Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Story Congress Plans A Karnataka In Madhya Pradesh Bjp Strengthens Pushback

Madhyapradesh: మధ్యప్రదేశ్‌లోనూ కాంగ్రెస్ ఫార్ములా అదే.. వ్యూహాన్ని మార్చుకున్న కమలం

Published Date :August 18, 2023 , 9:47 pm
By Mahesh Jakki
Madhyapradesh: మధ్యప్రదేశ్‌లోనూ కాంగ్రెస్ ఫార్ములా అదే.. వ్యూహాన్ని మార్చుకున్న కమలం
  • Follow Us :
  • google news
  • dailyhunt

Madhyapradesh: కర్ణాటక ఎన్నికలలో విజయం సాధించిన తర్వాత కాంగ్రెస్‌ పార్టీ దేశంలో దూసుకెళ్తోంది. అధికార బీజేపీపై అవినీతి ఆరోపణలు చేస్తూ ప్రజలను తమవైపు తిప్పుకునేందుకు వ్యూహాలు రచిస్తోంది. మధ్యప్రదేశ్‌లో కూడా కర్ణాటక తరహాలోనే అదే ఫార్ములాను ఉపయోగించాలని ప్రయత్నిస్తోంది. అధికార బీజేపీ ఉచితాలు హామీలు గుప్పించినా తమదే విజయమని హస్తం పార్టీ ధీమాతో ఉంది. మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్‌ పార్టీ పునరాగమనం చేయాలని కృతనిశ్చయంతో ఉందని కాంగ్రెస్‌ నేతలు తెలిపారు. కాంగ్రెస్ కొత్త పంథాను ఎదుర్కొనేందుకు బీజేపీ కూడా తన వ్యూహాన్ని మార్చుకుంది.

Read Also: Chandrayaan-3: జాబిల్లి తొలి ఫొటోలు తీసిన ల్యాండర్.. షేర్ చేసిన ఇస్రో

మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌లో జూన్‌ 12న ర్యాలీలో కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ వాద్రా హామీల వర్షం కురిపించారు. తాము ఇచ్చిన హామీలు 100 శాతం నెరవేరుస్తామని, కర్ణాటక ప్రజలకు ఈ వాగ్దానం చేశామని, అక్కడి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే బిల్లును ఆమోదించిందని కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ వాద్రా అన్నారు. “మహిళలకు ప్రతినెలా రూ.1,500 ఇస్తాం.. రూ.500కే గ్యాస్‌ సిలిండర్‌, 100 యూనిట్ల విద్యుత్‌ ఉచితం.. 200 యూనిట్ల ధర సగానికి తగ్గింపు.. మధ్యప్రదేశ్‌లో పాత పెన్షన్‌ విధానం అమలు చేస్తాం, పేద రైతులకు. భారీ రుణాలలో పూర్తి రుణమాఫీ చేస్తాం.”అని ఆమె హామీలు ఇచ్చారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మధ్యప్రదేశ్‌లో అమలు చేయబోయే ఐదు హామీలను ఆమె వివరించారు.

మధ్యప్రదేశ్ చెస్ బోర్డుపై కాంగ్రెస్ చేసిన మొదటి ఎత్తుగడలలో ఒకటి రణదీప్ సుర్జేవాలా రాష్ట్ర బాధ్యతలు చేపట్టడం. సుర్జేవాలా గతంలో కాంగ్రెస్‌కు కర్ణాటక ఇంచార్జ్‌గా ఉన్నారు. కర్ణాటకలో అధిష్ఠానం ఆదేశంతో ఫలితాలను రాబట్టిన దక్షిణాది రాష్ట్రానికి చెందిన కాంగ్రెస్ వ్యూహకర్త సునీల్ కానుగోలు.. మధ్యప్రదేశ్‌లో కూడా అదే ఫలితాలను తీసుకురావడానికి పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రచార శ్రేణిలో అప్పటి అధికార పార్టీపై “40 శాతం కమీషన్” అభియోగం ఉండగా.. మధ్యప్రదేశ్‌లో ఆ పార్టీ ఆరోపణను 10 శాతం అదనంగా “50 శాతం కమీషన్” ఛార్జీకి పెంచింది. “కుంభమేళా లోపల కూడా అవినీతి జరిగింది, ఇక్కడ సింహస్థ మేళా ఉంది, మహాకాల్ ఆలయ నిర్మాణంలో అవినీతి జరిగింది” అని కాంగ్రెస్ నాయకుడు దిగ్విజయ్ సింగ్ అన్నారు.

Read Also: CM Sukhwinder Sukh: జల విలయాన్ని ‘రాష్ట్ర విపత్తు’గా ప్రకటిస్తున్నా..

ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని, దానికి బీజేపీ ధీటుగా సమాధానం చెబుతుందని మధ్యప్రదేశ్ బీజేపీ చీఫ్ వీడీ శర్మ అన్నారు. నకిలీ లేఖతో ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని, ఘాటుగా సమాధానం ఇస్తామని, ప్రతి కార్యకర్త ప్రియాంక గాంధీకి సమాధానం చెబుతారని, సమాధానం చెప్పాల్సింది మీరేనని, పరువునష్టం నేరానికి పాల్పడ్డారని వీడీ శర్మ విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ వ్యూహాలను పసిగట్టిన బీజేపీ.. మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్‌పై దాడి చేయడానికి కొత్త పద్ధతులను ఉపయోగిస్తోంది. బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం జరిగిన ఒక రోజు తర్వాత, మధ్యప్రదేశ్‌లో 39 మంది అభ్యర్థుల పేర్లను ఆ పార్టీ ప్రకటించింది. “మా సన్నాహాలు యుద్దప్రాతిపదికన జరుగుతున్నాయి. అభ్యర్థుల పేర్లను ప్రకటించడానికి కాంగ్రెస్ భయపడుతున్నట్లు కనిపిస్తోంది. మేము మా అభ్యర్థులను పేర్కొన్నాము. మా అభ్యర్థులు ఇప్పుడు రంగంలో ఉన్నారు” అని మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు.

ఇదిలా ఉండగా ఇరు పార్టీలు తమ ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్నాయి. మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ డివిజన్ స్థాయిలో సమావేశాలు నిర్వహిస్తోంది. బీజేపీ తరఫున హోం మంత్రి అమిత్ షా ఆదివారం మధ్యప్రదేశ్‌లో పర్యటించనున్నారు, ఈ సందర్భంగా బీజేపీ తన అభ్యర్థుల మొదటి జాబితాను విడుదల చేసిన తర్వాత ప్రచారాన్ని ముమ్మరం చేయాలని చూస్తున్నందున ఆయన అనేక కార్యక్రమాలకు హాజరవుతారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • bjp
  • congress
  • karnataka
  • Madhyapradesh
  • Madhyapradesh Assembly Elections

తాజావార్తలు

  • Israel – Iran War Live Updates : కుప్పకూలిన అమెరికా ఫైటర్ జెట్..

  • Mana Shankar Varaprasad Garu: 109 సెంటర్లలో 50 రోజులు.. సరికొత్త రికార్డు

  • Sanju Samson: గురువుకు తగ్గ శిష్యుడు.. గంభీర్ ఆటను గుర్తు చేసిన సంజూ!

  • F-15E Strike Eagle: అగ్రరాజ్యానికి బిగ్‌ షాక్.. కుప్పకూలిన అమెరికా ఫైటర్ జెట్..

  • Nikhil : నిఖిల్ ‘స్వయంభు’.. భారీ ధరకు సీడెడ్ రైట్స్.. డీల్ క్లోజ్

ట్రెండింగ్‌

  • Sanju Samson Record: సంజు శాంసన్‌ రేర్ రికార్డు.. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ రికార్డులు బ్రేక్!

  • Sanju Samson: ఈ రోజు కోసమే ఎదురుచూశా.. నా జీవితంలో ఈ ఇన్నింగ్స్‌ను మర్చిపోలేను!

  • The IQ Era థీమ్‌తో MWC 2026 నేడే ప్రారంభం.. ఏ కొత్త ఫోన్ల లాంచ్‌ కానున్నాయంటే..!

  • Virendra Sehwag-MS Dhoni: ఎంఎస్ ధోనీ అదృష్టంతో జన్మించాడు.. సెహ్వాగ్ ఆసక్తికర వ్యాఖ్యలు!

  • IND vs WI Super 8: ఈడెన్‌ గార్డెన్స్‌లో ‘కింగ్’.. అయినా భారత్‌ను వెంటాడుతున్న ఆ సమస్య!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions