Congress: మరో యాత్రకు కాంగ్రెస్ శ్రీకారం.. ఈ సారి తూర్పు నుంచి పడమరకు..
Congress: కాంగ్రెస్ చేపట్టిన భారత్ జోడో యాత్ర విజయవంతమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మరో యాత్రకు శ్రీకారం చుట్టనున్నట్లు తెలుస్తోంది. కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర దిగ్విజయంగా పూర్తైంది. ఆ యాత్ర దక్షిణం నుంచి ఉత్తరానికి సాగింది. మరో యాత్ర తూర్పు నుంచి పడమరకు కాంగ్రెస్ పార్టీ ప్లాన్ చేస్తోంది. పాసిఘాట్ నుంచి పోర్బందర్ యాత్రను కాంగ్రెస్ పరిశీలిస్తోందని, భారత్ జోడో యాత్రను ముందుకు తీసుకెళ్లాలని రాహుల్ గాంధీ పిలుపునిచ్చిన తర్వాత పార్టీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ ఆదివారం తెలిపారు.
గత ఏడాది సెప్టెంబరు నుంచి ఈ ఏడాది జనవరి వరకు గాంధీజీతో పాటు అనేక మంది కాంగ్రెస్ నాయకులు చేపట్టిన దాదాపు 4,000 కిలోమీటర్ల కన్యాకుమారి-కాశ్మీర్ యాత్ర తర్వాత మరో యాత్ర కోసం పార్టీ కార్యకర్తల్లో ఉత్సాహం, శక్తి పుంజుకున్నాయని రమేష్ పేర్కొన్నారు. బహుశా అరుణాచల్ ప్రదేశ్లోని పాసిఘాట్ నుండి గుజరాత్లోని పోర్బందర్ వరకు తూర్పు-పడమర యాత్రను పరిశీలిస్తున్నామని, అయితే దాని ఫార్మాట్ భారత్ జోడో యాత్ర కంటే కొంచెం భిన్నంగా ఉంటుందని జైరాం రమేష్ చెప్పారు. భారత్ జోడో యాత్ర కోసం సమీకరించబడిన అంత విస్తృతమైన మౌలిక సదుపాయాలు దీనికి లేకపోవచ్చు, తక్కువ యాత్రికులు ఉండొచ్చని ఆయన వెల్లడించారు. ఇది చాలా వరకు పాదయాత్రగా ఉంటుందని, అయితే ఈ మార్గంలో అడవులు, నదులు ఉన్నాయన్నారు. “ఇది మల్టీ-మోడల్ యాత్ర అవుతుంది, కానీ చాలావరకు ఇది పాదయాత్ర అవుతుంది” అని జైరాం రమేష్ అన్నారు.
Also Read
ఏప్రిల్లో కర్ణాటకలో ఎన్నికలు, జూన్లో వర్షాలు, మళ్లీ నవంబర్లో మరో ఎన్నికల నేపథ్యంలో యాత్రను జూన్లోపు లేదా నవంబర్లోపు చేపట్టాల్సి ఉంటుందని ఆయన అన్నారు. భారత్ జోడో యాత్ర కంటే ఈ యాత్ర తక్కువ వ్యవధిలో ఉంటుందని రమేష్ తెలిపారు. వీటన్నింటిపై వచ్చే కొద్ది వారాల్లో నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. కాంగ్రెస్ ప్లీనరీ సెషన్లో ప్రసంగించిన రాహుల్ గాంధీ.. భారత్ జోడో యాత్ర ద్వారా చేపట్టిన “తపస్సు”ను ముందుకు తీసుకెళ్లేందుకు పార్టీ కొత్త ప్రణాళికను రూపొందించాలని, దేశం మొత్తం అందులో తాను పాల్గొంటానని, అలాంటి మరో చొరవను సూచిస్తున్నట్లు చెప్పారు.
తాజావార్తలు
-
Delhi: లక్ష్మీనగర్లో భారీ అగ్నిప్రమాదం.. నాలుగు ఇళ్లు దగ్ధం
-
RCB vs GT: మొదటి ఓవర్లోనే ట్విస్ట్.. ఆ ఒక్క క్యాచ్.. మ్యాచ్నే మార్చేసింది!
-
Governor Abdul Nazeer: ఏపీ గవర్నర్కు అస్వస్థత.. ఆస్పత్రికి తరలింపు..
-
Rakul Preet Singh: పెళ్లయినా ఇంకా డేటింగ్ లోనే ఉన్నాం..రకుల్-జాకీ షాకింగ్ కామెంట్స్
-
Gujarat: సూరత్లో బాలికపై లైంగిక వేధింపులు.. నిందితుడిని శిక్షించాలంటూ భారీ ఆందోళన
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!