మోదీ ప్రార్ధనలు చేస్తారు. 5.05 గంటలకు రామజన్మభూమి తీర్థ క్షేత్ర స్థల పరిశీలించి, దర్శనం చేసుకుంటారు. 5.40గంటలకు శ్రీ రామ్ కథా పార్కులో నిర్వహించే శ్రీరాముని పట్టాభిషేక కార్యక్రమంలో ప్రధాని మోదీ పాల్గొంటారు. 6.25గంటలకు సరయు కొత్త ఘాట్ వద్ద హారతిలో పాల్గొంటారు. 6.40 గంటలకు రామ్ కీ పైడిలో జరిగే దీపోత్సవ్లో ప్రధాని పాల్గొంటారు. రాత్రి 7.25 గంటలకు సరయు కొత్త ఘాట్ వద్ద గ్రీన్ డిజిటల్ బాణసంచాని ప్రధాని మోదీ వీక్షిస్తారు.
తాజావార్తలు
-
T20 Rankings: టీ20 ర్యాంకింగ్స్ విడుదల.. టాప్లోకి దూసుకెళ్లిన టీమిండియా..
-
Vijay And Karunanidhi: కరుణానిధితో విజయ్ పాత ఫోటో వైరల్.. ఆర్జీవీ సంచలన ట్వీట్..
-
Tragedy : తీరని విషాదం.. బట్టలు ఉతకడానికి వెళ్లి తల్లి, ఇద్దరు కుమార్తెలు మృతి..!
-
KTR : రైతు సమస్యలపై ప్రభుత్వానికి కేటీఆర్ అల్టిమేటం
-
Mamata Banerjee: మమత రాజీనామా చేయకపోతే ఏం జరుగుతుంది? నెక్ట్స్ పరిణామం ఇదేనా?
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!