Congress: మరో యాత్రకు కాంగ్రెస్ శ్రీకారం.. ఈ సారి తూర్పు నుంచి పడమరకు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Congress: కాంగ్రెస్ చేపట్టిన భారత్ జోడో యాత్ర విజయవంతమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మరో యాత్రకు శ్రీకారం చుట్టనున్నట్లు తెలుస్తోంది. కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర దిగ్విజయంగా పూర్తైంది. ఆ యాత్ర దక్షిణం నుంచి ఉత్తరానికి సాగింది. మరో యాత్ర తూర్పు నుంచి పడమరకు కాంగ్రెస్ పార్టీ ప్లాన్ చేస్తోంది. పాసిఘాట్ నుంచి పోర్బందర్ యాత్రను కాంగ్రెస్ పరిశీలిస్తోందని, భారత్ జోడో యాత్రను ముందుకు తీసుకెళ్లాలని రాహుల్ గాంధీ పిలుపునిచ్చిన తర్వాత పార్టీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ ఆదివారం తెలిపారు.
గత ఏడాది సెప్టెంబరు నుంచి ఈ ఏడాది జనవరి వరకు గాంధీజీతో పాటు అనేక మంది కాంగ్రెస్ నాయకులు చేపట్టిన దాదాపు 4,000 కిలోమీటర్ల కన్యాకుమారి-కాశ్మీర్ యాత్ర తర్వాత మరో యాత్ర కోసం పార్టీ కార్యకర్తల్లో ఉత్సాహం, శక్తి పుంజుకున్నాయని రమేష్ పేర్కొన్నారు. బహుశా అరుణాచల్ ప్రదేశ్లోని పాసిఘాట్ నుండి గుజరాత్లోని పోర్బందర్ వరకు తూర్పు-పడమర యాత్రను పరిశీలిస్తున్నామని, అయితే దాని ఫార్మాట్ భారత్ జోడో యాత్ర కంటే కొంచెం భిన్నంగా ఉంటుందని జైరాం రమేష్ చెప్పారు. భారత్ జోడో యాత్ర కోసం సమీకరించబడిన అంత విస్తృతమైన మౌలిక సదుపాయాలు దీనికి లేకపోవచ్చు, తక్కువ యాత్రికులు ఉండొచ్చని ఆయన వెల్లడించారు. ఇది చాలా వరకు పాదయాత్రగా ఉంటుందని, అయితే ఈ మార్గంలో అడవులు, నదులు ఉన్నాయన్నారు. “ఇది మల్టీ-మోడల్ యాత్ర అవుతుంది, కానీ చాలావరకు ఇది పాదయాత్ర అవుతుంది” అని జైరాం రమేష్ అన్నారు.
Also Read
- Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
- Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
- Ex-Girlfriend Murder: నీకు కాబోయే భార్యను చంపేశా.. వరుడికి మాజీ ప్రియుడి షాకింగ్ కాల్..
- Pakistan: పాకిస్తాన్ మరోసారి.. భారత విమానాలపై గగనతల ఆంక్షలు పొడగింపు..
ఏప్రిల్లో కర్ణాటకలో ఎన్నికలు, జూన్లో వర్షాలు, మళ్లీ నవంబర్లో మరో ఎన్నికల నేపథ్యంలో యాత్రను జూన్లోపు లేదా నవంబర్లోపు చేపట్టాల్సి ఉంటుందని ఆయన అన్నారు. భారత్ జోడో యాత్ర కంటే ఈ యాత్ర తక్కువ వ్యవధిలో ఉంటుందని రమేష్ తెలిపారు. వీటన్నింటిపై వచ్చే కొద్ది వారాల్లో నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. కాంగ్రెస్ ప్లీనరీ సెషన్లో ప్రసంగించిన రాహుల్ గాంధీ.. భారత్ జోడో యాత్ర ద్వారా చేపట్టిన “తపస్సు”ను ముందుకు తీసుకెళ్లేందుకు పార్టీ కొత్త ప్రణాళికను రూపొందించాలని, దేశం మొత్తం అందులో తాను పాల్గొంటానని, అలాంటి మరో చొరవను సూచిస్తున్నట్లు చెప్పారు.
తాజావార్తలు
-
OTR : వైసీపీ నేతలతో టచ్.. టీడీపీ ఎమ్మెల్యేతో మ్యాచ్? కాకినాడలో హాట్ టాపిక్
-
Story Board : ఇరాన్ యుద్ధం గల్ఫ్ కు చేసిన నష్టమేంటి..? దుబాయ్ గతానికి, ప్రస్తుతానికి తేడా ఏంటి..?
-
Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
-
Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
-
Ex-Girlfriend Murder: నీకు కాబోయే భార్యను చంపేశా.. వరుడికి మాజీ ప్రియుడి షాకింగ్ కాల్..
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!