Congress: మరో యాత్రకు కాంగ్రెస్ శ్రీకారం.. ఈ సారి తూర్పు నుంచి పడమరకు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Congress: కాంగ్రెస్ చేపట్టిన భారత్ జోడో యాత్ర విజయవంతమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మరో యాత్రకు శ్రీకారం చుట్టనున్నట్లు తెలుస్తోంది. కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర దిగ్విజయంగా పూర్తైంది. ఆ యాత్ర దక్షిణం నుంచి ఉత్తరానికి సాగింది. మరో యాత్ర తూర్పు నుంచి పడమరకు కాంగ్రెస్ పార్టీ ప్లాన్ చేస్తోంది. పాసిఘాట్ నుంచి పోర్బందర్ యాత్రను కాంగ్రెస్ పరిశీలిస్తోందని, భారత్ జోడో యాత్రను ముందుకు తీసుకెళ్లాలని రాహుల్ గాంధీ పిలుపునిచ్చిన తర్వాత పార్టీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ ఆదివారం తెలిపారు.
గత ఏడాది సెప్టెంబరు నుంచి ఈ ఏడాది జనవరి వరకు గాంధీజీతో పాటు అనేక మంది కాంగ్రెస్ నాయకులు చేపట్టిన దాదాపు 4,000 కిలోమీటర్ల కన్యాకుమారి-కాశ్మీర్ యాత్ర తర్వాత మరో యాత్ర కోసం పార్టీ కార్యకర్తల్లో ఉత్సాహం, శక్తి పుంజుకున్నాయని రమేష్ పేర్కొన్నారు. బహుశా అరుణాచల్ ప్రదేశ్లోని పాసిఘాట్ నుండి గుజరాత్లోని పోర్బందర్ వరకు తూర్పు-పడమర యాత్రను పరిశీలిస్తున్నామని, అయితే దాని ఫార్మాట్ భారత్ జోడో యాత్ర కంటే కొంచెం భిన్నంగా ఉంటుందని జైరాం రమేష్ చెప్పారు. భారత్ జోడో యాత్ర కోసం సమీకరించబడిన అంత విస్తృతమైన మౌలిక సదుపాయాలు దీనికి లేకపోవచ్చు, తక్కువ యాత్రికులు ఉండొచ్చని ఆయన వెల్లడించారు. ఇది చాలా వరకు పాదయాత్రగా ఉంటుందని, అయితే ఈ మార్గంలో అడవులు, నదులు ఉన్నాయన్నారు. “ఇది మల్టీ-మోడల్ యాత్ర అవుతుంది, కానీ చాలావరకు ఇది పాదయాత్ర అవుతుంది” అని జైరాం రమేష్ అన్నారు.
Also Read
- Disha Salian Case: దిశ సాలియన్ కేస్.. సీబీఐ ఎఫ్ఐఆర్లో ఆదిత్య ఠాక్రే, రియా పేర్లు..
- South Africa: సౌతాఫ్రికాలో రెండు మినీ బస్సులు ఢీ.. 21 మంది మృతి
- Vaibhav Sooryavanshi Income: 18 ఏళ్లు నిండకుండానే కోట్లలో సంపాదన.. వైభవ్ సూర్యవంశీ రోజుకు ఎంత సంపాదిస్తున్నాడో తెలుసా..
- Rajasthan: రాజస్థాన్ ఎన్నికల్లో విచిత్రం.. బీజేపీ అభ్యర్థికి ఒక్కటే ఓటు, తన ఓటు కూడా పడలేదు!
ఏప్రిల్లో కర్ణాటకలో ఎన్నికలు, జూన్లో వర్షాలు, మళ్లీ నవంబర్లో మరో ఎన్నికల నేపథ్యంలో యాత్రను జూన్లోపు లేదా నవంబర్లోపు చేపట్టాల్సి ఉంటుందని ఆయన అన్నారు. భారత్ జోడో యాత్ర కంటే ఈ యాత్ర తక్కువ వ్యవధిలో ఉంటుందని రమేష్ తెలిపారు. వీటన్నింటిపై వచ్చే కొద్ది వారాల్లో నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. కాంగ్రెస్ ప్లీనరీ సెషన్లో ప్రసంగించిన రాహుల్ గాంధీ.. భారత్ జోడో యాత్ర ద్వారా చేపట్టిన “తపస్సు”ను ముందుకు తీసుకెళ్లేందుకు పార్టీ కొత్త ప్రణాళికను రూపొందించాలని, దేశం మొత్తం అందులో తాను పాల్గొంటానని, అలాంటి మరో చొరవను సూచిస్తున్నట్లు చెప్పారు.
తాజావార్తలు
-
Ram Charan: మెగాస్టార్ ఇంట్లో వినాయక చవితి వేడుకలు.. ఫ్యామిలీతో కలిసి రామ్ చరణ్ ప్రత్యేక పూజలు! వైరల్ వీడియో..
-
Saudi Arabia: ఒక్క నదీ బారదు.. అయినా పైసలే పైసలు! ఎడారిల 1000 కోట్ల మొక్కలతో మాయ చేసిన దేశం ఇదే..
-
Disha Salian Case: దిశ సాలియన్ కేస్.. సీబీఐ ఎఫ్ఐఆర్లో ఆదిత్య ఠాక్రే, రియా పేర్లు..
-
Kabir Duhan Singh: ‘హనుమాన్ అంశ్’ బాటలోనే మరో డివైన్ మూవీ? అయోధ్య బాల రాముడి కథతో సినిమా!
-
South Africa: సౌతాఫ్రికాలో రెండు మినీ బస్సులు ఢీ.. 21 మంది మృతి
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!