Congress: మరో యాత్రకు కాంగ్రెస్ శ్రీకారం.. ఈ సారి తూర్పు నుంచి పడమరకు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Congress: కాంగ్రెస్ చేపట్టిన భారత్ జోడో యాత్ర విజయవంతమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మరో యాత్రకు శ్రీకారం చుట్టనున్నట్లు తెలుస్తోంది. కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర దిగ్విజయంగా పూర్తైంది. ఆ యాత్ర దక్షిణం నుంచి ఉత్తరానికి సాగింది. మరో యాత్ర తూర్పు నుంచి పడమరకు కాంగ్రెస్ పార్టీ ప్లాన్ చేస్తోంది. పాసిఘాట్ నుంచి పోర్బందర్ యాత్రను కాంగ్రెస్ పరిశీలిస్తోందని, భారత్ జోడో యాత్రను ముందుకు తీసుకెళ్లాలని రాహుల్ గాంధీ పిలుపునిచ్చిన తర్వాత పార్టీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ ఆదివారం తెలిపారు.
గత ఏడాది సెప్టెంబరు నుంచి ఈ ఏడాది జనవరి వరకు గాంధీజీతో పాటు అనేక మంది కాంగ్రెస్ నాయకులు చేపట్టిన దాదాపు 4,000 కిలోమీటర్ల కన్యాకుమారి-కాశ్మీర్ యాత్ర తర్వాత మరో యాత్ర కోసం పార్టీ కార్యకర్తల్లో ఉత్సాహం, శక్తి పుంజుకున్నాయని రమేష్ పేర్కొన్నారు. బహుశా అరుణాచల్ ప్రదేశ్లోని పాసిఘాట్ నుండి గుజరాత్లోని పోర్బందర్ వరకు తూర్పు-పడమర యాత్రను పరిశీలిస్తున్నామని, అయితే దాని ఫార్మాట్ భారత్ జోడో యాత్ర కంటే కొంచెం భిన్నంగా ఉంటుందని జైరాం రమేష్ చెప్పారు. భారత్ జోడో యాత్ర కోసం సమీకరించబడిన అంత విస్తృతమైన మౌలిక సదుపాయాలు దీనికి లేకపోవచ్చు, తక్కువ యాత్రికులు ఉండొచ్చని ఆయన వెల్లడించారు. ఇది చాలా వరకు పాదయాత్రగా ఉంటుందని, అయితే ఈ మార్గంలో అడవులు, నదులు ఉన్నాయన్నారు. “ఇది మల్టీ-మోడల్ యాత్ర అవుతుంది, కానీ చాలావరకు ఇది పాదయాత్ర అవుతుంది” అని జైరాం రమేష్ అన్నారు.
Also Read
- Telangana Ration Cards: నూతన రేషన్ కార్డుల పంపిణీకి ముహూర్తం ఫిక్స్.. 1.05 కోట్ల మందికి కొత్త కార్డులు..
- Jos Buttler: "నా వరల్డ్ రికార్డ్ బద్దలు గొట్టడం ఆ బుడ్డోడికే సాధ్యం".. వైభవ్పై బట్లర్ ఆసక్తికర వ్యాఖ్యలు..
- 540 డిగ్రీ కెమెరా, పనోరమిక్ సన్రూఫ్, రూ.13.69 లక్షలతో 2026 Mahindra Scorpio-N లాంచ్..!
- Harish Rao-KTR: "బతుకంతా తెలంగాణది".. జయశంకర్ ఆశయాల స్మరించుకున్న బీఆర్ఎస్ నేతలు..
ఏప్రిల్లో కర్ణాటకలో ఎన్నికలు, జూన్లో వర్షాలు, మళ్లీ నవంబర్లో మరో ఎన్నికల నేపథ్యంలో యాత్రను జూన్లోపు లేదా నవంబర్లోపు చేపట్టాల్సి ఉంటుందని ఆయన అన్నారు. భారత్ జోడో యాత్ర కంటే ఈ యాత్ర తక్కువ వ్యవధిలో ఉంటుందని రమేష్ తెలిపారు. వీటన్నింటిపై వచ్చే కొద్ది వారాల్లో నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. కాంగ్రెస్ ప్లీనరీ సెషన్లో ప్రసంగించిన రాహుల్ గాంధీ.. భారత్ జోడో యాత్ర ద్వారా చేపట్టిన “తపస్సు”ను ముందుకు తీసుకెళ్లేందుకు పార్టీ కొత్త ప్రణాళికను రూపొందించాలని, దేశం మొత్తం అందులో తాను పాల్గొంటానని, అలాంటి మరో చొరవను సూచిస్తున్నట్లు చెప్పారు.
తాజావార్తలు
-
Telangana Ration Cards: నూతన రేషన్ కార్డుల పంపిణీకి ముహూర్తం ఫిక్స్.. 1.05 కోట్ల మందికి కొత్త కార్డులు..
-
Princess Isabella: చరిత్ర సృష్టించిన డెన్మార్క్ యువరాణి ఇసబెల్లా.. తొలిసారి సైన్యంలో చేరిన రాజకుటుంబ మహిళ!
-
Spider Man India market : స్పైడర్-మ్యాన్ సిరీస్తో ఇండియా మార్కెట్పై హాలీవుడ్ ఫుల్ ఫోకస్
-
Jos Buttler: “నా వరల్డ్ రికార్డ్ బద్దలు గొట్టడం ఆ బుడ్డోడికే సాధ్యం”.. వైభవ్పై బట్లర్ ఆసక్తికర వ్యాఖ్యలు..
-
540 డిగ్రీ కెమెరా, పనోరమిక్ సన్రూఫ్, రూ.13.69 లక్షలతో 2026 Mahindra Scorpio-N లాంచ్..!
ట్రెండింగ్
-
Incredible Story: దేశవాళీ క్రికెట్లో 9 వేల రన్స్.. టీమిండియా డెబ్యూలోనే హాఫ్ సెంచరీ.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఓపెనర్!
-
Bear Kills Siblings: ఎలుగుబంటి బీభత్సం.. అన్నాచెల్లెళ్లపై దాడి, ఇద్దరి మృతి..!
-
Jio మాస్టర్ ప్లాన్.. రూ.319కే 18 నెలల Google AI Pro, 45GB హై-స్పీడ్ డేటా, అన్లిమిటెడ్ కాల్స్..!
-
8,000 నిట్స్ OLED డిస్ప్లే, 8,500mAh భారీ బ్యాటరీ, Kirin 8020 చిప్తో Huawei Nova 16 SE లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ.. ఎగిరెగిరిపడొద్దు.. ఆ ఇద్దరి కెరీర్ ఏమైందో తెలుసుకో!