Snake Poison : బంగ్లా సరిహద్దులో కోట్లు విలువ చేసే పాము విషం స్వాధీనం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత్-బంగ్లాదేశ్ సరిహద్దులో బీఎస్ఎఫ్ దళాలు గస్తీ కస్తూ ఉంటాయి. చీమ చిటుక్కుమన్నా.. కొద్దీగా డౌట్ వచ్చినా భద్రతా దళాలు అప్రమత్తమవుతాయి. అలాంటి సరిహద్దులో స్మగ్లింగ్ జరుగుతుందని సమాచారం అందడంతో.. సైన్యం అప్రమత్తమైంది. సరిగ్గా అర్థరాత్రి ఇద్దరు వ్యక్తులు భారత్ లోకి ప్రవేశించేందుకు ప్రయత్నిస్తుండగా.. వారిని బీఎస్ఎఫ్ దళం అడ్డుకుంది. వారిపై కాల్పులు జరపగా.. ఇద్దరు తప్పించుకున్నారు. ఈ క్రమంలో వారు జారివిడిచిన కూజా లాంటి బాటిల్ ను స్వాధీనం చేసుకున్నారు.
Also Read : Bhatti Vikramarka : కాంగ్రెస్ అధికారంలోకి వస్తే.. జనాభా దామాషా పద్ధతిలో బీసీ సబ్ ప్లాన్ను అమలు చేస్తాం
Also Read
- Kapil Dev: ఫాలో ఆన్ ఇచ్చి కూడా గెలవలేరా? కపిల్ దేవ్ ప్రశ్నల వర్షంతో టీమిండియాలో ప్రకంపనలు..
- NASA: అంగారక గ్రహంపై ఏలియన్ 'జెల్లీఫిష్' కలకలం.. నాసా ఫొటోతో వెలుగులోకి షాకింగ్ విషయాలు..
- Food Poisoning: జగిత్యాల జిల్లాలో విషాదం.. పెళ్లి భోజనం తిని 15 మందికి అస్వస్థత..
- T20 Cricket: కేవలం 7 పరుగులకే ఆలౌట్, 10 రన్స్కే కుప్పకూలిన జట్లు, టీ20 చరిత్రలోనే అత్యంత దారుణ స్కోర్లు ఇవే!
ఆ సీసాను ఓపెన్ చూస్తే దెబ్బకు షాక్ అయ్యే విషయం వెలుగులోకి వచ్చింది. ఇద్దరు స్మగ్లర్లు బంగ్లాదేశ్ నుంచి భారత్ లోకి.. అక్రమంగా రవాణా చేసేందుకు రూ. 13 కోట్ల విలువైన పాము విషాన్ని స్వాధీనం చేసుకున్నట్లు బీఎస్ఎఫ్ దళాలు వెల్లడించాయి. బంగ్లాదేశ్ సరిహద్దులో అక్రమ రవాణా జరుగుతుందని సమచారం రావడంతో భద్రతా దళాలు అప్రమత్తమయ్యారు. దక్షిణ దినాజ్ పూర్ జిల్లాలోని హిలి పోలీస్ స్టేషన్ పరిధిలోని గోష్ పూర్ బీఓపీ ప్రాంతంలో ఆదివారం అర్థరాత్రి దాటిన తర్వాత.. సుమారు 12: 30 గంటల సమయంలో ఇద్దరు స్మగ్లర్లు భారత్ లోకి అక్రమంగా ప్రవేశించేందుకు ప్రయత్నించగా.. వారిపై సిబ్బంది కాల్పులు జరిపారు.. దీంతో స్మగ్లర్లు అక్కడి నుంచి తప్పించుకున్నారు.
Also Read : NaveenulHaq : నేనుందుకు సారీ చెప్పాలి.. చెప్పను పో..
అయితే ఓ సిసాను స్మగ్లర్లు వదిలిపెట్టి పోగా.. దాన్ని సిబ్బంది స్వాధీనం చేసుకుని.. అందులోని పాము విషం ఉండటాన్ని గుర్తించి.. అధికారులకు బీఎస్ఎఫ్ సిబ్బంది సమాచారం ఇచ్చారు. ఆ సీసాపై రెడ్ డ్రాగన్ కో మేడ్ ఇన్ ఫ్రాన్స్ అని రాసి ఉందని.. బాటిల్ లో ఉన్న పాము విషం కోబ్రా పాముదని అధికారులు వెల్లడించారు. పశ్చిమ బెంగాల్ లోని హిలి ప్రాంతంలో బీఎస్ఎఫ్ 137వ బెటాలియన్ స్వాధీనం చేసుకున్న.. రూ. 13 కోట్ల విలువైన పాము విషాన్ని బలుఘాట్ అటవీ శాఖకు అప్పగించినట్లు రేంజర్ సుకాంత్ ఓజాన్ వెల్లడించారు.
తాజావార్తలు
-
Kapil Dev: ఫాలో ఆన్ ఇచ్చి కూడా గెలవలేరా? కపిల్ దేవ్ ప్రశ్నల వర్షంతో టీమిండియాలో ప్రకంపనలు..
-
NASA: అంగారక గ్రహంపై ఏలియన్ ‘జెల్లీఫిష్’ కలకలం.. నాసా ఫొటోతో వెలుగులోకి షాకింగ్ విషయాలు..
-
Food Poisoning: జగిత్యాల జిల్లాలో విషాదం.. పెళ్లి భోజనం తిని 15 మందికి అస్వస్థత..
-
Emraan Hashmi: సినిమా సక్సెస్ జోష్లో ఇమ్రాన్ హష్మీకి బిగ్ షాక్.. స్వైన్ ఫ్లూ పాజిటివ్!
-
T20 Cricket: కేవలం 7 పరుగులకే ఆలౌట్, 10 రన్స్కే కుప్పకూలిన జట్లు, టీ20 చరిత్రలోనే అత్యంత దారుణ స్కోర్లు ఇవే!
ట్రెండింగ్
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!