Madhyapradesh: మధ్యప్రదేశ్లోనూ కాంగ్రెస్ ఫార్ములా అదే.. వ్యూహాన్ని మార్చుకున్న కమలం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Madhyapradesh: కర్ణాటక ఎన్నికలలో విజయం సాధించిన తర్వాత కాంగ్రెస్ పార్టీ దేశంలో దూసుకెళ్తోంది. అధికార బీజేపీపై అవినీతి ఆరోపణలు చేస్తూ ప్రజలను తమవైపు తిప్పుకునేందుకు వ్యూహాలు రచిస్తోంది. మధ్యప్రదేశ్లో కూడా కర్ణాటక తరహాలోనే అదే ఫార్ములాను ఉపయోగించాలని ప్రయత్నిస్తోంది. అధికార బీజేపీ ఉచితాలు హామీలు గుప్పించినా తమదే విజయమని హస్తం పార్టీ ధీమాతో ఉంది. మధ్యప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ పునరాగమనం చేయాలని కృతనిశ్చయంతో ఉందని కాంగ్రెస్ నేతలు తెలిపారు. కాంగ్రెస్ కొత్త పంథాను ఎదుర్కొనేందుకు బీజేపీ కూడా తన వ్యూహాన్ని మార్చుకుంది.
Read Also: Chandrayaan-3: జాబిల్లి తొలి ఫొటోలు తీసిన ల్యాండర్.. షేర్ చేసిన ఇస్రో
Also Read
- Jitan Ram Manjhi: కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీపై రాళ్ల దాడి.. ఇద్దరు అరెస్ట్
- RCB Vs SRH: దయాదాక్షిణ్యాలు చూపించలేదు.. ఆర్సీబీ బౌలర్లను ఆడుకున్న కాటేరమ్మ కొడుకులు..
- Twisha Sharma: ట్విషా శర్మ మృతి కేసులో భర్త సమర్థ్ సింగ్కు షాక్.. న్యాయ వృత్తి నుంచి సస్పెండ్
- Abhishek Sharma: మళ్లీ రికార్డుల వేట.. కాటేరమ్మ కొడుకు అరుదైన రికార్డు..
మధ్యప్రదేశ్లోని జబల్పూర్లో జూన్ 12న ర్యాలీలో కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ వాద్రా హామీల వర్షం కురిపించారు. తాము ఇచ్చిన హామీలు 100 శాతం నెరవేరుస్తామని, కర్ణాటక ప్రజలకు ఈ వాగ్దానం చేశామని, అక్కడి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే బిల్లును ఆమోదించిందని కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ వాద్రా అన్నారు. “మహిళలకు ప్రతినెలా రూ.1,500 ఇస్తాం.. రూ.500కే గ్యాస్ సిలిండర్, 100 యూనిట్ల విద్యుత్ ఉచితం.. 200 యూనిట్ల ధర సగానికి తగ్గింపు.. మధ్యప్రదేశ్లో పాత పెన్షన్ విధానం అమలు చేస్తాం, పేద రైతులకు. భారీ రుణాలలో పూర్తి రుణమాఫీ చేస్తాం.”అని ఆమె హామీలు ఇచ్చారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మధ్యప్రదేశ్లో అమలు చేయబోయే ఐదు హామీలను ఆమె వివరించారు.
మధ్యప్రదేశ్ చెస్ బోర్డుపై కాంగ్రెస్ చేసిన మొదటి ఎత్తుగడలలో ఒకటి రణదీప్ సుర్జేవాలా రాష్ట్ర బాధ్యతలు చేపట్టడం. సుర్జేవాలా గతంలో కాంగ్రెస్కు కర్ణాటక ఇంచార్జ్గా ఉన్నారు. కర్ణాటకలో అధిష్ఠానం ఆదేశంతో ఫలితాలను రాబట్టిన దక్షిణాది రాష్ట్రానికి చెందిన కాంగ్రెస్ వ్యూహకర్త సునీల్ కానుగోలు.. మధ్యప్రదేశ్లో కూడా అదే ఫలితాలను తీసుకురావడానికి పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రచార శ్రేణిలో అప్పటి అధికార పార్టీపై “40 శాతం కమీషన్” అభియోగం ఉండగా.. మధ్యప్రదేశ్లో ఆ పార్టీ ఆరోపణను 10 శాతం అదనంగా “50 శాతం కమీషన్” ఛార్జీకి పెంచింది. “కుంభమేళా లోపల కూడా అవినీతి జరిగింది, ఇక్కడ సింహస్థ మేళా ఉంది, మహాకాల్ ఆలయ నిర్మాణంలో అవినీతి జరిగింది” అని కాంగ్రెస్ నాయకుడు దిగ్విజయ్ సింగ్ అన్నారు.
Read Also: CM Sukhwinder Sukh: జల విలయాన్ని ‘రాష్ట్ర విపత్తు’గా ప్రకటిస్తున్నా..
ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని, దానికి బీజేపీ ధీటుగా సమాధానం చెబుతుందని మధ్యప్రదేశ్ బీజేపీ చీఫ్ వీడీ శర్మ అన్నారు. నకిలీ లేఖతో ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని, ఘాటుగా సమాధానం ఇస్తామని, ప్రతి కార్యకర్త ప్రియాంక గాంధీకి సమాధానం చెబుతారని, సమాధానం చెప్పాల్సింది మీరేనని, పరువునష్టం నేరానికి పాల్పడ్డారని వీడీ శర్మ విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ వ్యూహాలను పసిగట్టిన బీజేపీ.. మధ్యప్రదేశ్లో కాంగ్రెస్పై దాడి చేయడానికి కొత్త పద్ధతులను ఉపయోగిస్తోంది. బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం జరిగిన ఒక రోజు తర్వాత, మధ్యప్రదేశ్లో 39 మంది అభ్యర్థుల పేర్లను ఆ పార్టీ ప్రకటించింది. “మా సన్నాహాలు యుద్దప్రాతిపదికన జరుగుతున్నాయి. అభ్యర్థుల పేర్లను ప్రకటించడానికి కాంగ్రెస్ భయపడుతున్నట్లు కనిపిస్తోంది. మేము మా అభ్యర్థులను పేర్కొన్నాము. మా అభ్యర్థులు ఇప్పుడు రంగంలో ఉన్నారు” అని మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు.
ఇదిలా ఉండగా ఇరు పార్టీలు తమ ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్నాయి. మధ్యప్రదేశ్లో కాంగ్రెస్ డివిజన్ స్థాయిలో సమావేశాలు నిర్వహిస్తోంది. బీజేపీ తరఫున హోం మంత్రి అమిత్ షా ఆదివారం మధ్యప్రదేశ్లో పర్యటించనున్నారు, ఈ సందర్భంగా బీజేపీ తన అభ్యర్థుల మొదటి జాబితాను విడుదల చేసిన తర్వాత ప్రచారాన్ని ముమ్మరం చేయాలని చూస్తున్నందున ఆయన అనేక కార్యక్రమాలకు హాజరవుతారు.
తాజావార్తలు
-
Off The Record : గుంటూరు జిల్లాలో ఆ ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు అందినకాడికి దోచేస్తున్నారా..?
-
Jitan Ram Manjhi: కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీపై రాళ్ల దాడి.. ఇద్దరు అరెస్ట్
-
Off The Record : అన్నిటికీ సీఎం మాత్రమేనా.. మంత్రులు స్పందించరా..?
-
Story Board: దొరికిపోయిన బ్లాక్ టిక్కెట్ల ముఠా..
-
RCB Vs SRH: దయాదాక్షిణ్యాలు చూపించలేదు.. ఆర్సీబీ బౌలర్లను ఆడుకున్న కాటేరమ్మ కొడుకులు..
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!