Madhyapradesh: మధ్యప్రదేశ్లోనూ కాంగ్రెస్ ఫార్ములా అదే.. వ్యూహాన్ని మార్చుకున్న కమలం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Madhyapradesh: కర్ణాటక ఎన్నికలలో విజయం సాధించిన తర్వాత కాంగ్రెస్ పార్టీ దేశంలో దూసుకెళ్తోంది. అధికార బీజేపీపై అవినీతి ఆరోపణలు చేస్తూ ప్రజలను తమవైపు తిప్పుకునేందుకు వ్యూహాలు రచిస్తోంది. మధ్యప్రదేశ్లో కూడా కర్ణాటక తరహాలోనే అదే ఫార్ములాను ఉపయోగించాలని ప్రయత్నిస్తోంది. అధికార బీజేపీ ఉచితాలు హామీలు గుప్పించినా తమదే విజయమని హస్తం పార్టీ ధీమాతో ఉంది. మధ్యప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ పునరాగమనం చేయాలని కృతనిశ్చయంతో ఉందని కాంగ్రెస్ నేతలు తెలిపారు. కాంగ్రెస్ కొత్త పంథాను ఎదుర్కొనేందుకు బీజేపీ కూడా తన వ్యూహాన్ని మార్చుకుంది.
Read Also: Chandrayaan-3: జాబిల్లి తొలి ఫొటోలు తీసిన ల్యాండర్.. షేర్ చేసిన ఇస్రో
Also Read
- Vaibhav Sooryavanshi: బుడ్డోడికి మళ్లీ నిరాశే.. ఇంగ్లండ్తో తొలి టీ20లోనూ 'నో ఛాన్స్'.!
- Pawan Kalyan: సోషల్ మీడియా దుర్వినియోగంపై ఉక్కుపాదం మోపుతాం.. ‘ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్’ పేరుతో దూషణలు ఇక కుదరవు.!
- US: అమెరికాలో విషాదం.. ఆకస్మిక వరదల్లో ఏపీ యువకుడు మృతి
- Ishan Kishan: ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్లో పేలిన పాకెట్ డైనమెట్.. నెం.1 బ్యాటర్గా ఇషాన్ కిషన్.!
మధ్యప్రదేశ్లోని జబల్పూర్లో జూన్ 12న ర్యాలీలో కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ వాద్రా హామీల వర్షం కురిపించారు. తాము ఇచ్చిన హామీలు 100 శాతం నెరవేరుస్తామని, కర్ణాటక ప్రజలకు ఈ వాగ్దానం చేశామని, అక్కడి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే బిల్లును ఆమోదించిందని కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ వాద్రా అన్నారు. “మహిళలకు ప్రతినెలా రూ.1,500 ఇస్తాం.. రూ.500కే గ్యాస్ సిలిండర్, 100 యూనిట్ల విద్యుత్ ఉచితం.. 200 యూనిట్ల ధర సగానికి తగ్గింపు.. మధ్యప్రదేశ్లో పాత పెన్షన్ విధానం అమలు చేస్తాం, పేద రైతులకు. భారీ రుణాలలో పూర్తి రుణమాఫీ చేస్తాం.”అని ఆమె హామీలు ఇచ్చారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మధ్యప్రదేశ్లో అమలు చేయబోయే ఐదు హామీలను ఆమె వివరించారు.
మధ్యప్రదేశ్ చెస్ బోర్డుపై కాంగ్రెస్ చేసిన మొదటి ఎత్తుగడలలో ఒకటి రణదీప్ సుర్జేవాలా రాష్ట్ర బాధ్యతలు చేపట్టడం. సుర్జేవాలా గతంలో కాంగ్రెస్కు కర్ణాటక ఇంచార్జ్గా ఉన్నారు. కర్ణాటకలో అధిష్ఠానం ఆదేశంతో ఫలితాలను రాబట్టిన దక్షిణాది రాష్ట్రానికి చెందిన కాంగ్రెస్ వ్యూహకర్త సునీల్ కానుగోలు.. మధ్యప్రదేశ్లో కూడా అదే ఫలితాలను తీసుకురావడానికి పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రచార శ్రేణిలో అప్పటి అధికార పార్టీపై “40 శాతం కమీషన్” అభియోగం ఉండగా.. మధ్యప్రదేశ్లో ఆ పార్టీ ఆరోపణను 10 శాతం అదనంగా “50 శాతం కమీషన్” ఛార్జీకి పెంచింది. “కుంభమేళా లోపల కూడా అవినీతి జరిగింది, ఇక్కడ సింహస్థ మేళా ఉంది, మహాకాల్ ఆలయ నిర్మాణంలో అవినీతి జరిగింది” అని కాంగ్రెస్ నాయకుడు దిగ్విజయ్ సింగ్ అన్నారు.
Read Also: CM Sukhwinder Sukh: జల విలయాన్ని ‘రాష్ట్ర విపత్తు’గా ప్రకటిస్తున్నా..
ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని, దానికి బీజేపీ ధీటుగా సమాధానం చెబుతుందని మధ్యప్రదేశ్ బీజేపీ చీఫ్ వీడీ శర్మ అన్నారు. నకిలీ లేఖతో ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని, ఘాటుగా సమాధానం ఇస్తామని, ప్రతి కార్యకర్త ప్రియాంక గాంధీకి సమాధానం చెబుతారని, సమాధానం చెప్పాల్సింది మీరేనని, పరువునష్టం నేరానికి పాల్పడ్డారని వీడీ శర్మ విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ వ్యూహాలను పసిగట్టిన బీజేపీ.. మధ్యప్రదేశ్లో కాంగ్రెస్పై దాడి చేయడానికి కొత్త పద్ధతులను ఉపయోగిస్తోంది. బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం జరిగిన ఒక రోజు తర్వాత, మధ్యప్రదేశ్లో 39 మంది అభ్యర్థుల పేర్లను ఆ పార్టీ ప్రకటించింది. “మా సన్నాహాలు యుద్దప్రాతిపదికన జరుగుతున్నాయి. అభ్యర్థుల పేర్లను ప్రకటించడానికి కాంగ్రెస్ భయపడుతున్నట్లు కనిపిస్తోంది. మేము మా అభ్యర్థులను పేర్కొన్నాము. మా అభ్యర్థులు ఇప్పుడు రంగంలో ఉన్నారు” అని మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు.
ఇదిలా ఉండగా ఇరు పార్టీలు తమ ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్నాయి. మధ్యప్రదేశ్లో కాంగ్రెస్ డివిజన్ స్థాయిలో సమావేశాలు నిర్వహిస్తోంది. బీజేపీ తరఫున హోం మంత్రి అమిత్ షా ఆదివారం మధ్యప్రదేశ్లో పర్యటించనున్నారు, ఈ సందర్భంగా బీజేపీ తన అభ్యర్థుల మొదటి జాబితాను విడుదల చేసిన తర్వాత ప్రచారాన్ని ముమ్మరం చేయాలని చూస్తున్నందున ఆయన అనేక కార్యక్రమాలకు హాజరవుతారు.
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: బుడ్డోడికి మళ్లీ నిరాశే.. ఇంగ్లండ్తో తొలి టీ20లోనూ ‘నో ఛాన్స్’.!
-
ENG vs IND 1st T20: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్! ప్లేయింగ్ XI లో ఎవరెవరంటే?
-
Kayadu Lohar: అందుకే హిట్లున్నా లేకున్నా వరుస ఆఫర్లు!
-
Pawan Kalyan: సోషల్ మీడియా దుర్వినియోగంపై ఉక్కుపాదం మోపుతాం.. ‘ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్’ పేరుతో దూషణలు ఇక కుదరవు.!
-
US: అమెరికాలో విషాదం.. ఆకస్మిక వరదల్లో ఏపీ యువకుడు మృతి
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 10,000mAh బ్యాటరీతో Vivo Pad 5c ఎంట్రీ.. ధర ఎంతంటే?
-
Lenovo నుంచి డబుల్ ధమాకా.. Tab Plus Gen 2, LOQ మానిటర్ సిరీస్ లాంచ్.!
-
Fluffy Omelette: రెగ్యులర్ ఆమ్లెట్కు బదులుగా.. స్పాంజీలా ఉండే ‘ఫ్లఫీ ఆమ్లెట్’ చేసేయండి ఇలా.! లొట్టలేసుకుని తింటారంతే.!
-
Air Fryer vs Stove Cooking: ఎయిర్ ఫ్రయర్ Vs స్టవ్ వంట.. ఆరోగ్యానికి ఏది మంచిది.?
-
అందుబాటులోకి Aadhaar App కొత్త వెర్షన్..ఫేస్ ఆథెంటికేషన్, మొబైల్ నంబర్ అప్డేట్లతో పాటు మరిన్ని సేవలు.!