Congress MP On Yogi: యోగి కాషాయ దుస్తులపై కాంగ్రెస్ ఎంపీ వివాదాస్పద వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Congress MP On Yogi: మహారాష్ట్ర కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ హుస్సేన్ దల్వాయ్ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కాషాయ దుస్తులు ధరించడంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. “ప్రతిరోజూ మతం గురించి మాట్లాడకండి, కాషాయ దుస్తులు వేసుకోకండి, కొంచెం ఆధునికంగా మారండి. ఆధునిక ఆలోచనలను స్వీకరించండి” అని హుస్సేన్ దల్వాయ్ అన్నారు. ఆదిత్యనాథ్ తన రాష్ట్రంలో వ్యాపారాన్ని ఆకర్షించాలంటే ఆధునిక దుస్తులను ధరించడం ప్రారంభించాలని ఆయన సూచించారు. ఈ సందర్భంగా ఆయన బీజేపీపై విమర్శలు చేశారు.
వచ్చే నెలలో లక్నోలో జరగనున్న గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్కు ముందు దేశీయ పెట్టుబడిదారులను ఆకర్షించడానికి రెండు రోజుల ముంబై పర్యటనలో ఉన్న యూపీ సీఎంపై కాంగ్రెస్ నేత తీవ్రంగా విమర్శలు గుప్పించారు. యోగి ఆదిత్యనాథ్ మహారాష్ట్ర నుంచి పరిశ్రమలను తీసుకోకుండా తన సొంత రాష్ట్రంలో కొత్త పరిశ్రమలను అభివృద్ధి చేయాలని అన్నారు. ‘మహారాష్ట్ర పరిశ్రమలకు మంచి సౌకర్యాలు కల్పించిందని, కాబట్టి మహారాష్ట్ర నుంచి పరిశ్రమలను తీసుకోకుండా రాష్ట్రంలో కొత్త పరిశ్రమలను అభివృద్ధి చేయాలని.. అవి అభివృద్ధి చెందే వాతావరణం కల్పించాలని’ బుధవారం విలేకరులతో అన్నారు. పరిశ్రమ ఆధునికతకు ప్రతీక అని యూపీ సీఎం కొంత ఆధునికతను అలవర్చుకోవాలని ఆయన అన్నారు.
Also Read
- FIFA World Cup 2026: చరిత్ర సృష్టించిన కెనడా.. 'జొనాథన్ డేవిడ్' హ్యాట్రిక్ గోల్స్.! ఖతార్పై 6-0 భారీ విజయం.!
- Secunderabad: కంటోన్మెంట్లో బ్రిటిష్ పేర్లు తొలగింపు.. 21 రోడ్లు, 3 బజార్లకు వీర జవాన్లు, మహనీయుల నామకరణం!
- 60 Years of Shiv Sena: 60 ఏళ్లలో 6 ముక్కలైన శివసేన.. ఆవిరైన బాలాసాహెబ్ ఆశయాలు?
- FIFA World Cup 2026: 'మంజాంబి' డబుల్ ట్రీట్.. స్విట్జర్లాండ్ 4-1 తేడాతో ఘన విజయం.!
గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ (GIS 2023)కి విదేశీ పెట్టుబడిదారులను ఆహ్వానించడానికి, తన మంత్రులు, అధికారుల బృందం రాష్ట్రంలో వివిధ రంగాలలో ఉన్న అవకాశాలను వారికి వివరిస్తు్న్నారు. ఉత్తరప్రదేశ్ను ఒక ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడానికి, రాష్ట్రానికి భారీగా దేశీయ పెట్టుబడులను తీసుకురావడానికి ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ స్వయంగా ఇప్పుడు బాధ్యతలు చేపట్టారు. డిసెంబర్లో సీఎం యోగి మార్గదర్శకత్వంలో ఎనిమిది మంది మంత్రులు, ఉన్నతాధికారులు 16 దేశాల్లోని 21 నగరాల్లో పర్యటించి రూ. 7.12 లక్షల కోట్ల పెట్టుబడుల ప్రతిపాదనలను స్వీకరించడం గమనార్హం.
Suryanarayana Raju: బీజేపీకి ఎవరూ రాజీనామా చేయలేదు..
కాంగ్రెస్ నేత వ్యాఖ్యలపై బీజేపీ మండిపడింది. ఆ పార్టీ నేత రామ్ కదమ్ దల్వార్ మాట్లాడుతూ.. ‘‘ హిందూ మతానికి పవిత్ర రంగు అయిన కాషాయంపై కాంగ్రెస్ నాయకులకు, ఆ పార్టీకి ఎందుకు అంత ద్వేషం’’ అని ప్రశ్నించారు. కాషాయ రంగు మన జెండా, ఋషులు, సాధువుల దుస్తుల రంగు మాత్రమే కాదు. ఇది త్యాగం, సేవ, జ్ఞానం, స్వచ్ఛత, ఆధ్యాత్మికతకు చిహ్నం’’ అని అన్నారు. కాంగ్రెస్ నాయకుడి ప్రకటన కాషాయ వేషధారణతో ఉన్న దేశ దార్శనికులను, సాధువులను అవమానించడమే అవుతుందని తెలిపారు.
తాజావార్తలు
-
T20 World Cup 2026: జోష్ మీదున్న భారత్కు భారీ షాక్.. ప్రపంచ కప్కు మ్యాచ్ విన్నర్ దూరం!
-
FIFA World Cup 2026: చరిత్ర సృష్టించిన కెనడా.. ‘జొనాథన్ డేవిడ్’ హ్యాట్రిక్ గోల్స్.! ఖతార్పై 6-0 భారీ విజయం.!
-
Secunderabad: కంటోన్మెంట్లో బ్రిటిష్ పేర్లు తొలగింపు.. 21 రోడ్లు, 3 బజార్లకు వీర జవాన్లు, మహనీయుల నామకరణం!
-
Telegram: నీట్ పేపర్ లీక్ కేసు.. టెలిగ్రామ్కు ఢిల్లీ హైకోర్టులో ఎదురుదెబ్బ..
-
Sreesanth: టీమిండియాకు గౌతమ్ గంభీర్ అవసరమా?.. శ్రీశాంత్ సంచలన వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
144Hz రిఫ్రెష్ రేట్తో Hisense E8S ULED Mini-LED టీవీలు భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Tilak Varma-Siraj: తెలుగు ప్లేయర్స్ సిరాజ్, తిలక్కు లీగల్ నోటీసులు.. ఇద్దరు టాలీవుడ్ హీరోస్కు కూడా!
-
Smriti Mandhana: క్రికెట్ చరిత్రలోనే తొలి ప్లేయర్గా స్మృతి మంధాన.. పురుష క్రికెటర్లకు కూడా సాధ్యం కాని రేర్ రికార్డు!
-
పార్లమెంట్కూ చేరిన FIFA World Cup జోష్.. వైకింగ్ పడవ ప్రయాణాన్ని అనుకరించిన ఎంపీలు.! వీడియో వైరల్..
-
Sreesanth: ఆమె లేకపోతే ఆత్మహత్య చేసుకునేవాడిని.. తీహార్ జైల్లో నరకం అనుభవించా!