Congress: ఆ ఇద్దరి నేతలకు కాంగ్రెస్ మొండిచేయి.. మరి వారి అడుగులు ఎటు..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ దూకుడు పెంచింది. ఇప్పటికే పార్టీ అభ్యర్థలను ప్రకటించడంతో పాటు వారికి బీ-ఫామ్ లు అందజేస్తుంది. అయితే, కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ దక్కని వారు వరుసగా రాజీనామాలు చేస్తున్నారు. అయితే, తాజాగా కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన నాలుగో విడతలో పటాన్ చెరు, తుంగతుర్తి కాంగ్రెస్ క్యాండీడెట్ లు ఎంపికతో బీసీ కార్డుతో ఎంట్రీ ఇచ్చిన నీలం మధుతో పాటు కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్ లను పక్కన పెట్టెసేంది.
Also Read
- Reality Check: పేదరికం VS బాలికల హక్కులు.. బాల్య వివాహాల వెనుక దాగి ఉన్న చేదు నిజాలు..
- T20 World Cup: ఆమె భర్త కోసం ప్రాక్టీస్ ఎగ్గొట్టింది.. చివరకు డ్రెస్సింగ్ రూమ్లో పరువు పోయింది..
- Off The Record: ఉదయగిరి టీడీపీలో అంతర్గత విభేదాలు? ఆయనపై అసంతృప్తి పెరుగుతోందా?
- Indian Railway: ఇండియన్ రైల్వేలో సరికొత్త విప్లవం.. టెక్నాలజీ వాడకంలో భారత్ నెక్స్ట్ లెవెల్..
ఇక, పటాన్చెరులో నీలం మధు స్థానంలో కాట శ్రీనివాస్ గౌడ్కు, తుంగతుర్తిలో మందుల సామియెల్ పేర్లను కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించింది. నిన్న ఐదుగుర్లు పేర్లను కాంగ్రెస్ వెల్లడించింది.. వారిలో సూర్యాపేటలో రాంరెడ్డి దామోదర్ రెడ్డి, మిర్యాలగూడలో బత్తుల లక్ష్మారెడ్డి, చార్మినార్ లో ముజీబ్ షరీఫ్ పేర్లను ప్రకటించింది. అయితే, నీలం మధు, అద్దంకి దయాకర్ ఇద్దరినీ నమ్మించి కాంగ్రెస్ పార్టీ గొంతు కోసింది అంటూ వారి అభిమానులు, కార్యకర్తలు ఆరోపిస్తున్నారు.
Read Also: Semifinal CWC 2023: వన్డే ప్రపంచకప్ 2023.. భారత్ సెమీస్ ప్రత్యర్థి ఎవరంటే?
ఇక, ఇప్పుడు ఈ ఇద్దరి అడుగులు ఎటు వైపు వేయనున్నారు అనేది తెలియాల్సి ఉంది. అయితే, పటాన్ చేరు కాంగ్రెస్ టికెట్ మార్పుపై ఓ వైపు సంబరాలు జరుపుకుంటుంటే, మరో వైపు నిరసనలు కొనసాగుతున్నాయి. నిన్న అర్ధరాత్రి నుంచి నీలం మధు అనుచరుల రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేస్తున్నారు. ఇక, కాట శ్రీనివాస్ గౌడ్ కు టికెట్ కేటాయించడంతో ఆయన వర్గీయులు టపాసులు కాల్చి సంబరాలు చేసుకుంటున్నారు. నీలం మధు ముదిరాజ్ కు టికెట్ ఇవ్వకపోవడంతో రాహుల్ గాంధీ, సోనియా గాంధీల దిష్ట బొమ్మలను కాల్చి వేశారు. నీలం మధు ఇంటికి భారీగా అనుచరులు చేరుకుని ఆయన సంఘీభావం తెలియజేస్తున్నారు.
Read Also: Cylinder Blast: మోతిహారిలో సిలిండర్ పేలుడు.. మంటల్లో చిక్కున్న 25 మంది
నీలం మధు ఇవాళ స్వతంత్య అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసే అవకాశం కనిపిస్తుంది. మరో వైపు అద్దంకి దయాకర్ మాత్రం తనకు టికెట్ రాకపోవడంతో పార్టీలో సైలెంట్ అయ్యారు. ఎలాంటి ప్రచార కార్యక్రమాల్లోనూ పాల్గొనడం లేదు. ముందుకు తుంగతుర్తి నుంచి తానే పోటీలో ఉంటానని చెప్పిన అద్దంకి అధిష్టానం టికెట్ కేటాయించకపోవడంతో తీవ్ర నిరాశలో ఉన్నారు.
తాజావార్తలు
-
Story Board : నాలుగోసారి గెలవడానికి.. మోడీ దగ్గరున్న త్రిశూల వ్యూహాలేంటి..?
-
Reality Check: పేదరికం VS బాలికల హక్కులు.. బాల్య వివాహాల వెనుక దాగి ఉన్న చేదు నిజాలు..
-
T20 World Cup: ఆమె భర్త కోసం ప్రాక్టీస్ ఎగ్గొట్టింది.. చివరకు డ్రెస్సింగ్ రూమ్లో పరువు పోయింది..
-
Golconda Hostel Incident : గోల్కొండ హాస్టల్లో షాక్.. బాత్రూంలో ప్రసవం, శిశువు మృతి!
-
Off The Record: ఉదయగిరి టీడీపీలో అంతర్గత విభేదాలు? ఆయనపై అసంతృప్తి పెరుగుతోందా?
ట్రెండింగ్
-
Door Cleaning Tips : దుమ్ము పట్టిన తలుపులు మెరవాలా.? కిచెన్లోనే ఉంది సూపర్ సొల్యూషన్.!
-
Kitchen Tips : చెక్క, ప్లాస్టిక్, స్టీల్.. వంటగదికి ఏ చాపింగ్ బోర్డు ఆరోగ్యకరమో తెలుసా..?
-
సూపర్కార్ డిజైన్, ఫ్లాగ్షిప్ ఫీచర్లు.. Infinix NOTE 60 Pro Pininfarina Limited Edition లాంచ్.!
-
6.39mm స్లిమ్ డిజైన్, 144Hz AMOLED డిస్ప్లే, 6000mAh బ్యాటరీతో TECNO CAMON Slim లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ తోపు అంతే.. ఐపీఎల్ 2026లో రూ.34 కోట్ల పెర్ఫార్మెన్స్!