Congress: కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు ట్రైనింగ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ ఏర్పాటుకు రెడీ అవుతుంది. రేపు కొత్త సర్కారు కొలువుదీరనుంది. ఈ క్రమంలో కొత్తగా ఎన్నికైన కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు ఆ పార్టీ శిక్షణా తరగతులను నిర్వహిస్తోంది. ఎమ్మెల్యేల విధులు, అసెంబ్లీలో వ్యవహరించాల్సిన తీరుపై వారికి అవగాహన కల్పిస్తోంది. తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 64 సీట్లలో గెలిచింది. ఈసారి ఎన్నికైన 64 మంది ఎమ్మెల్యేల్లో చాలా మంది ఫస్ట్ టైం అసెంబ్లీలో అడుగుపెట్టారు. ఈ క్రమంలో వారితో పాటు ఎన్నికైన ఎమ్మెల్యేలందరికీ ప్రజా ప్రతినిధిగా వ్యవహరించాల్సిన తీరు, హక్కులు, బాధ్యతలు, విధులు, అసెంబ్లీ నియమ నిబంధనల గురించి ట్రైనింగ్ ఇస్తున్నారు. హోటల్ ఎల్లాలో వారికి రాజకీయ విశ్లేషకులు ప్రొఫెసర్ నాగేశ్వరరావు, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర క్రమశిక్షణ సంఘం చైర్మన్, మాజీ మంత్రి చిన్నారెడ్డి ఆధ్వర్యంలో శిక్షణ ఇస్తున్నట్లు సమాచారం.
Read Also: Cyclone Michaung: మిచాంగ్ తుఫాన్ ఎఫెక్ట్.. నేడూ పలు రైళ్ల రద్దు!
Also Read
- Sitanshu Kotak: "వైభవ్ కోసం పాతోళ్లను తీసేయలేం".. బుడ్డోడి ప్లేయింగ్-11 ఛాన్స్పై కోచ్ సంచలన ప్రకటన..
- Nandini Reddy: ‘మా ఇంటి బంగారం’ షూటింగ్లోనే సమంత ప్రెగ్నెంట్.. ఆ సీక్రెట్ నాకు మాత్రమే తెలుసు!
- Varanasi: వారణాసిపై ఒక్క హింట్ కూడా ఇవ్వలేదు బాబోయ్.. నెట్ఫ్లిక్స్ వీపీ మోనికా ఆసక్తికర వ్యాఖ్యలు!
- BSNL మాస్టర్ స్ట్రోక్.! అన్లిమిటెడ్ కాలింగ్, డేటా మాత్రమే కాదు.. OTT సబ్స్క్రిప్షన్స్ కూడా..
అయితే, తొలిసారి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి గెలిచిన వారు కాంగ్రెస్ లో చాలా మంది ఉన్నారు. అతి చిన్న వయసు ఎమ్మెల్యేలు కూడా ఆ పార్టీలోనే ఉన్నారు. ఇక, తొలిసారి ఎమ్మెల్యేగా వచ్చిన వారు.. పాలకుర్తి నుంచి యశస్విని రెడ్డి, మెదక్ నుంచి మైనంపల్లి రోహిత్ రావు, వేములవాడ నుంచి బరిలో దిగిన ఆది శ్రీనివాస్, రామగుండంలో మక్కాన్సింగ్ రాజ్ ఠాగూర్, చెన్నూరు నుంచి మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి ఉన్నారు. అలాగే, నాగార్జునసాగర్ నుంచి కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి కుమారుడు జయవీర్రెడ్డి తొలిసారి శాసనసభలో అడుగు పెట్టబోతున్నారు. అటు.. నాగర్కర్నూల్ నుంచి కూచకుళ్ల రాజేష్ రెడ్డి, కల్వకుర్తి నియోజకవర్గం నుంచి కసిరెడ్డి నారాయణరెడ్డి, ఎల్లారెడ్డి నియోజకవర్గం నుంచి కే.మదన్ మోహన్ రావు, తుంగతుర్తి నుంచి ముందుల సామేల్ తొలిసారి ఎమ్మెల్యేగా గెలుపోందారు. ఆలేరు నుంచి కాంగ్రెస్ అభ్యర్థి బీర్ల ఐలయ్య, ఖమ్మం ఎంపీగా పనిచేసిన పొంగులేటి శ్రీనివాస్రెడ్డి పాలేరు నుంచి ఎమ్మెల్యేగా తొలిసారి అసెంబ్లీలో అడుగు పెట్టారు.
తాజావార్తలు
-
Samsung Galaxy A27 5G: సామ్ సంగ్ గెలాక్సీ A27 5G రిలీజ్.. 5,000mAh బ్యాటరీ, 6.7-ఇంచెస్ AMOLED డిస్ప్లే
-
Sitanshu Kotak: “వైభవ్ కోసం పాతోళ్లను తీసేయలేం”.. బుడ్డోడి ప్లేయింగ్-11 ఛాన్స్పై కోచ్ సంచలన ప్రకటన..
-
Nandini Reddy: ‘మా ఇంటి బంగారం’ షూటింగ్లోనే సమంత ప్రెగ్నెంట్.. ఆ సీక్రెట్ నాకు మాత్రమే తెలుసు!
-
Baahubali 3 Announced: ఇండియన్ సినీ ప్రియులకు బిగ్ సర్ప్రైజ్.. ‘బాహుబలి 3′ వస్తోంది!
-
Varanasi: వారణాసిపై ఒక్క హింట్ కూడా ఇవ్వలేదు బాబోయ్.. నెట్ఫ్లిక్స్ వీపీ మోనికా ఆసక్తికర వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
BSNL మాస్టర్ స్ట్రోక్.! అన్లిమిటెడ్ కాలింగ్, డేటా మాత్రమే కాదు.. OTT సబ్స్క్రిప్షన్స్ కూడా..
-
Viral Video: ఎవరయ్యా ఈయన.. మద్యం మత్తులో 11KV విద్యుత్ స్తంభం ఎక్కి తీగలపై పడుకున్నాడు.!
-
Iron Box Cleaning : ఐరన్ బాక్స్ కింద మరకలా..? 5 నిమిషాల్లో కొత్తదానిలా..!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!