Congress: ఆ ఇద్దరి నేతలకు కాంగ్రెస్ మొండిచేయి.. మరి వారి అడుగులు ఎటు..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ దూకుడు పెంచింది. ఇప్పటికే పార్టీ అభ్యర్థలను ప్రకటించడంతో పాటు వారికి బీ-ఫామ్ లు అందజేస్తుంది. అయితే, కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ దక్కని వారు వరుసగా రాజీనామాలు చేస్తున్నారు. అయితే, తాజాగా కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన నాలుగో విడతలో పటాన్ చెరు, తుంగతుర్తి కాంగ్రెస్ క్యాండీడెట్ లు ఎంపికతో బీసీ కార్డుతో ఎంట్రీ ఇచ్చిన నీలం మధుతో పాటు కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్ లను పక్కన పెట్టెసేంది.
Also Read
- Story Board: తెలంగాణ రాజకీయ సమీకరణాలు మారతాయా..? పవన్ ఎంట్రీతో ఎవరికి లాభం..? ఎవరికి నష్టం..?
- Congress Rajya Sabha Candidates List 2026: రాజ్యసభకు కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా.. ఖర్గే, పవన్ ఖేరా, మీనాక్షి నటరాజన్ సహా వీరికి టికెట్లు
- Robbery: బ్యాంకులో బంగారం చోరీకి ఉద్యోగి యత్నం.. సిబ్బందిపై సుత్తితో దాడి చేసి.. దారుణంగా..
- Employee Salary Freeze: ఉద్యోగులకు షాక్.. టెక్ కంపెనీ సంచలన నిర్ణయం.. జీతాల కంటే AI ముఖ్యం..!
ఇక, పటాన్చెరులో నీలం మధు స్థానంలో కాట శ్రీనివాస్ గౌడ్కు, తుంగతుర్తిలో మందుల సామియెల్ పేర్లను కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించింది. నిన్న ఐదుగుర్లు పేర్లను కాంగ్రెస్ వెల్లడించింది.. వారిలో సూర్యాపేటలో రాంరెడ్డి దామోదర్ రెడ్డి, మిర్యాలగూడలో బత్తుల లక్ష్మారెడ్డి, చార్మినార్ లో ముజీబ్ షరీఫ్ పేర్లను ప్రకటించింది. అయితే, నీలం మధు, అద్దంకి దయాకర్ ఇద్దరినీ నమ్మించి కాంగ్రెస్ పార్టీ గొంతు కోసింది అంటూ వారి అభిమానులు, కార్యకర్తలు ఆరోపిస్తున్నారు.
Read Also: Semifinal CWC 2023: వన్డే ప్రపంచకప్ 2023.. భారత్ సెమీస్ ప్రత్యర్థి ఎవరంటే?
ఇక, ఇప్పుడు ఈ ఇద్దరి అడుగులు ఎటు వైపు వేయనున్నారు అనేది తెలియాల్సి ఉంది. అయితే, పటాన్ చేరు కాంగ్రెస్ టికెట్ మార్పుపై ఓ వైపు సంబరాలు జరుపుకుంటుంటే, మరో వైపు నిరసనలు కొనసాగుతున్నాయి. నిన్న అర్ధరాత్రి నుంచి నీలం మధు అనుచరుల రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేస్తున్నారు. ఇక, కాట శ్రీనివాస్ గౌడ్ కు టికెట్ కేటాయించడంతో ఆయన వర్గీయులు టపాసులు కాల్చి సంబరాలు చేసుకుంటున్నారు. నీలం మధు ముదిరాజ్ కు టికెట్ ఇవ్వకపోవడంతో రాహుల్ గాంధీ, సోనియా గాంధీల దిష్ట బొమ్మలను కాల్చి వేశారు. నీలం మధు ఇంటికి భారీగా అనుచరులు చేరుకుని ఆయన సంఘీభావం తెలియజేస్తున్నారు.
Read Also: Cylinder Blast: మోతిహారిలో సిలిండర్ పేలుడు.. మంటల్లో చిక్కున్న 25 మంది
నీలం మధు ఇవాళ స్వతంత్య అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసే అవకాశం కనిపిస్తుంది. మరో వైపు అద్దంకి దయాకర్ మాత్రం తనకు టికెట్ రాకపోవడంతో పార్టీలో సైలెంట్ అయ్యారు. ఎలాంటి ప్రచార కార్యక్రమాల్లోనూ పాల్గొనడం లేదు. ముందుకు తుంగతుర్తి నుంచి తానే పోటీలో ఉంటానని చెప్పిన అద్దంకి అధిష్టానం టికెట్ కేటాయించకపోవడంతో తీవ్ర నిరాశలో ఉన్నారు.
తాజావార్తలు
-
Story Board: తెలంగాణ రాజకీయ సమీకరణాలు మారతాయా..? పవన్ ఎంట్రీతో ఎవరికి లాభం..? ఎవరికి నష్టం..?
-
Congress Rajya Sabha Candidates List 2026: రాజ్యసభకు కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా.. ఖర్గే, పవన్ ఖేరా, మీనాక్షి నటరాజన్ సహా వీరికి టికెట్లు
-
Robbery: బ్యాంకులో బంగారం చోరీకి ఉద్యోగి యత్నం.. సిబ్బందిపై సుత్తితో దాడి చేసి.. దారుణంగా..
-
Peddi: బుక్ మై షోలో సరికొత్త రికార్డు.. చరణ్ కెరియర్లోనే బిగ్గెస్ట్ ఓపెనర్గా ‘పెద్ది’?
-
Employee Salary Freeze: ఉద్యోగులకు షాక్.. టెక్ కంపెనీ సంచలన నిర్ణయం.. జీతాల కంటే AI ముఖ్యం..!
ట్రెండింగ్
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..
-
Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!